News December 7, 2024

టీ బ్రేక్: ఆసీస్ స్కోర్ 191/4

image

అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి 191/4 స్కోర్ చేశారు. క్రీజులో ట్రావిస్ హెడ్(54), మిచెల్ మార్ష్(2) ఉన్నారు. ఖవాజా 13, నాథన్ 39, లబుషేన్ 64, స్టీవ్ స్మిత్ 2 పరుగులకు ఔటయ్యారు. బుమ్రా 3 వికెట్లు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 11 పరుగుల లీడ్‌లో ఆసీస్ ఉంది.

News December 7, 2024

అల్లు అర్జున్‌పై జనసేన అడ్వకేట్ తీవ్ర వ్యాఖ్యలు

image

AP: హీరో అల్లు అర్జున్‌పై జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరి తీవ్ర విమర్శలు చేశారు. ‘నీకు సినిమాకు రూ.300 కోట్ల రెమ్యునరేషన్ కావాలా? కలెక్షన్లు రూ.2వేల కోట్లు ఉండాలా? నీ మూవీకి వచ్చి బలైన కుటుంబానికి కేవలం రూ.25 లక్షలు ఇస్తావా? నీకు, నీ నిర్మాతలకు సిగ్గు శరం, ఉచ్చనీచం ఉందా? మిమ్మల్ని మనుషులంటారా? మానవత్వం ఉందా? కేసు మాఫీ కోసం ముష్టి వేశారా?’ అని ట్వీట్ చేశారు.

News December 7, 2024

పుష్ప-2 మూవీపై విమర్శలు.. స్పందించిన జాన్వీకపూర్

image

పుష్ప-2 మూవీ కారణంగా ఇంటర్ స్టెల్లార్ సినిమాకు థియేటర్లు దొరకడం లేదన్న విమర్శలపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. ‘ఇది మన సినిమా. వేరే చిత్రాల కోసం దీన్ని తక్కువ చేయవద్దు. పక్క సినిమాలపై మోజుతో మన దేశ సినిమాలను చిన్న చూపు చూస్తామా? పక్క దేశాలు మన సినిమాలను ప్రశంసిస్తుంటే మనం ఏం చేస్తున్నాం. ఇది బాధాకరం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో జాన్వీని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

News December 7, 2024

ఒక్కరోజులోనే రైతుల ఖాతాల్లో రూ.94 కోట్లు జమ: మంత్రి నాదెండ్ల

image

AP: ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 1,67,299 మంది రైతుల నుంచి 11.63 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 40,811 టన్నుల ధాన్యాన్ని కొని రైతుల ఖాతాల్లో రూ.94 కోట్లు జమ చేశామన్నారు. ప్రస్తుతం రైతులు సమీపంలోని ఏ మిల్లుకైనా ధాన్యాన్ని తరలించుకునే సౌలభ్యం కల్పించామని తెలిపారు. 48 గంటల్లోనే వారికి డబ్బులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

News December 7, 2024

బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

image

ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఫొటో షేర్ చేసి నవమాసాలు గడిచిన రోజులను గుర్తుచేసుకుంది. ‘తల్లి డ్యూటీ చేస్తూ ఎన్నో కోరికలను కోరుతూ 2024ను ముగిస్తున్నా. 9 నెలలు నా కడుపులో మోసి అచ్చం తనలాగే ఉండే ఒక బేబీని భర్తకు బెస్ట్ బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చా’ అని పోస్ట్ చేసింది. తెలుగులో మన్మథుడు-2, దాస్ క దమ్కీ, హరోం హర, ద వారియర్, పలు కన్నడ, తమిళ సినిమాల్లోనూ ఆమె నటించారు.

News December 7, 2024

BRS, కాంగ్రెస్, రేపు మరో పార్టీ తెలంగాణ తల్లిని మార్చొద్దంటే..

image

తెలంగాణ తల్లి.. ఒక పార్టీనో, ఒక వర్గాన్నో ప్రతిబింబించేది కాదు. ఈ నేల, ఇక్కడి ప్రజలు, వనరులు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల ఉనికికి ప్రతిరూపం. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ అంతకుముందున్న పార్టీ రూపొందించిన విగ్రహం అందర్నీ ప్రతిబింబించదని మార్చేస్తానంటే జాతి నవ్వుల పాలవుతుంది. అందుకే పదేపదే మార్చకుండా చట్టసభల్లో చర్చించి, అందరూ ఆమోదించాక ప్రతిష్ఠిస్తే మేలని మేధావులు అంటున్నారు. మీరేమంటారు?

News December 7, 2024

మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ నచ్చడం లేదా!

image

ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న తీరు మమతా బెనర్జీకి ఇష్టం లేనట్టుంది. ‘గ్రూపును నడపడం వాళ్లకు చేతకాకుంటే నేనేం చేయగలను’ అని ఆమె చెప్పడం గమనార్హం. ఒకవేళ నచ్చితే ఇప్పుడు బాగానే నడిపిస్తున్నారని చెప్పేవారు కదాని విశ్లేషకులు అంటున్నారు. లోక్‌సభ ఫలితాల తర్వాత మెసేజ్ చేసినా రాహుల్ స్పందించలేదని, అయినా తనకేం ఇబ్బంది లేదని ఆమె గతంలో చెప్పారు. అదానీ అంశంపైనా ఆమె సైలెంట్‌గా ఉండటం గమనార్హం.

News December 7, 2024

కస్టమర్లకు షాక్: కార్ల ధరలు పెంచిన మరో కంపెనీ

image

M&M కార్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే DEC లోపు కొనేయండి. ఎందుకంటే 2025 JAN 1 నుంచి ధరలను 3% మేర పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, ముడి వనరులు, వాహనం విడిభాగాల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని తెలిపింది. ఈ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదంది. ఈ రెండ్రోజుల్లోనే మారుతీ సుజుకీ, హ్యూందాయ్ మోటార్స్, JSW MG మోటార్స్ ధరలు పెంచడం తెలిసిందే. మిగిలిన కంపెనీలూ ఇదే దారి అనుసరించే అవకాశముంది.

News December 7, 2024

ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి: CM రేవంత్

image

TG: ఏడాది ప్రజాపాలనలో చాలా సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్లో తెలిపారు. ‘ఉద్యమాలను, ఆత్మబలిదానాలను, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023న తెలంగాణ నా చేతుల్లో పెట్టింది. తన వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది. నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నాను’ అని పేర్కొన్నారు.

News December 7, 2024

బీసీసీఐ సరైన పని చేసింది: యూసుఫ్

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపించకుండా బీసీసీఐ సరైన పని చేసిందని మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘బీసీసీఐ ఎప్పుడూ భారత ఆటగాళ్ల భద్రత గురించే ముందు ఆలోచిస్తుంది. ఆదాయం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంది’ అని కొనియాడారు. వచ్చే ఏడాది పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. ఆ దేశంలో తమ మ్యాచుల్ని ఆడేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.