India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాలా మంది వారంలో రెండు, మూడు రోజులు ఉపవాసాలు ఉంటుంటారు. అలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. వీరు 5:2 రూల్ పాటించాలంటున్నారు. అంటే వారంలో వరుసగా కాకుండా ఏవైనా 2 రోజులు ఫాస్టింగ్ ఉండొచ్చు. ఉపవాస సమయంలో 16-18 గంటలు ఏం తినకూడదు. ఆకలేస్తే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, నిమ్మకాయ నీరు (చక్కెర లేకుండా), నీరు తాగాలి. టీ/కాఫీలో పాలు& చక్కెర వాడొద్దు. గరిష్ఠంగా 500 క్యాలరీలు తీసుకోవడం మంచిది.

ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను భారత్ మళ్లీ పూర్తిస్థాయికి తీసుకెళ్తోంది. కొవిడ్ టైమ్లో మూసేసిన ఎంబసీని మళ్లీ తెరిచింది. అధికారులను అక్కడికి పంపించింది. కిమ్తో ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే ముందుగా ఆఫీస్ మొత్తాన్ని జల్లెడ పట్టనుంది. నిఘాకు తావులేకుండా ఏర్పాట్లు చేయనుంది. మిసైళ్లు, న్యూక్లియర్ టెక్నాలజీలో కిమ్ రాజ్యం వృద్ధి సాధిస్తోంది. దీనిని పాక్కు చేరకుండా పావులు కదపడమే భారత్ టార్గెటని సమాచారం.

TG: హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, BRS అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. అటు, శాసనసభలో BRS వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఖాకీ దుస్తులు ధరించి ఆటోల్లో శాసనసభకు చేరుకున్నారు.

ఉగాండాలో కొత్త రోగం పుట్టుకొచ్చింది. పేరు డింగా డింగా. అంటే డాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్థం. కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300+ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయపడుతున్నారు. రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది. జ్వరం, వీక్నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు.

ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబీక్విక్, విశాల్ మెగామార్ట్ షేర్లు NSE, BSEల్లో లిస్ట్ అయ్యాయి. IPO ధర రూ.279తో వచ్చిన మొబీక్విక్ షేర్లు BSEలో రూ.58.5% ప్రీమియంతో రూ.442, NSEలో 57.7% ప్రీమియంతో రూ.440 వద్ద నమోదయ్యాయి. ప్రస్తుతం రూ.72 లాభంతో రూ.512 వద్ద ట్రేడవుతున్నాయి. రూ.78 IPO ధరతో వచ్చిన విశాల్ షేర్లు NSEలో రూ.104 వద్ద లిస్టయ్యాయి. ఇప్పుడు 2.46% లాభంతో రూ.106 వద్ద చలిస్తున్నాయి.

AP: నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. మర్రిపాడు(మ) వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించగా, వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చెన్నై తరలించారు. బాలుడి రక్త నమూనాలను పుణేలోని ల్యాబ్కు పంపారు. ముందు జాగ్రత్తగా వెంకటాపురంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. కొత్త ROR చట్టాన్ని తీసుకురానుండగా దానిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు. వాటిని భూములు లేని పేదలకు ఇస్తామని తెలిపారు.

స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. నిఫ్టీ 24,309 (-26), సెన్సెక్స్ 80,606 (-74) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్కేర్, FMCG, IT సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. నిఫ్టీ ADV/DEC రేషియో 24:26గా ఉంది. RIL, TECHM, APOLLOHOSP టాప్ గెయినర్స్. POWERGRID, TRENT, BPCL టాప్ లూజర్స్.

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3వ టెస్టు 2వ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 89/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ప్రకటించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి ఆసీస్ మొత్తం 274 రన్స్ లీడింగ్లో ఉంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 275 రన్స్ చేయాలి. ఆసీస్ గెలవాలంటే 54 ఓవర్లలో భారత్ను ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా వర్షం కురిసి మ్యాచ్ జరగకపోతే ఈ టెస్టు డ్రాగా ముగిసే ఛాన్సుంది.

TG: సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సహా పలువురి ఫిర్యాదు మేరకు బన్నీ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి. కాగా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ పలువురు ఫ్యాన్స్ సీఎం రేవంత్పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.