News September 8, 2024

2 నెలల జీతం విరాళం ప్రకటించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

image

TG: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని ఇస్తామని తెలిపింది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News September 8, 2024

వరదలకు 45 మంది మృతి: రాష్ట్ర ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలో వరదల కారణంగా 45 మంది మరణించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారని పేర్కొంది. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 3,913 KMల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిపింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు వెల్లడించింది.

News September 8, 2024

జేసీ దివాకర్ రెడ్డి ఎలా అయ్యారో చూడండి!

image

ఒకప్పుడు సీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన JC దివాకర్ రెడ్డి (80) ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. దివాకర్ రెడ్డి తాజా ఫొటోను ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి Xలో షేర్ చేశారు. కుమారుడు పవన్ రెడ్డి, మనవడితో కలిసి దివాకర్ రెడ్డి కనిపించారు. గతంలో ఖరీదైన గ్లాసెస్, గంభీరంగా కనిపించే దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా డీలా పడ్డారు. ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిందని, నడవడం కూడా ఇబ్బందిగా ఉందని పలువురు చెబుతున్నారు.

News September 8, 2024

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె

image

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ఇవాళ ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న ముంబైలోని సిద్ది వినాయక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఈమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, ఇవాళ డెలివరీ అయ్యారు. రణ్‌వీర్ సింగ్-దీపికా 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే

News September 8, 2024

TMCకి షాక్ ఇచ్చిన ఎంపీ.. పదవికి రాజీనామా

image

TMCకి ఆ పార్టీ రాజ్య‌స‌భ MP షాక్ ఇచ్చారు. ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసు విచార‌ణ‌లో బెంగాల్ ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరుకు నిర‌స‌న‌గా MP జవహర్ సిర్కార్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. పార్టీలోని కొంత మంది వ్య‌క్తుల నియంత్ర‌ణ‌, అవినీతిని త‌ప్పుబ‌డుతూ CM మమతకు లేఖ రాశారు. మ‌మ‌త అపాయింట్మెంట్ దొరకని ప‌రిస్థితులపై నిరాశ వ్య‌క్తం చేసిన సిర్కార్‌ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంలో పార్టీ విఫలమైందన్నారు.

News September 8, 2024

‘9/11’ కంటే భారీ దాడికి కుట్ర.. పాక్ యువకుడి అరెస్ట్

image

అమెరికాలో ‘9/11’ కంటే భారీ ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన పాక్ యువకుడు మహ్మద్ షాజెబ్ ఖాన్(20)ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ISIS మద్దతుదారుడైన ఇతడు కెనడా నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఏడాది అవుతున్నందుకు గుర్తుగా అక్టోబర్ 7న న్యూయార్క్ బ్లూక్లిన్‌లోని ఓ యూదుల కేంద్రంపై అటాక్ చేయడానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

News September 8, 2024

14న జమ్మూలో ప్రధాని ఎన్నికల ప్రచారం

image

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న జమ్మూలో ప్రధాని మోదీ ప్రచారం ఆరంభించనున్నారు. ఆ రోజు పలు సభల్లో ఆయన పాల్గొంటారు. దీంతో మోదీ ఏ అంశాలను ప్రస్తావిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కాగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో(ఈ నెల 18, 25, అక్టోబర్ 1) పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

News September 8, 2024

31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్

image

TG: రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపించిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగల్ ఫార్మర్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యూవల్ చేసుకోలేదంటూ వంటి కారణాలు చూపించారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు. ఆయన పాలనకు, చేతలకు పొంతన లేదన్నారు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కావాలని కాంగ్రెస్ మంత్రులే చెప్పారన్నారు.

News September 8, 2024

బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రతిపాదన: మంత్రి నారాయణ

image

AP: విజయవాడలో విలయం సృష్టించిన బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామన్నారు. కాలువల ఆక్రమణల వల్లే వరద తీవ్రత పెరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం బుడమేరుకు గండ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.

News September 8, 2024

ACA అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నిక

image

AP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడిగా MP కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణుతేజ్ ఎన్నికైనట్లు తెలిపారు. ACA తొలి నిర్ణయంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు శివనాథ్ వెల్లడించారు.