News November 30, 2024

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి

image

TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

News November 30, 2024

బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య బీమా?

image

APలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందుతోంది. వీరికి ఆరోగ్య బీమా పథకాన్ని(EHS) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కోసం ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఉద్యోగి దాదాపు ₹7వేలు చెల్లిస్తున్నారు. అయితే రెండు జాతీయ బ్యాంకుల ప్రీమియం ₹2,500 మాత్రమే ఉంది. దీంతో ఈ విధానం అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

News November 30, 2024

GOOD NEWS.. రూ.2 లక్షల రుణమాఫీ!

image

రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు శుభవార్త. నేడు పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో CM రేవంత్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3వేల కోట్లు విడుదల చేయనుంది. DEC మొదటి వారంలో జీతాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ కాగా.. పలు కారణాలతో 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదు.

News November 30, 2024

ప్రత్యర్థులు మిస్ అవ్వరు అనుకుంటున్నా: KTR

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని రోజులు హైదరాబాద్‌ను వీడనున్నారు. కొంత కాలం వెల్‌నెస్ రీట్రీట్‌కు వెళ్లనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘నేను తిరిగి వచ్చేవరకూ నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మిస్ అవ్వరు అనుకుంటున్నా’ అని సెటైర్లు వేశారు.

News November 30, 2024

కేర్, ఆస్టర్ విలీనం.. మూడో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ఆవిర్భావం

image

కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనంపై ఒప్పందం కుదిరింది. దీంతో 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ఆవిర్భవించనుంది. 2027 నాటికి మరో 3,500 పడకలను పెంచుకునేందుకు సంస్థలు ప్రణాళిక సిద్ధం చేశాయి. విలీన కంపెనీలో ఆస్టర్, బ్లాక్‌స్టోన్, ఇతర ప్రమోటర్లతో కలిపి 57.3 శాతం, కేర్ షేర్ హోల్డర్లకు 42.7 శాతం వాటాలుంటాయి.

News November 30, 2024

ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలు!

image

TG: ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలను సరఫరా చేసే సేవలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. తెలంగాణ సోనా, కూనారం, జగిత్యాల సన్నాలు, దొడ్డు రకాలు KNM 118, JGL 24423, MTU 1010, RNR 29325 విత్తనాలను సరఫరా చేస్తోంది. 15kgs బస్తా ధర ₹700, 25kgs బస్తాకు ₹995గా నిర్ణయించింది. రైతులు ప్రాంతీయ మేనేజర్లకు ఫోన్ చేస్తే రవాణా ఛార్జీలు లేకుండానే విత్తనాలు సరఫరా చేస్తారని వెల్లడించింది.

News November 30, 2024

అమరావతిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ: మంత్రి

image

AP: అమరావతిలో భారీ స్థాయిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. అలాగే L&T, IGNOU, CITD, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

News November 30, 2024

BGT: రెండో టెస్టుకు హెజిల్‌వుడ్ దూరం

image

భారత్‌తో జరిగే BGT రెండో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్‌వుడ్ గాయం కారణంగా దూరమయ్యారు. పక్కటెముకల్లో నొప్పితో అతడు బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. మరో ఇద్దరు పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డొగెట్‌ను జట్టుకు ఎంపిక చేసింది. డిసెంబర్ 6 నుంచి జరిగే రెండో టెస్టులో హెజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్టులో హెజిల్‌వుడ్ 5 వికెట్లు తీశారు.

News November 30, 2024

బ్రేకప్‌ను సూసైడ్‌కు ప్రేరేపించినట్లుగా పరిగణించలేం: సుప్రీంకోర్టు

image

ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చెడిపోతే మానసిక వేదనకు గురికావడం సహజమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే బ్రేకప్‌ను సూసైడ్‌కు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇద్దరు విడిపోవడం నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని తేల్చి చెప్పింది. ఇదే తరహా కేసులో కమ్రుద్దీన్ అనే వ్యక్తికి కర్ణాటక హైకోర్టు విధించిన ఐదేళ్ల శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

News November 30, 2024

నేడు స్కూళ్ల బంద్‌కు పిలుపు

image

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు SFI, AISF, PDSU లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతలేని ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్లిష్టమైన సమస్యలను హైలైట్ చేయడమే ఈ బంద్ లక్ష్యమని తెలిపాయి. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశాయి.