News December 2, 2024

పాక్‌లో ‘టెర్రర్’.. నవంబర్‌లో 245 మంది మృతి

image

ఆత్మాహుతి, ఉగ్రదాడులతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. NOVలో జరిగిన 71 దాడుల్లో 245మంది మృత్యువాతపడ్డారు. ఈ సంఖ్య ఈ ఏడాదిలో రెండో అత్యధికం. వీరిలో 127మంది టెర్రరిస్టులు, 68మంది భద్రతా సిబ్బంది, 50మంది పౌరులు ఉన్నారని PICSS వెల్లడించింది. మరో 257మంది గాయపడ్డారని తెలిపింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోనే ఎక్కువగా పేలుడులు సంభవించినట్లు పేర్కొంది. AUGలో అత్యధికంగా 254మంది మరణించినట్లు తెలిపింది.

News December 2, 2024

అమ్మానాన్నా క్షమించండి.. సెల్ఫీ వీడియో తీసి యువతి ఆత్మహత్య

image

TG: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన అమ్మాయి కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగుండంలో జరిగింది. ‘అమ్మానాన్నా నన్ను క్షమించండి. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆయన వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’ అని సెల్ఫీ వీడియో తీసి ఉరేసుకుంది. నరేందర్, దీప్తి 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. కాగా తమ బిడ్డను నరేందరే చంపాడని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.

News December 2, 2024

డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన కొరియోగ్రాఫర్

image

TG: కొరియోగ్రాఫర్ కన్హా మహంతి(కన్నా) డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి మాదాపూర్ ఓయోలో ఇచ్చిన పార్టీలో ఇతను పాల్గొన్నారు. ఓ ప్రముఖ టీవీ షోలో కన్నా కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ, గంజాయి, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో పాటు మొత్తం నలుగురిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 2, 2024

చిరంజీవికి ‘భారతరత్న’ వస్తుంది: బండ్ల గణేశ్

image

చిరంజీవి, బాలకృష్ణపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బాలయ్యకు పద్మవిభూషణ్, మెగాస్టార్‌కు భారతరత్న వస్తుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు?’ అని ఓ జర్నలిస్టు ఆయనను ప్రశ్నించారు. దీనికి గణేశ్ స్పందిస్తూ ‘వారికి అర్హత ఉంది. పురస్కారం వస్తుందనే నమ్మకముంది. చిన్నవయసులోనే సచిన్‌కు కూడా భారతరత్న ఇచ్చారు. మెగాస్టార్‌కు కూడా 200% వస్తుంది’ అని పేర్కొన్నారు.

News December 2, 2024

2 కేసుల్లో కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రకటించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో డెలావెర్, కాలిఫోర్నియాలో అతనిపై కేసులున్నాయి. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, కానీ రాజకీయాల ప్రభావంతో న్యాయం తప్పుదోవ పడుతోందన్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.

News December 2, 2024

నటనకు విక్రాంత్ మాస్సే గుడ్‌బై

image

‘12TH FAIL’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే నటనకు గుడ్ బై చెప్పారు. 2025 తర్వాత నటన నుంచి విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి విజయాలు దక్కాయని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చేందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. కాగా విక్రాంత్ నిర్ణయం అభిమానులను షాకింగ్‌కు గురిచేసింది.

News December 2, 2024

ఒక్క ‘పదం’తో ఆగిన వందలాది రిజిస్ట్రేషన్లు

image

TG: HYDలోని కుత్బుల్లాపూర్ పరిధిలో ఒక ‘పదం’ వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అక్కడి 58, 226 సర్వే నంబర్లలో ఎకరం ఒక గుంట వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయొద్దని వక్ఫ్ బోర్డ్ ఆగస్టులో ఆదేశాలిచ్చింది. అందులో 58 మరియు 226 బదులు..58 నుండి 226 అని తప్పుగా టైప్ కావడంతో 168 సర్వే నంబర్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో 3నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు వాపోతున్నారు.

News December 2, 2024

అల్లు అర్జున్‌పై ట్వీట్.. డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ

image

AP: నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప-2కు లింక్ చేస్తూ TDP MP బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ <<14763519>>ట్వీట్‌<<>> సోషల్ మీడియాలో వైరలైంది. ఐకాన్ స్టార్ అభిమానులు విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో ఆమె కాసేపటికే పోస్టును డిలీట్ చేశారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ అక్కడికెళ్లిన విషయం తెలిసిందే.

News December 2, 2024

పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల సంఖ్య పెంపుపై నేడు సుప్రీంలో విచారణ

image

ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల గరిష్ఠ సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచుతూ EC తీసుకున్న నిర్ణయంపై సుప్రీంలో పిల్ దాఖలైంది. దీనిపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారించనుంది. EC నిర్ణయంతో క్యూలో వెయిటింగ్ టైమ్ పెరుగుతుందని, ప్రజలు ఓటింగ్‌కు దూరమవుతారని పిటిషనర్ పేర్కొన్నారు. EVMలో ఒక్క ఓటు వేయడానికి 60-90సెకన్ల సమయం పడుతుందని, దీని ప్రకారం 490 నుంచి 660 మందే ఓటు వేయగలుగుతారని చెప్పారు.

News December 2, 2024

వామ్మో.. చిరుద్యోగి ఆస్తి రూ.600 కోట్లు

image

TG: నీటి పారుదల శాఖ ఏఈఈ <<14757645>>నిఖేశ్ కుమార్<<>> అక్రమ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు షాకవుతున్నారు. శంషాబాద్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడలో విలాసవంతమైన విల్లాలు, తాండూరులో భూమి, మొయినాబాద్‌లో 3 ఫామ్‌హౌస్‌లు, కిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో స్థిర, చరాస్తుల విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.