News December 2, 2024

ఉద్యోగుల అంత్యక్రియల ఛార్జీలు పెంపు

image

TG: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఖర్చును రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

News December 2, 2024

విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేసిన కేంద్రం

image

ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ONGC వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుంటాయి.

News December 2, 2024

మనుషుల్లానే ఆవులూ ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతాయి!

image

మన సన్నిహితులు మనకు దూరమైతే వెలితిగా ఉన్నట్లే ఆవులకూ ఇలాంటి అనుభూతి కలుగుతుందని నార్తాంప్టన్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. ఆవులు నిర్దిష్ట సహచరులతో సన్నిహిత బంధాలను ఏర్పరుచుకుంటాయని, వాటి నుంచి విడిపోయినప్పుడు ఒత్తిడికి లోనవుతాయని తేలింది. ఆవులను ప్రశాంతమైన & ఉదాసీనమైన జీవులుగా భావించవచ్చని పరిశోధన పేర్కొంది. ఈ విషయాన్ని మీ ఇంట్లోని ఆవుల్లో మీరెప్పుడైనా గమనించారా?

News December 2, 2024

రూ.67వేల కోట్ల అప్పు ఏం చేశారు?: బొత్స

image

AP: కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో ₹67వేల కోట్ల అప్పు చేసిందని, రేపు మరో రూ.4వేల కోట్ల అప్పు తీసుకోబోతోందని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అప్పు అంతా దేనికోసం ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. YCP ప్రభుత్వముంటే ఈ 6నెలల్లో ₹18,000కోట్లు పేదల ఖాతాల్లో వేసే వాళ్లమని చెప్పారు.

News December 2, 2024

భారీ జీతంతో 334 ఉద్యోగాలు

image

NLC ఇండియా లిమిటెడ్‌లో 334 పోస్టులకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ ఇంజినీర్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.50,000-2,80,000 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి
సైట్: https://www.nlcindia.in/

News December 2, 2024

గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు: హెడ్ ప్రశంసలు

image

AUS స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ IND స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. BGT తొలి టెస్టులో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా అప్పటి నుంచి దీనిపై ఆయన స్పందించలేదు. తాజాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హెడ్ స్పందిస్తూ.. ‘నేను ఆడిన గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని నా మనవళ్లతో చెప్పడం కూడా బాగుంటుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

News December 2, 2024

పదవులపై ఆశ లేదు: శిండే కుమారుడు

image

తాను డిప్యూటీ సీఎం అవుతాననే ప్రచారంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ శిండే స్పందించారు. ఆ రేసులో లేనని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చినా తీసుకోలేదు. పార్టీ కోసం పనిచేయడానికే కట్టుబడి ఉన్నా’ అని శ్రీకాంత్ వెల్లడించారు.

News December 2, 2024

ఎల్లుండి పెళ్లి.. ప్రీవెడ్డింగ్ ఫొటోలు చూశారా?

image

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెళ్లికి ముందు తంతు ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాజాగా శోభితను పెళ్లి కూతురు చేయగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో ఎల్లుండి వివాహం జరగనుంది.

News December 2, 2024

HYDలో పార్లమెంట్ వింటర్ సెషన్ నిర్వహించాలి: KA పాల్

image

AP డిప్యూటీ CM పవన్‌పై KA పాల్ ఆరోపణలు చేశారు. నాగబాబు రాజ్యసభ సీటు కోసం ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారన్నారు. గతంలో కేంద్ర‌మంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని చెప్పారు. ఇప్పుడు పవన్ కూడా BJPతో అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. అటు, దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న HYDలో పార్లమెంట్ వింటర్ సెషన్ నిర్వహించాలన్నారు. దక్షిణాది MPలంతా దీనిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

News December 2, 2024

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ వచ్చారు. వీరి భేటీలో రాజ్యసభ సీట్ల సర్దుబాటు, బియ్యం అక్రమ రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.