India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైసీపీ నేత పేర్ని నాని ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సివిల్ సప్లైస్కు సంబంధించిన కేసులో పేర్నిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

JSP అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు పట్నా సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎయిమ్స్లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను జైలుకు తరలిస్తారు. కాగా BPSC పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రశాంత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను కోర్టులో హాజరుపర్చారు. అక్కడ బాండ్ పేపర్పై సంతకం చేయడానికి నిరాకరించడంతో కోర్టు రిమాండ్ విధించింది.

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో రూపాయి విలువ జీవితకాల కనిష్ఠం 85.84 స్థాయికి పతనమవ్వడం, దేశంలో HMPV కేసులు వెలుగుచూడడం, ఈక్విటీ ఔట్ఫ్లో నష్టాలకు కారణమయ్యాయి. Sensex 1,258 పాయింట్లు కోల్పోయి 77,964 వద్ద, Nifty 23,616 (-388) వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, రియల్టీ రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్ల రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

కర్ణాటక ప్రభుత్వం ప్రతి కాంట్రాక్టులో 60% కమీషన్ తీసుకుంటోందని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆరోపించారు. తుమకూరులో కాంగ్రెస్ నేత స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను సీఎం సిద్ద రామయ్య కొట్టిపారేశారు. ఈ విషయమై కుమార స్వామి ఆరోపణలు చేయడం కాకుండా, ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. విపక్షాలు ఉన్నది కేవలం ఆరోపణలు చేయడానికి కాదన్నారు.

ఐర్లాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ భారత మహిళల జట్టును ప్రకటించింది. ఈ టూర్కు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తోపాటు సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రాంతినిచ్చింది. 15 మందితో కూడిన జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తారు. జట్టు: మంధాన (C), దీప్తి శర్మ, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా, రిచా, తేజల్, రాఘవి, మిన్ను మణి, తనూజ, ప్రియా, సాధు, సైమా, సయాలి.

భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నిలిచింది. ఈ సినిమా నిన్నటివరకు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.1,831 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. బాహుబలి-2 లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1,810 కోట్లను దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దంగల్(రూ.2వేల కోట్లకుపైగా) తొలి స్థానంలో ఉంది.

TG: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డోర్ క్లోజ్ అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పాలనలో పింక్ షర్ట్ వేసుకున్నవారికే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదని దుయ్యబట్టారు. అప్పుడంటే కాలు విరిగింది, ఇప్పుడేమైందని ప్రశ్నించారు.

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటికి 4.15 లక్షల మంది రైతుల నుంచి 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్నదాతల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఖరీఫ్లో 2.12 లక్షల మంది నుంచే ధాన్యం తీసుకుందని విమర్శించారు. తమ ప్రభుత్వం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని, ఇప్పటి వరకు రూ.6,083 కోట్లు చెల్లించిందని తెలిపారు.

సోషల్ మీడియాలో కొందరు తనను <<15073430>>వేధింపులకు గురిచేస్తున్నారని<<>> హీరోయిన్ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఓ బిజినెస్మన్ తనను వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో ఆమె ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించారు. వారి కామెంట్లు మానసిక వేధింపులకు కారణమయ్యాయని ఆమె పేర్కొన్నారు.

HMPV వైరస్ కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని HYD అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేవంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.
Sorry, no posts matched your criteria.