India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ మళ్లీ వింటేజ్ భువీని గుర్తు చేశారు. UP T20 లీగ్లో కాశీ రుద్రాస్, లక్నో ఫాల్కన్స్ తలపడ్డాయి. లక్నో ఫాల్కన్స్ తరఫున బరిలో దిగిన భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 4 రన్స్ మాత్రమే ఇచ్చారు. అయితే వికెట్లేమీ పడలేదు. భువీ బౌలింగ్లో ప్రత్యర్థులు ఒక్క బౌండరీ కొట్టలేదు. అతడి బౌలింగ్లో రన్స్ ఇలా(0, 0, 0, 1, 0, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 1, 0, 0, 0, 1, 0) ఉన్నాయి.
రైడ్ క్యాన్సిల్ చేసిందన్న కారణంగా యువతిని అసభ్యంగా తిట్టి, చెంప దెబ్బకొట్టిన ఆటో డ్రైవర్ను బెంగళూరు మాగడి పోలీసులు అరెస్టు చేశారు. తన రైడ్ను క్యాన్సిల్ చేసిన యువతి వేరే అటో ఎక్కడంతో <<14028476>>ఆగ్రహించిన<<>> డ్రైవర్ ముత్తురాజ్(46) ఇంధన డబ్బులు ఇవ్వాలంటూ ఆమెను దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా చెంపదెబ్బకొట్టాడు. బాధితురాలు తీసిన వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో అత్యంత వేగంగా 15,000 టికెట్లు అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా అవతరించింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్కు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. USAలో మాత్రం 26న విడుదలవుతుంది.
MPలోని అశోక్ నగర్ జిల్లాలో ముంగావలిలో ఓ తల్లి నలుగురు పిల్లలను పోగొట్టుకుంది. పసిబిడ్డను ఆసుపత్రికి తీసుకురాగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాక 2రోజులకు శిశువు మరణించింది. ఇంతకుముందూ ఇలాగే సరైన చికిత్స అందక ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో పాప పోషకాహార లోపంతో ఉన్నా అధికారులు సరిగా స్పందించకపోవడం గమనార్హం. ఇది దేశంలోని వైద్య వ్యవస్థ లోపాలకు నిదర్శనం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటేనే ఓ సర్కస్ అని ఆ దేశ మాజీ ప్లేయర్ యాసిర్ అరాఫత్ విమర్శించారు. ఎప్పుడు ఏం చేస్తుందో బోర్డుకే తెలీదంటూ మండిపడ్డారు. ‘బంగ్లాతో టెస్టుల్లో పాక్ ఘోరంగా ఓడింది. ఇంగ్లండ్తో కీలక టెస్టు సిరీస్కు ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఉండాలి. కానీ విచిత్రంగా పీసీబీ వన్డే కప్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తోంది. బోర్డులో అందరూ జోకర్లే. వారి ప్రతి నిర్ణయం ఓ జోకే’ అని ధ్వజమెత్తారు.
రెజ్లర్ బజరంగ్ పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్గా కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. హరియాణాలో త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో వినేశ్ ఫొగట్, పునియా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఈరోజు కలిశారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్గా రిటైర్డ్ IAS ఆకునూరి మురళి, వ్యవసాయ కమిషన్ ఛైర్మన్గా కోదండరెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్గా జి.నిరంజన్ను నియమించింది. BC కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి నియమితులయ్యారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా అమెరికాలో వెకేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో అభిమానులతో మహేశ్, నమ్రత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తీస్తున్న SSMB29 కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఇలాగైనా సూపర్ స్టార్ను చూసుకుంటున్నామని మహేశ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా.. త్వరలో విడుదలయ్యే ‘ది లయన్ కింగ్’ సీక్వెల్లో ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 90 స్థానాల్లో 31 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లతో జాబితా రిలీజ్ చేసింది. ప్రతిపక్ష నేత భూపేందర్ హుడా గర్హి సంప్లా-కిలోయ్ నుంచి, రెజ్లర్ వినేశ్ ఫొగట్ జులానా నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ వీరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. సాంకేతిక నివేదిక అందాక ఈ మేరకు నిర్ణయించారు. అపరాజిత బిల్లు రూపకల్పనలో ప్రభుత్వం అనేక అంశాలను విస్మరించిందని పేర్కొన్నారు. బిల్లు అమలయ్యే వరకు ప్రజలు ఎదురుచూడలేరని, ఉన్న చట్టాలతోనే న్యాయం చేయాలన్నారు. హత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
Sorry, no posts matched your criteria.