News September 7, 2024

మాజీ సీఎంపై గ్యాంగ్‌స్టర్ భార్య పోటీ

image

హరియాణాలో కాంగ్రెస్‌ కీలక నేతను ఎదుర్కొనేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. గార్హీ నుంచి పోటీలో ఉన్న మాజీ CM భూపిందర్ సింగ్ హుడాపై గ్యాంగ్‌స్టర్ రాజేశ్ సర్కార్ భార్య మంజు హుడాను బరిలో నిలిపింది. మాజీ DSP ప్రదీప్ కూతురైన ఆమె ప్రస్తుతం రోహ్‌తక్ జిల్లా ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. భర్త గ్యాంగ్‌స్టర్, తండ్రి సీనియర్ పోలీస్ కావడంతో స్థానికంగా మంజూకు కలిసొస్తుందని BJP భావిస్తోంది. OCT 5న ఎన్నికలు జరగనున్నాయి.

News September 7, 2024

OTTలోకి ‘ది గోట్’ వచ్చేది ఎప్పుడంటే?

image

తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూల్స్ ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలో రావాల్సి ఉంటుంది. అంటే దీపావళికి లేదా నవంబర్ తొలి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్‌లో కనిపించారు. ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.

News September 7, 2024

ఈ తల్లీకూతుళ్లు యమ డేంజర్

image

AP: ఆపదలో ఉన్నామంటూ అప్పు తీసుకొని సైనైడ్‌తో వారి ప్రాణాలు తీస్తున్న కిరాతక తల్లీ కూతుళ్లు, ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలికి చెందిన వెంకటేశ్వరి(32) భర్తను వదిలేసి తల్లి రమణమ్మతో ఉంటోంది. జల్సాలకు అలవాటుపడి నలుగురి వద్ద భారీగా అప్పులు చేశారు. వారికి కూల్‌డ్రింక్స్, మద్యంలో సైనైడ్ కలిపి చంపేశారు. ఓ హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు లోతుగా విచారించగా వీరి దురాగతాలు బయటపడ్డాయి.

News September 7, 2024

‘ఉగ్ర’పోరులో కాలు తెగినా.. ‘ఒలింపిక్’ పతకం గెలిచాడు

image

పారిస్ పారాలింపిక్స్‌లో నాగాలాండ్ నుంచి పాల్గొన్న ఏకైక అథ్లెట్ హొకాటో సీమా షాట్ పుట్‌లో కాంస్య పతకం సాధించారు. ఇతని జీవిత కథ ఎంతో స్ఫూర్తినిస్తోంది. 18ఏళ్లకే ఆర్మీలో చేరిన హొకాటో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో పాల్గొన్నారు. 2002లో ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో ఓ కాలు తెగిపోయింది. అయినా నిరుత్సాహపడకుండా క్రీడలపై దృష్టిసారించి పతకాలు సాధిస్తున్నారు. ఇతను రియల్ వారియర్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News September 7, 2024

మన గణపయ్య.. పాన్ వరల్డ్

image

విఘ్నాలను తొలగించే గణపయ్య వరల్డ్ ఫేమస్. విదేశాల్లోనూ పలు పేర్లతో పూజలందుకుంటున్నాడు. థాయ్‌లాండ్ ప్రజలు లంబోదరుడిని ‘ఫిరా ఫికానెట్’ పేరుతో పిలుస్తారు. టిబెట్‌లో మహారక్త గణపతి రూపాల్లో ఆరాధిస్తారు. ఇండోనేషియాలో మాంత్రిక కర్మలలో అడ్డంకులు తొలగించే దేవునిగా వినాయకుడిని భావించి కొలుస్తారు. చైనాలో ‘హువాంగ్ సీ టియాన్’, జపాన్‌లో ‘కంగిటెన్’ అని పిలుచుకుంటారు. కాంబోడియా, అఫ్గాన్‌లోనూ ఏకదంతుడి ఆలయాలున్నాయి.

News September 7, 2024

తిరుమల క్యూలో గుండెపోటుతో మహిళ మృతి

image

AP: వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. కడపకు చెందిన ఝాన్సీకి ఇద్దరు కవల పిల్లలున్నారు. కాగా అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తమ కూతురు చనిపోయిందని తండ్రి బోరున విలపించాడు.

News September 7, 2024

గణేశ్ పూజ.. ఈ మంత్రం పఠించాలి

image

వినాయక చవితి సందర్భంగా దేవుడికి పూజ చేస్తూ..
‘‘ఓం గన్ గణపతయే నమో నమః
శ్రీ సిద్ధివినాయక నమో నమః
అష్టవినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా’’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇది దేవుడి గొప్ప గుణగణాలను కొనియాడే మంత్రం. జ్ఞానం, తెలివికి అధిపతి అయిన గణేశుడికి నమస్కరిస్తున్నానని దీనర్థం. విఘ్నేశ్వరుడిలోని లక్షణాలు మన జీవితంలోనూ అలవడాలని కోరుకోవాలి.

News September 7, 2024

బాబర్‌కు షాక్.. పాకిస్థాన్ కెప్టెన్‌గా రిజ్వాన్?

image

పాకిస్థాన్ T20, ODI కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్‌ను తప్పించాలని PCB నిర్ణయించినట్లు సమాచారం. అతని స్థానంలో కీపర్ రిజ్వాన్‌ను నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్‌లో AUSతో జరిగే సిరీస్ నుంచి ఈ మార్పులు జరిగే ఛాన్సుంది. రిజ్వాన్ ఓకే చెబితే టెస్ట్ కెప్టెన్సీ కూడా అతడికే ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. షాన్ మసూద్ కెప్టెన్సీలో ఇటీవల BANపై PAK టెస్ట్ సిరీస్ ఓడిన సంగతి తెలిసిందే.

News September 7, 2024

వినాయకుడి స్త్రీ శక్తి రూపం గురించి తెలుసా?

image

త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్లకు స్త్రీ శక్తిరూపాలున్నాయి. అలాగే వినాయకుడికీ ఉంది. పూర్వం పార్వతీదేవిని అంధసారుడు మోహించగా, శివయ్య అతడిని త్రిశూలంతో చీల్చేస్తాడు. అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతి అందరు దేవుళ్లూ ఏకంకావాలని పిలుపునిస్తుంది. ఆ క్రమంలోనే వినాయకుడి నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటికొస్తుంది. ఈమెను గణేశ్వరి, వినాయకి అని పిలుస్తారు.

News September 7, 2024

రేషన్, ఆధార్ కార్డులు లేకున్నా ఉచిత సరుకులు: మంత్రి నాదెండ్ల

image

AP: విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాలు, పాలు, వాటర్ బాటిల్స్, యాపిల్స్, బిస్కట్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం వేగంగా సాగుతోంది. తొలి రోజు 15వేల కుటుంబాలకు ఇవ్వగా, ఇవాళ మరో 40 వేల ఫ్యామిలీలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్, రేషన్ కార్డులు లేనివారి నుంచి మొబైల్ నంబర్, కుటుంబ వివరాలు తీసుకుని ఉచిత సరుకులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.