News December 8, 2024

WTC: మూడో స్థానానికి భారత జట్టు

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. అడిలైడ్ టెస్ట్ తర్వాత మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (60.71%) టాప్‌కు వెళ్లింది. ఒకటో స్థానంలో ఉన్న భారత్ (57.29%) మూడో స్థానానికి వచ్చింది. సౌతాఫ్రికా (59.26%) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. BGTలో మిగతా 3 టెస్టులు గెలవకపోతే ఇండియా WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

News December 8, 2024

హిందీ గడ్డపై పుష్ప-2 సరికొత్త రికార్డు

image

పుష్ప-2 బాలీవుడ్‌లో అదరగొడుతోంది. 3 రోజుల్లోనే ₹205 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో జవాన్(₹180Cr), యానిమల్(₹176Cr), పఠాన్(₹161Cr) సినిమాలను అల్లు అర్జున్ వెనక్కు నెట్టారు. అలాగే హిందీలో తొలి 3 రోజుల్లో రెండు రోజులు ₹70Cr మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ మూవీ గురువారం ₹72Cr, శుక్రవారం ₹59Cr, శనివారం ₹74Cr సాధించింది.

News December 8, 2024

యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం: జెలెన్‌స్కీ

image

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్‌తో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా, న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం, ప్రజల భద్రతపై చర్చించినట్లు పేర్కొన్నారు. వార్ ముగింపు విషయంలో ట్రంప్ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.

News December 8, 2024

విషాదం: వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో బాలుడు మృతి

image

TG: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వనపర్తి(D) బలిజపల్లి ZP హైస్కూల్‌లో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. సీఎం కప్ పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ సాయి పునీత్(15) అనే టెన్త్ క్లాస్ బాలుడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News December 8, 2024

AUSvsIND: అమ్మాయిలూ ఓడిపోయారు!

image

ఈరోజు భారత్‌ను ఆస్ట్రేలియా రెండు వేర్వేరు మ్యాచుల్లో ఓడించింది. ఓవైపు అడిలైడ్ టెస్టులో గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిస్బేన్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల్ని ఆస్ట్రేలియా ఉమెన్ ఓడించారు. 372 రన్స్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ 44 ఓవర్లలో 249కి ఆలౌటైంది. దీంతో 3 మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

News December 8, 2024

RECORD: పెంట్ హౌస్‌కు రూ.190కోట్లు

image

హరియాణాలోని గురుగ్రామ్‌లో DLF కామెలియాస్‌లో ఓ పెంట్ హౌస్ అపార్ట్‌మెంట్ (16,290 sq ft) ₹190కోట్లకు అమ్ముడైంది. ఒక్క sq ft ₹1.8లక్షలు పలికి దేశంలోనే అత్యధిక ధర పలికిన ఫ్లాట్‌గా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. దీనిని ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్ వేర్ సంస్థ డైరెక్టర్ రిషి పార్తీ కొన్నారు. కార్పెట్ ఏరియాల్లో ఈ ధరే అత్యధికమని, ముంబైలో sq ftకి ₹1,62,700 ఉండొచ్చని రియల్ ఎస్టేట్ అనలిస్టులు చెబుతున్నారు.

News December 8, 2024

చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా VSR వ్యాఖ్యలు: వర్ల రామయ్య

image

AP: ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను డీజీపీ, HRC సీరియస్‌గా తీసుకోవాలన్నారు. VSR, అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని విజయసాయి విమర్శించిన విషయం తెలిసిందే.

News December 8, 2024

మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదు చేయలేదు: పీఆర్ టీమ్

image

మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర <<14823100>>ఫిర్యాదులు<<>> చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

News December 8, 2024

డాకు మహారాజ్‌కు మాస్ మహారాజా వాయిస్ ఓవర్?

image

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. బాలయ్య పాత్రను మాస్ మహారాజా పరిచయం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారని టాలీవుడ్ టాక్. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News December 8, 2024

మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది: సీఎం రేవంత్

image

TG: ఏడాది పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని CM రేవంత్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, 55,000 జాబ్స్ అందించామని, 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని ట్వీట్ చేశారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.