India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: జూన్ 22, శనివారం జ్యేష్ఠమాసం
శు.పౌర్ణమి: ఉ.06:37 గంటలకు
బ.పాడ్యమి: ఉ.05:13 గంటలకు
మూల: సా.05:54 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.05:36-07:21 గంటల వరకు
వర్జ్యం: సా.04:20-05:54 గంటల వరకు
✒ CSIR UGC-నెట్ వాయిదా: NTA
✒ కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే
✒ AP: MLAలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల ప్రమాణస్వీకారం
✒ AP: స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
✒ AP: ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై పవన్ నిలదీత
✒ AP: మద్యంపై CBI విచారణ జరిపించాలి: పురందీశ్వరి
✒ TG: గనుల వేలంపై CM ఎందుకు ప్రశ్నించరు?: KTR
✒ రూ.2 లక్షల రైతు రుణమాఫీకి కేబినెట్ గ్రీన్సిగ్నల్
✒ INCలో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి
అప్పట్లో ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కలవమని చెప్పినట్లు హీరోయిన్ ఇషా కొప్పికర్ తెలిపారు. కానీ తాను ఆయన విజ్ఞప్తిని తిరస్కరించానని చెప్పారు. ‘18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా. నన్ను చాలా మంది అసభ్యంగా తాకేవారు. పని కావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలని కొందరు సలహాలిచ్చేవారు’ అంటూ ఆమె వాపోయారు. కాగా చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ సినిమాల్లో ఇషా నటించారు.
T20WC సూపర్-8లో ఇంగ్లండ్కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సఫారీ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో డికాక్(65), మిల్లర్(43) అదరగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్ 61కే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్రూక్(53), లివింగ్స్టోన్(33) పోరాడినా ఫలితం లేకపోయింది.
మరోసారి అఫ్గానిస్థాన్కు బీసీసీఐ అండగా నిలిచింది. బంగ్లాదేశ్తో జరిగే సిరీస్ను ఆ జట్టు భారత్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అన్ని మ్యాచ్లూ నోయిడా స్టేడియం కాంప్లెక్స్లో జరగనున్నాయి. జులై 25 నుంచి ఆగస్టు 6 వరకు ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. కాగా 2017లో ఐర్లాండ్-అఫ్గాన్ సిరీస్ కూడా ఇదే వేదికలో జరిగిన సంగతి తెలిసిందే.
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా’ అంటూ APలో నంబర్ ప్లేట్లు ఎంతో ఫేమస్ అయ్యాయి. అదే స్టైల్లో వికారాబాద్(D) కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్కు చెందిన నరేశ్ తన బైక్ వెనుక ‘కొడంగల్ CM తాలుకా’ అని రాయించుకున్నాడు. పోలీసులు అతడిని ఆపి.. నంబర్ ప్లేట్లపై ఇలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. ‘నేను సీఎం మనిషిని.. నా బైకే ఆపుతారా’ అని ఆ యువకుడు ఎదురుప్రశ్నించడంతో.. పోలీసులు అతడి బైకును సీజ్ చేశారు.
AP: రాష్ట్రంలో మరో రెండు పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లను ‘బాల సంజీవని’గా మార్చింది. ఈ స్కీమ్ కింద గర్భిణీలు, బాలింతలకు నెలకు 2 కేజీల రాగి పిండి, కేజీ అటుకులు, 250 గ్రా.బెల్లం, 250 గ్రా.చిక్కీ, ఎండు ఖర్జూరం, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, కేజీ పప్పు, తదితర రేషన్ సరుకులు అందిస్తారు.
వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా పగలుతోపాటు రాత్రి వేళ ఉష్ణోగ్రతలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏటా 50-80 రాత్రుళ్లు సగటు టెంపరేచర్ 25 డిగ్రీల పైన నమోదవుతోంది. దీనివల్ల నిద్ర, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయని, మరణాల ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది. కాగా ఈ నెల 18న ఢిల్లీలో రాత్రి ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు నమోదైంది. గత 12 ఏళ్లలో ఇదే అత్యధికం.
AP: రాష్ట్రంలో రబీ కరవు పరిస్థితులపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే రూ.319 కోట్లు ఇవ్వాలని విపత్తుల శాఖ అధికారి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కోరారు.
TG: రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తన సారథ్యంలోని మంత్రివర్గం నిలబెట్టుకుందని సీఎం రేవంత్ అన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. ‘నా జీవితంలో ఈరోజు చరిత్రాత్మకం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.