News December 1, 2024

132 ఏళ్ల సీసాలో సందేశం.. ఇప్పుడు దొరికింది!

image

132 ఏళ్ల క్రితం గాజు సీసాలో పెట్టిన సందేశమది. స్కాట్లాండ్‌లోని కోర్స్‌వాల్ లైట్‌హౌస్‌ పనితీరును ఓ మెకానికల్ ఇంజినీర్ సమీక్షిస్తుండగా గోడల్లో బయటపడింది. 1892, సెప్టెంబరు 4న ఆ లైట్‌హౌస్‌ను నిర్మించిన ముగ్గురు ఇంజినీర్లు తమ పేర్లను, ముగ్గురు సిబ్బంది పేర్లను రాసిన కాగితాన్ని సీసాలో పెట్టి గోడలో భద్రపరిచారు. అది ఇన్నేళ్లకు వెలుగుచూసింది. దాన్ని కనుగొన్న అధికారులు వారూ ఓ సీసాను పెట్టాలనుకుంటున్నారు.

News December 1, 2024

BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.

News December 1, 2024

రేపు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ

image

ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది. ఏపీలోని మంగళగిరి APIIC కార్యాలయంలో జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరగనుంది.

News December 1, 2024

SRH స్ఫూర్తి.. 20ఓవర్లలో 266 రన్స్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర బ్యాటింగ్‌లో ఊచకోత కోసింది. SRH క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర 20 ఓవర్లలో 266 రన్స్ కొట్టింది. అందులో 21 సిక్సర్లు, 20 ఫోర్లుండటం గమనార్హం. ఛేదనలో బరోడా టీమ్ 20 ఓవర్లలో 188/8కి పరిమితం అయ్యింది. దీంతో 78 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ విషయాన్ని ఉనద్కత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘సన్ రైజర్స్‌ సౌరాష్ట్ర’ అంటూ రాసుకొచ్చారు.

News December 1, 2024

CM రేవంత్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్

image

TG: మాజీ సీఎం KCRకు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని CM రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను BRS మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. KCRకు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు తేలితే తాను MLA పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే KCR ఫామ్‌హౌస్ చూపిస్తానని రేవంత్‌కు ప్రశాంత్‌రెడ్డి ఆఫర్ చేశారు.

News December 1, 2024

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసిన సంగతి తెలిసిందే.

News December 1, 2024

రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!

image

రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.

News December 1, 2024

ఇది మ‌హారాష్ట్ర‌కు అవ‌మాన‌క‌రం: ఆదిత్య ఠాక్రే

image

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి వారం గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌పోవ‌డం మ‌హారాష్ట్రకు అవ‌మాన‌క‌ర‌మ‌ని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే విమ‌ర్శించారు. అసెంబ్లీ గ‌డువు ముగిసినా రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎందుకు విధించ‌డం లేదని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని క్లైం చేసుకోకుండానే ప్ర‌మాణ‌స్వీకారానికి తేదీ ప్ర‌క‌టించ‌డం అరాచ‌క‌మ‌ని మండిప‌డ్డారు. వర్లీ నుంచి ఆదిత్య గెలిచిన విషయం తెలిసిందే.

News December 1, 2024

ఈ జ్యూస్‌లను తాగకపోవడమే మంచిది: వైద్యులు

image

పండ్లు తినే బదులు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది కదా? అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఈ మూడింట్లో ఏది బెటరో వైద్యులు సూచించారు. ‘ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో అధిక మొత్తంలో షుగర్ ఉండటం వల్ల వాటిని సేవించొద్దు. తాజా పండ్ల రసాలు తాగడం వల్ల అధిక మొత్తంలో పండ్లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ జ్యూస్ తాగినా, తాజా పండ్లు తినేందుకే మొగ్గుచూపాలి’ అని డాక్టర్లు తెలిపారు.

News December 1, 2024

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: హరీశ్‌రావు

image

TG: ప్రభుత్వ ఆదాయం పెంచే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘మంచి ఆర్థికవృద్ధితో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాం. కానీ ఈ ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించడం లేదు. ప్రభుత్వ అప్పులన్నీ బహిరంగ రహస్యమే. ఏటా కాగ్ ప్రవేశపెట్టే నివేదికల్లో ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలకు ముందే రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమయ్యాం. కానీ కాంగ్రెస్ అడ్డుకుంది’ అని ఆరోపించారు.