India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో అందరి దృష్టి ఎన్టీఆర్ ‘దేవర’పై పడింది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి’ రిలీజ్ తర్వాత వచ్చే స్టార్ హీరో సినిమా ‘దేవర’ ఒకటే. దీంతో సెప్టెంబర్ 17న రిలీజయ్యే ఈ మూవీ ఫిల్మ్ మార్కెట్లో హాట్ కేక్లా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘పుష్ప-2’ AUG 15న రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాకపోవడంతో పోస్ట్ పోన్ అయింది.
TG: గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను BRS సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రొ.కోదండరాం మండిపడ్డారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్లో ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని, నీటిమట్టం పెరిగితే ప్లాంట్ను కాపాడుకోలేమన్నారు. KCR సర్కార్ తొందరపాటు వల్ల ట్రాన్స్కో, జెన్కోలు రూ.81వేల కోట్ల అప్పులయ్యాయని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను కలిసిన సందర్భంగా కోదండరాం చెప్పారు.
AP: రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 25న నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 5 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జులై 12న ఎన్నికలు, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా, టీడీపీలో చేరడంతో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడటంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
AP: ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ నెల 19న, ఆ తర్వాత 24 నుంచి <<13459306>>శాసనసభ<<>> సమావేశాలు జరుగుతాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
AP ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. bie.ap.gov.in అధికారిక సైట్తో పాటు Way2News యాప్లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్లో హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్తో వాట్సాప్ సహా ఏ ప్లాట్ఫాంకైనా రిజల్ట్ను షేర్ చేసుకోవచ్చు.
‘పవర్ కట్’ అయిందని ట్విటర్ వేదికగా కంప్లైంట్ చేస్తే అధికారులు ఇంటికి వచ్చి ట్వీట్ డిలీట్ చేయాలని చెబుతున్నారని ఓ నెటిజన్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘గతంలో పవర్ కట్ గురించి కంప్లైంట్ చేశాను. అప్పుడు USC, మొబైల్ నంబర్ ఇచ్చాను. సిబ్బంది ఇప్పుడు ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ట్వీట్ డిలీట్ చేయండని అడిగారు. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు’ అని ట్వీట్ చేశారు.
సుమారు 2500 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం కారణంగా గంగానది తన ప్రవాహ దిశను మార్చుకుందని అమెరికా పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. హిమాలయాల్లో ప్రారంభమయ్యే గంగ, భారత్, బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వేల ఏళ్ల క్రితం.. బంగ్లా ప్రస్తుత రాజధాని ఢాకా ప్రాంతానికి దక్షిణంగా సుమారు 100 కిమీ దూరంలో గంగమ్మ ప్రవహించేదని, భూకంపం అనంతరం ఇప్పుడున్న దిశలోకి మారిందని పరిశోధకులు వివరించారు.
AP: రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఛాంబర్ను మార్చారు. తొలుత సచివాలయంలోని 212, 214 రూమ్లను కేటాయించగా ఆ గదులు తనకు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ అడిగినట్లు సమాచారం. దీంతో పవన్ కోసం 211 రూమ్ను సిద్ధం చేశారు. కాసేపట్లో ఆయన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఇక్కడే పవన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు జాస్మిన్ను త్వరలోనే పెళ్లాడనున్నట్లు ఇన్స్టా వేదికగా ఆయన ప్రకటించారు. వీరి పెళ్లి వేడుకలు వారం రోజుల పాటు జరగనుండటం విశేషం. అమెరికాకు చెందిన జాస్మిన్తో గత ఏడాది అక్టోబరులో సిద్ధార్థ్కు నిశ్చితార్థమైంది.
కూతురి కోసం తండ్రి ఏమైనా చేయగలడు అనేదానికి ఇదే ఉదాహరణ. ఢిల్లీలో కార్పొరేట్ ఉద్యోగిగా పనిచేస్తోన్న వికాస్ మంగోత్రా కూతురు మీమాన్స కోసం మరోసారి విద్యార్థిగా మారారు. ఇద్దరూ NEET UG 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తాను చాలా సింపుల్గా పాఠాలు చెప్తానని, తన దగ్గర నేర్చుకోవడం ఇష్టమని కూతురు చెప్పడంతో లాంగ్ లీవ్ పెట్టి ప్రిపేర్ అయినట్లు తెలిపారు. ఈయన 2022లో కూడా నీట్ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు.
Sorry, no posts matched your criteria.