India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాము మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదని, ఇదో రికార్డు అని తెలిపారు. శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలిచ్చామో అసెంబ్లీలో రుజువు చేస్తామని, కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ఉద్యోగాలపై BRS చెప్పిందే బీజేపీ చెప్పిందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55వేల ఉద్యోగాలిచ్చారని నిరూపిస్తే ఢిల్లీలో క్షమాపణలు చెప్తానని సవాల్ విసిరారు.

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాట మిర్చికి అరుదైన ఘనత లభించింది. దీనికి జీయో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్(IPO) ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటా వలె ఉంటాయి. ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్లో రూ.లక్ష ధర పలకడం గమనార్హం.

రిషభ్ పంత్ను IPL వేలంలో LSG రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని పంత్ వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ హేమాంగ్ బదానీ వెల్లడించారు. ‘పంత్ వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తానెంత ధర పలుకుతానో చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా వినలేదు. అన్నట్లుగానే భారీ ధర పలికాడు. మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది’ అని పేర్కొన్నారు.

TG: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సా.6.05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఆహ్వానం పంపారు.

CM సిద్దరామయ్య, తన మధ్య ఎలాంటి పవర్ షేరింగ్ ఫార్ములా లేదని DK శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడవద్దన్నారు. తానెప్పుడూ ఏ ఫార్ములా గురించి మాట్లాడలేదని, రాజకీయ అవగాహనతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే CMతో ఒప్పందం కుదిరిందని ఇటీవల DK వ్యాఖ్యానించగా, అలాంటి ఒప్పందం ఏమీ లేదని CM కొట్టిపారేశారు. దీంతో రచ్చ మొదలైంది.

మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ పేరును మార్చాలని నిర్ణయించింది. ఇటీవల SUV మోడల్స్లో BE 6e విడుదల చేసింది. అయితే మోడల్ పేరులో 6e వాడకంపై విమానయాన సంస్థ IndiGo అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఏళ్లుగా తమ బ్రాండ్ ఐడెంటిటీలో 6eని వాడుతున్నామని, దీనిపై తమకు ట్రేడ్మార్క్ హక్కులు ఉన్నాయంటూ వాదించింది. దీంతో మహీంద్రా తన BE 6e మోడల్ను BE 6గా మార్చింది.

TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.

వారంలో ఒక రోజు మద్యం సేవించినా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లివర్ డాక్టర్గా పేరొందిన సిరియాక్ ఫిలిప్ వారంలో ఒక రోజు మద్యం సేవించే 32 ఏళ్ల యువకుడి లివర్ దెబ్బతిన్న తీరును ప్రత్యేక్షంగా చూపించారు. ఆ యువకుడి భార్య ఇచ్చిన ఆరోగ్యవంతమైన లివర్తో దాన్ని పోలుస్తూ పంచుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఏ మోతాదులో తీసుకున్నా మద్యపానం హానికరమని చెబుతున్నారు. Share It.

అన్స్టాపబుల్ షోలో హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్గా చేస్తానని చెప్పారు. ఈ షోకు నవీన్ పొలిశెట్టి, శ్రీలీల అతిథులుగా రాగా వారితో సరదాగా సంభాషించారు. మరోవైపు తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘భైరవ ద్వీపం’ అని నవీన్ చెప్పారు. తన ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లే అని, తాను మాత్రం నటనను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.

BGTలో భారత పేసర్ షమీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతనికి NCA నుంచి క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు కారణం. అతను టెస్టుల్లో బౌలింగ్ చేసేంత ఫిట్గా ఉన్నారా లేదా అనే దానిపై NCA టీమ్ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. అతడిని AUSకు పంపకపోవచ్చని, పంపినా చివరి టెస్టులో మాత్రమే ఆడతారని BCCI వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం SMAT T20లో బెంగాల్ తరఫున ఆడుతున్నారు. ఎల్లుండి చండీగఢ్తో బెంగాల్ ప్రీ QF ఆడనుంది.
Sorry, no posts matched your criteria.