India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫ్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన రాసిన ఓ పుస్తకం తమ మనోభావాలు దెబ్బతీశాయని ఓ సామాజికవర్గానికి చెందిన పలువురి ఫిర్యాదులతో కోరుట్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలంటూ ఐలయ్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసులను కొట్టేశారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కొట్టేసిందని జడ్జి ప్రస్తావించారు.

అక్రమ వలసదారులను వెనక్కు పంపుతామని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తమ దేశం నుంచి పంపించాల్సిన 15లక్షల మంది జాబితాను US సిద్ధం చేసింది. నవంబరు లెక్కల ప్రకారం అందులో 17,940 మంది భారతీయులు ఉన్నారు. వారంతా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. గత 3 సంవత్సరాల్లో 90వేల మంది ఇండియన్స్ అక్రమంగా అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు.

TG: ANM రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. 1931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. HYDలో ఏఎన్ఎంలతో ఆయన చర్చించారు. కాంట్రాక్ట్ ANMలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తామని, ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలని సూచించారు. రెగ్యులర్ ఉద్యోగం రాని వారిని కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రతిష్ఠాత్మక BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత పోరు ముగిసింది. యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ జోడీ శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ గ్రూపు-ఏలో ఓడిపోయారు. 17- 21, 13-21తో జపాన్కు చెందిన మత్సుయమ, చిహారు షిదా మన ద్వయాన్ని ఓడించారు. ఇటీవలే సయ్యద్ మోడీ టోర్నీ గెలిచి ఫామ్లో ఉన్న గాయత్రి, త్రిసా.. జపాన్ ద్వయం నుంచి గట్టి పోటీ ఎదురై ఓడిపోయారు.

మీ ఆర్థిక పరిస్థితిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) ఇచ్చే రేటింగ్నే సిబిల్ స్కోర్ అంటారు. ఆ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే రుణాలకు ఈజీ అవుతుంది. సిబిల్ స్కోర్ పెరగాలంటే..
* సమయానికి రుణాలు, EMI చెల్లించండి.
* సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి.
* క్రెడిట్ కార్డు లిమిట్ను 30% మాత్రమే ఉపయోగించాలి.
* ఇతరుల రుణాలకు గ్యారెంటీ ఉండకపోవడం బెటర్.

చలికాలం వేధించే గొంతునొప్పికి వంటింట్లోని పసుపు, మిరియాలు, లవంగాలు, ఉప్పుతో చెక్ పెట్టొచ్చు. పాలలో పసుపు కలుపుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అలాగే, లవంగాన్ని కొద్దికొద్దిగా నములుతూ మింగితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే, టేబుల్ స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.

విరాట్ కోహ్లీ నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న 3వ టెస్టులో అరుదైన ఫీట్ అందుకోనున్నారు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో కలిపి ఆ జట్టుపై 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటి వరకు అతను ఆస్ట్రేలియాపై 49 వన్డేలు, 23 టీ20లు, 27 టెస్టులు ఆడి 5,326 రన్స్ చేశారు. వీటిలో 17 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 186. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియాతో 100 మ్యాచుల ఆడిన జాబితాలో సచిన్(110M, 6,707రన్స్) ఉన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో అదనపు ఓట్లపై ఎన్నికల సంఘం స్పందించకపోవడాన్ని అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ తప్పుబట్టారు. సాయంత్రం 6 తరువాత 75 లక్షల ఓట్లు అదనంగా పోలవ్వడంపై వివరాలు కోరగా స్పందన లేదన్నారు. 288 నియోజకవర్గాల్లో ఓటింగ్ వివరాలను EC అందజేయాలన్నారు. ప్రతి స్థానంలో 6 గంటల తరువాత 26K ఓట్ల వరకు పోలయ్యాయనే EC వాదన సందేహాస్పదమని VBA కార్యకర్తలు చెబుతున్నారు.

విద్యుత్ వ్యవస్థ ధ్వంసమే లక్ష్యంగా రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాలపై రష్యా భీకర దాడికి దిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. 93 క్రూయిజ్, క్షిపణులు, 200కు పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసిందన్నారు. అందులో 11 క్రూయిజ్, 81 క్షిపణులను నేల కూల్చినట్లు ఆయన ప్రకటించారు. తమ దేశంపై రష్యా దురాక్రమణ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత విద్యుత్తు వ్యవస్థపై ఇదే అతిపెద్ద దాడి అని ఆయన వివరించారు.

AP: రాష్ట్ర వ్యాప్తంగా 40 అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు, లైసెన్సులు లేకుండా విక్రయాలు, తూకాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి. కొన్నిచోట్ల వ్యాపారులు రికార్డులు సరిగా నిర్వహించలేదని తేల్చాయి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఇలాగే కొనసాగుతాయని విజిలెన్స్ DG ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.