India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (HURL)లో 212 డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: డిప్లొమా/బీఈ/బీటెక్. జీతం: రూ.23,000 నుంచి రూ.1,40,000. పూర్తి వివరాలకు <
మనిషి శరీరానికి దెబ్బలు తగలడం, గిచ్చడం, చెంప దెబ్బలు, కొరకడం ఇలా చాలా రకాలుగా నొప్పి కలుగుతుంది. అయితే అన్నింటికంటే జుట్టు లాగడంతో కలిగే నొప్పి అత్యంత వేగంగా వస్తుందని స్వీడన్ పరిశోధకులు తెలిపారు. ఈ నొప్పికి సంబంధించిన సందేశాలు 160 Km/H వేగంతో నరాల ద్వారా మెదడుకు చేరుతాయన్నారు. ఈ నొప్పికి PIEZO2 అనే ప్రొటీన్ కారణమని తెలిపారు. ఇది తక్కువగా ఉన్న వారు జుట్టు లాగడం ద్వారా వచ్చే పెయిన్ అనుభవించరు.
TG: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమకారుడు జీఎన్ <<14342758>>సాయిబాబా<<>> అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిబాబా కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కు డొనేట్ చేస్తామని చెప్పారు. ఆయన భౌతికకాయానికి స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించిన అనంతరం డెడ్బాడీని ఆస్పత్రికి అప్పగిస్తామన్నారు.
TG: దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు కనబడుతున్నాయి. వరంగల్ తదితర నగరాల నుంచి తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్టాండ్ల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక ఛార్జీలను మరోసారి పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. ఉప్పల్ నుంచి తొర్రూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ బస్సుకు OCT 9న రూ.270 వసూలు చేయగా, ఇవాళ తొర్రూర్ నుంచి ఉప్పల్ వరకు రూ.320 వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
పూరీ జగన్నాథుడి ఆలయంలో భక్తులకు ఉచితంగా మహాప్రసాదాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వల్ల ఏటా ₹14-15 కోట్ల భారం పడుతుందన్నారు. అయితే, ఉచితంగా ప్రసాదం పంపిణీకి విరాళాలు ఇవ్వడానికి కొంత మంది భక్తులు ముందుకొచ్చినట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.
శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు. మొదటి రోజే 9 గంటలు కాకుండా 12-14 గంటలు పనిచేయాలని, అది కూడా కాంపెన్సేషన్ లేకుండా చేయాలని మేనేజర్ ఆదేశించారట. పైగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసికట్టుగా మాట్లాడడంతో శ్రేయస్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది.
తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పనితీరు, దాని ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయనానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ దశల్లో కన్సల్టెంట్లను ఎంపిక చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే ద్వారా గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనుల ప్రభావంపై కన్సల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.