India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామాయణం ఆధారంగా ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు వేసిన నాటకం విమర్శలకు దారి తీసింది. మార్చి 31న రాహోవన్ పేరిట చేసిన ఆ నాటకం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో నాటకం వేసిన వారిలో కొంతమందికి యాజమాన్యం తలా రూ.1.2లక్షల జరిమానా విధించింది. మరికొంతమందికి రూ.40వేలు, జూనియర్ స్టూడెంట్స్కు హస్టల్ నిషేధం వంటి శిక్షల్ని విధించింది.
భారత్ సంపద మరో 50ఏళ్లలో 10రెట్లు (1000%) పెరుగుతుందని NSE ఎండీ ఆశీష్ కుమార్ అంచనా వేశారు. యువత ద్వారా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వీస్ సెక్టార్ భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్యం, రవాణాకు సంబంధించి దేశం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.
TG: పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ‘నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.
T20 WC సూపర్-8లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకుంటానని అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘మేం ఏదో ఫార్మాలిటీకి ఆడట్లేదు. కప్ గెలవడం మా లక్ష్యం. టీం ఇండియా బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి పెంచుతా. అయితే ఔట్ అవుతా లేదా దూకుడుగా ఆడతా’ అని తెలిపారు.
తాడేపల్లిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో తమ నేతలకు పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు. ‘శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు అప్పుడప్పుడూ ఓడిపోయారు. చివరికి ప్రతి ఒక్కరు అర్జునుడిలా విజయం సాధిస్తారు. 99శాతం హామీల అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం’ అని పేర్కొన్నారు.
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ, కేజ్రీవాల్ తరఫు వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఢిల్లీ కోర్టు రిజర్వులో ఉంచింది.
AP: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మృతిచెందిన వారిని పరామర్శించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఆయన మళ్లీ ఓదార్పు యాత్ర చేయనున్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
టీమ్ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2011లో సరిగ్గా ఇదేరోజు ఆ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్లేయర్గా, కెప్టెన్గా టెస్ట్ క్రికెట్కు ఆయన అందించిన సేవలను ఫ్యాన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. టెస్టుల్లో 113 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 191 ఇన్నింగ్స్లలో 49.15 యావరేజ్తో 8,848 రన్స్ చేశారు. అందులో 29 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలున్నాయి. కెప్టెన్గా 40 విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో తనకు రక్షణ లేదని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్ పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న అధికారి, అతడి బృందం నుంచి నాకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని సీఎం మమతకు కూడా చెప్పాను. అయినా అటునుంచి ఎటువంటి స్పందనా లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన పవన్ నేడు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో భేటీ అయ్యారు. ఉదయం 10 గం. నుంచి అధికారులతో చర్చలు మొదలుపెట్టారు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలనలో తన మార్క్ను చూపుతున్నారు.
Sorry, no posts matched your criteria.