News September 8, 2024

‘9/11’ కంటే భారీ దాడికి కుట్ర.. పాక్ యువకుడి అరెస్ట్

image

అమెరికాలో ‘9/11’ కంటే భారీ ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన పాక్ యువకుడు మహ్మద్ షాజెబ్ ఖాన్(20)ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ISIS మద్దతుదారుడైన ఇతడు కెనడా నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఏడాది అవుతున్నందుకు గుర్తుగా అక్టోబర్ 7న న్యూయార్క్ బ్లూక్లిన్‌లోని ఓ యూదుల కేంద్రంపై అటాక్ చేయడానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

News September 8, 2024

14న జమ్మూలో ప్రధాని ఎన్నికల ప్రచారం

image

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న జమ్మూలో ప్రధాని మోదీ ప్రచారం ఆరంభించనున్నారు. ఆ రోజు పలు సభల్లో ఆయన పాల్గొంటారు. దీంతో మోదీ ఏ అంశాలను ప్రస్తావిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కాగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో(ఈ నెల 18, 25, అక్టోబర్ 1) పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

News September 8, 2024

31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్

image

TG: రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపించిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగల్ ఫార్మర్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యూవల్ చేసుకోలేదంటూ వంటి కారణాలు చూపించారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు. ఆయన పాలనకు, చేతలకు పొంతన లేదన్నారు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కావాలని కాంగ్రెస్ మంత్రులే చెప్పారన్నారు.

News September 8, 2024

బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రతిపాదన: మంత్రి నారాయణ

image

AP: విజయవాడలో విలయం సృష్టించిన బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామన్నారు. కాలువల ఆక్రమణల వల్లే వరద తీవ్రత పెరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం బుడమేరుకు గండ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.

News September 8, 2024

ACA అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నిక

image

AP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడిగా MP కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణుతేజ్ ఎన్నికైనట్లు తెలిపారు. ACA తొలి నిర్ణయంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు శివనాథ్ వెల్లడించారు.

News September 8, 2024

గణేశ్ మండపాలు.. నిర్వాహకులకు జాగ్రత్తలు

image

*కరెంట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కాటన్, పరదాలు సులభంగా కాలిపోతాయి కాబట్టి గమనిస్తూ ఉండాలి.
*కొందరు మెయిన్ లైన్ల నుంచి తప్పుడు మార్గంలో కరెంట్ తీసుకుంటారు. అది ఎప్పటికీ ప్రమాదం అని గుర్తించాలి.
*భారీ శబ్దంతో డీజే పెట్టుకుని డాన్స్ చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
*నిమజ్జనంలో చెరువులో దిగకుండా ఉండాలి.
>>ఈ పండుగ మీ తల్లిదండ్రులకు విషాదం కాకుండా చూసుకోండి.

News September 8, 2024

ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి జగన్ కుట్ర: టీడీపీ

image

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి జగన్ కుట్ర చేశారని టీడీపీ ఆరోపించింది. ‘ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు రామ్మోహన్‌కు చెందిన 3 బోట్లను కట్టేసి ఒకేసారి వదిలేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే బ్యారేజీని కూల్చేసి విజయవాడను జలసమాధి చేయాలని జగన్ క్రిమినల్ ప్లాన్ వేశాడు. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం జరగలేదు. దీనిపై విచారణ జరుగుతోంది’ అని ట్వీట్ చేసింది.

News September 8, 2024

త‌మిళగ వెట్రి క‌ళ‌గంకు ఈసీ గుర్తింపు

image

త‌మిళ స్టార్ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ స్థాపించిన త‌మిళగ వెట్రి క‌ళ‌గం పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తింపు దక్కింది. రిజిస్ట‌ర్డ్ పార్టీగా నమోదు చేసినట్టు ఆ పార్టీకి ECI కబురు పంపింది. ఫిబ్ర‌వ‌రిలో గుర్తింపు కోసం ఆ పార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవ‌ల జెండాను కూడా ఆవిష్క‌రించిన విజ‌య్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారించారు. రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News September 8, 2024

మరో ముప్పు.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: కిషన్ రెడ్డి

image

TG: వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సాయం విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులను ఆదుకునేందుకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

News September 8, 2024

ఘోరం.. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు చిన్నారిని అమ్మేశాడు

image

యూపీలో ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు ఓ తండ్రి మూడేళ్ల చిన్నారిని అమ్మేశాడు. భార్య ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి బిల్లు కడితేనే పంపుతామని యాజమాన్యం తేల్చిచెప్పడంతో తన మూడేళ్ల కొడుకును అమ్మకానికి పెట్టాడు. ఇది కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.