India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.

AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.

పుష్ప-2 సినిమాకు సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఇందులోని 19 నిమిషాల జాతర ఎపిసోడ్ను తొలగించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. బన్నీ అమ్మవారి గెటప్, హిందూ దేవతల గురించి ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. దీంతో 3 గంటల ఒక నిమిషం వ్యవధితోనే చిత్రం అక్కడ ప్రదర్శితమవుతున్నట్లు పేర్కొంది. కాగా సింగమ్ అగైన్, భూల్ భులయ్య-3 చిత్రాలను ఆ దేశం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

JIO, AIRTEL, VIకు BSNL గట్టి పోటీనిస్తోందని పరిశ్రమ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 3G, సర్వీస్ సమస్యలున్నప్పుడే ఇలావుంటే 4G/5G, నెట్వర్క్ విస్తరణ, శాటిలైట్ సర్వీసులు ఆరంభిస్తే చుక్కలు తప్పవని వారి అంచనా. PVT ఆపరేటర్లు రీఛార్జి ప్లాన్లను 25% మేర పెంచడం తెలిసిందే. దీంతో 4 నెలల్లోనే BSNLలో 65 లక్షల కొత్త కస్టమర్లు చేరారు. పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ ఇప్పట్లో ధరలు పెంచదని సమాచారం. మీ COMMENT?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత మహిళల జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మెగన్ 5 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించారు. టీమ్ ఇండియా బ్యాటర్లలో రోడ్రిగ్స్(23)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆస్ట్రేలియా టార్గెట్ 101.

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో సంక్రాంతి తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు థియేట్రికల్ రన్ కొనసాగిస్తామని మూవీ వర్గాలు చెబుతున్నాయి.

TG: పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని BRS, ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేస్తున్న తమను విమర్శించడం ఏంటని CM రేవంత్ అన్నారు. ‘తొలి ఏడాదిలో 5నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల సచివాలయానికి వెళ్లలేకపోయాం. మిగిలిన 6నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టాం. KTR, హరీశ్ది చిన్నపిల్లల మనస్తత్వం. మనదగ్గర లేని బొమ్మ పక్కోడి దగ్గర ఉంటే విరగ్గొట్టాలనే ఆలోచన ఉంటుంది. వారికి తెలియదేమో కానీ KCRకి కూడా అవగాహన లేదా?’ అని ప్రశ్నించారు.

TG: ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని CM రేవంత్ కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనను ఆహ్వానిస్తారన్నారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం బాగోలేదన్నారు. సభకు వచ్చి సూచనలు, సలహాలివ్వాలని చెప్పారు. కేసీఆర్ కంటే తామంతా జూనియర్ ఎమ్మెల్యేలమని, ఆయన పెద్దరికం నిలబెట్టుకోవడం లేదన్నారు. పిల్లలు తప్పు చేస్తుంటే KCR ఆపడం లేదని, రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు.

TG: పదేళ్ల BRS హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించలేదని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘KCR తనకు అవసరమైన ప్రగతిభవన్ను ఆఘమేఘాల మీద పూర్తి చేశారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్తదాన్ని వేగంగా నిర్మించుకున్నారు. ప్రతి జిల్లాలో BRS కార్యాలయాలను కట్టుకున్నారు. గజ్వేల్, జన్వాడ ఫామ్హౌస్ల నిర్మాణంపైనే KCR దృష్టి పెట్టారు కానీ పేదల ఇళ్ల పథకానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు’ అని CM విమర్శించారు.

‘4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట’ విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. నిజజీవితంలోనూ అలాంటి ఆఫీసర్ ఉన్నారు. IAS అశోక్ ఖేమ్కా 33ఏళ్ల కెరీర్లో 57వ సారి బదిలీ అయ్యారు. 2025 APR 30న రిటైర్డ్ కానున్న ఆయన తాజాగా హరియాణా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్కు చెందిన ఈయన నిజాయితీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.