India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘కిస్సిక్’ సాంగ్తో మెరిసిన శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగ్స్కు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప-2కు ఉన్న క్రేజ్, పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ కావడంతో ‘కిస్సిక్’ సాంగ్కు ఒప్పుకున్నట్లు సమాచారం. అటు, ఈ నెల 25న ఆమె నటించిన ‘రాబిన్హుడ్’ విడుదల కానుంది.

దుబాయ్ వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ తుదిసమరం జరగనుంది. ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి. 8సార్లు కప్ గెలిచిన భారత్ ఓ వైపు, డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ మరోవైపు విజయం కోసం వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఇండియా టీమ్లో 13ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో అదరగొడుతుండగా, ఆయుశ్ మెరుగైన సహకారం అందిస్తున్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్లో పటిష్ఠంగా కనిపిస్తుండటంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది.

TG: మాజీ CM KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా KCR సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు నేడు ఛార్జిషీట్ విడుదల చేయనున్నారు.

BGT రెండో టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో ఉంది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 29రన్స్ వెనుకంజలో ఉంది. పంత్(28), నితీశ్ రెడ్డి(15) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మూడో రోజు వికెట్లు కాపాడుకుంటూ ఆస్ట్రేలియాకు 250+ రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే గెలిచే అవకాశాలున్నాయి. రెండు ఇన్నింగ్స్లోనూ IND టాప్ఆర్డర్ విఫలమైన విషయం తెలిసిందే.

పశ్చిమ బెంగాల్లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్ను పోలీసులు అడ్డుకున్నారు.

AP: రేషన్ బియ్యంతో తమ కుటుంబానికి సంబంధం లేదని, సిట్ విచారణకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 6 నెలల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును నాశనం చేయొద్దని కోరారు. ప్రభుత్వ చర్యలతో ఎగుమతిదారులు భయపడుతున్నట్లు చెప్పారు. కేసులు ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు.

TG: దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఒకవేళ జరిగినట్లు నిరూపిస్తే తామంతా వచ్చి క్షమాపణలు చెబుతామని ప్రధాని మోదీ, కేసీఆర్లకు సవాల్ విసిరారు. దేశంలో BJP ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కడతామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే అడ్డుపడుతున్నాయని, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని సీఎం నిలదీశారు.

కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని స్కీములు..
➤ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
➤ సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
➤ కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
➤ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
➤ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%

అడిలైడ్లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నేడు HYD ట్యాంక్బండ్పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో షో జరగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ షో జరగనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి షో ముగిసే వరకు ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.