News June 15, 2024

ఇద్దరు టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు?

image

AP: ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసన సభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు, చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మంత్రి పదవులు ఆశించిన విషయం తెలిసిందే.

News June 15, 2024

తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు

image

TG: రాష్ట్రంలో గతేడాది ప్రసూతి మరణాలు తగ్గినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదు కాగా, 2023-24లో 260కి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో TG మూడో స్థానంలో ఉంది. ప్రసూతి మరణాల్లో అత్యధిక శాతం ప్రసవించిన వారంలోపే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గుండె సమస్యలు, ఊబకాయం, రక్తస్రావం, అబార్షన్ వంటివి కారణాలుగా చెబుతున్నారు.

News June 15, 2024

ఉగాండాపై కివీస్ విజయం

image

T20WCలో ఉగాండాపై కివీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 41 పరుగుల లక్ష్యాన్ని 5.2 ఓవర్లలో ఛేదించింది. వరుసగా 2 ఓటములతో ఇప్పటికే సూపర్-8 అవకాశాన్ని కోల్పోయిన న్యూజిలాండ్.. ఇవాళ ఓదార్పు గెలుపును అందుకుంది.

News June 15, 2024

ఒక్క రన్‌ తేడాతో సౌతాఫ్రికా గెలుపు

image

T20WCలో నేపాల్‌పై సౌతాఫ్రికా ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. తొలుత ప్రోటీస్ టీమ్ 115/7 స్కోరు చేయగా, ఒకానొక దశలో నేపాల్ గెలిచేలా కనిపించింది. చివరి ఓవర్‌లో 8 రన్స్ చేయాల్సి ఉండగా ఆరు పరుగులే చేసింది. లాస్ట్ బంతికి గుల్సన్ జా రనౌట్ కావడంతో 114/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.

News June 15, 2024

రేపే సివిల్స్ ప్రిలిమ్స్

image

యూపీఎస్సీ నేతృత్వంలో రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మం.2.30 నుంచి సా.4.30 వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందే సెంటర్లను మూసివేస్తారు. ఆ తర్వాత పర్మిషన్ ఉండదు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫొటో ఐడీ కార్డు తీసుకెళ్లాలి.

News June 15, 2024

ఎవరీ TTD కొత్త ఈవో?

image

AP: తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో J శ్యామలారావును నియమించారు. 1997 బ్యాచ్ IAS అధికారి అయిన శ్యామలారావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్‌గా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, పౌరసరఫరాలు, హోం శాఖల్లోనూ అనుభవం ఉంది.

News June 15, 2024

T20WC: 40 రన్స్‌కే ఆలౌట్

image

T20WCలో న్యూజిలాండ్‌తో మ్యాచులో ఉగాండా 40 రన్స్‌కే ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఆ జట్టు బ్యాటర్లలో కెన్నెత్ వైస్వా 11 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. NZ బౌలర్లలో సౌథీ 3, బౌల్ట్, సాంట్నర్, రచిన్ రెండేసి వికెట్లు, ఫెర్గుసన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదే టోర్నీలో WIతో మ్యాచులో ఉగాండా 39 రన్స్‌కే ఆలౌటై, NED(2014) పేరిట ఉన్న అత్యల్ప స్కోర్ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే.

News June 15, 2024

2 నెలలు.. 3 పథకాలు.. రూ.30వేల కోట్లు!

image

TG: రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో ₹30వేల కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్‌ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో ₹8,246 కోట్లు సేకరించగా, మరో ₹2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకోనుంది. ఈ ఏడాది కోటాలో మరో ₹30వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

News June 15, 2024

AP CMOలోకి IASలు రాజమౌళి, కార్తికేయ

image

AP: సీఎం కార్యాలయంలోకి సీనియర్ ఐఏఎస్‌లు ఏవీ రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2015-19 మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయ కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

News June 15, 2024

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ?

image

TG: ఆగస్టు 15లోగా ₹2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. జులై 15 నుంచి ₹50వేల లోపు, ఆ తర్వాత ₹75వేలు, ₹లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి ₹లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి AUG 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట.