India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బ్రెజిల్కు చెందిన రవేనా హన్నీలీ(23) అనే ఇన్ఫ్లూయెన్సర్ వర్జినిటీని తిరిగి పొందడానికి hymenoplasty అనే ఆపరేషన్ను చేయించుకోనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.16 లక్షలు ఖర్చు చేయనున్నారు. ‘ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. తిరిగి వర్జిన్ కావాలనుకుంటున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా’ అని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్తో శారీరక, మానసిక, నైతిక సవాళ్లు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తమ కుటుంబం తరఫున స్నేహితులు, మీడియా, అభిమానులందరికీ నటుడు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ‘మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ప్రైవసీ ఇచ్చినందుకు థాంక్స్. మీరిచ్చిన గౌరవం మా ఆనందాన్ని మరింత పెంచింది. ఫ్యాన్స్, ఫ్రెండ్స్.. నా బిడ్డ పెళ్లి మీ అందరి వల్ల ఒక మధురానుభూతిగా మారింది. మీ దీవెనలందించినందుకు అందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

భారత మార్కెట్లో గత కొంతకాలంగా SUV మోడల్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అయితే ఆ ట్రెండ్ను మారుతీ సుజుకీ బలెనో గత నెలలో బ్రేక్ చేసింది. క్రెటా, నెక్సాన్, బ్రెజా, స్కార్పియో వంటివాటన్నింటినీ తోసిరాజని అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది నవంబరులో 16,293 బలెనో యూనిట్లను మారుతి విక్రయించింది. తర్వాతి స్థానాల్లో క్రెటా(15,452) టాటా పంచ్(15,435), టాటా నెక్సాన్(15,329) ఉన్నాయి.

డిజిటల్ యుగంలోనూ పలు అంశాలకు సంబంధించి తమ వద్ద డేటా లేదని కేంద్రం చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల వాటిల్లిన నష్టం అంచనా, మెడికల్ ఇంటర్న్ల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, పేపర్ లీకులపై వివరాల్లేవని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం వైఖరి విస్మయానికి గురిచేస్తుందని విమర్శిస్తున్నాయి.

సిరియాలో అంతర్యుద్ధం ముదురుతోంది. ఇటీవల అలెప్పో నగరాన్ని రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో సిరియా దాని మిత్రదేశాలు రష్యా, ఇరాన్లు జరిపిన రిటాలియేషన్ను లెక్కచేయకుండా తాజాగా హమా నగరంలో పాగా వేశారు. సిరియా రాజధాని దమాస్కస్కు ఉత్తరాన 210KM దూరంలోని హమాలోకి హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ చొచ్చుకురావడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్కు సవాల్ విసిరినట్టైంది.

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో నటించిన సమయంలో హీరోయిన్ సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా స్టార్ హోటల్లో ఉంచాం. 4 నెలలకు కోలుకున్నారు. ఇప్పటికీ ఆ సాయాన్ని ఆమె మరచిపోలేదు’ అని పేర్కొన్నారు.

AP: ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల ఆందోళనల ఘటనలపై కృష్ణా జిల్లా కలెక్టర్తో CM చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్ల అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.

భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్పై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. నేటి క్రికెటర్లలో ఏమాత్రం భయం లేని వారిలో అతడు కూడా ఒకరని కొనియాడారు. భారత్కు జైస్వాల్ చాలా కాలం ఆడతారని స్టార్క్ అంచనా వేశారు. కాగా.. నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నానంటూ అతడన్న మాటల్ని తాను వినలేదని స్పష్టం చేశారు. ‘నాకు ఆ మాటలు వినపడలేదు. అయినా స్లెడ్జింగ్కు నేను తిరిగి జవాబివ్వడం లేదు’ అని తెలిపారు.

AP: తిరుమలలో అన్యమత గుర్తు, పేరు కలిగిన వస్తువును విక్రయించిన దుకాణాన్ని TTD అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. ఈ విషయాన్ని TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. HYDకు చెందిన భక్తుడు ఇవాళ ఉదయం CRO ఆఫీస్ ఎదురుగా ఒక షాప్లో స్టీల్ కడియాన్ని కొనుగోలు చేయగా, దానిపై అన్యమత పేరు, గుర్తు ఉండటంతో తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే ఆ షాప్ను తాత్కాలికంగా మూసివేసి విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

కొత్తగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలన్నారు. వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు రానా షో ఇంటర్వ్యూలో వెల్లడించారు. పిల్లల్లో కొడుకు ఉంటే తనతో గో కార్టింగ్ రేస్కు తీసుకెళ్తానని చెప్పారు. కూతురైతే ఆమె అభిరుచులకు తగ్గట్లు తనతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. శోభిత ధూళిపాళతో చైతూ వివాహం గతరాత్రి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
Sorry, no posts matched your criteria.