India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్లైన్లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ రికార్డులు, భూకబ్జాలు, అసైన్మెంట్ భూముల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటికి సత్వర, పూర్తిస్థాయి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

TG: పెట్రోల్, డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చితే తెలంగాణలోనే తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా త్వరలోనే లైఫ్ ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

TGలో టూ వీలర్ల ధర ₹50వేలలోపు ఉంటే 9%, ₹50వేలకంటే ఎక్కువ ఉంటే 12% లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇక కర్ణాటకలో 18%, కేరళలో 20% చెల్లించాల్సి ఉంటుంది. TGలో 4 వీలర్ల ధర ₹5లక్షల్లోపు ఉంటే 13%, ₹5L-₹10Lకు 14%, ₹10L-₹20Lకు 17%, ₹20L+కు 18% ట్యాక్స్ విధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో లైఫ్ ట్యాక్స్ 20% నుంచి 21%గా ఉంది. కాగా TGలో ఎలక్ట్రిక్ వెహికల్స్కు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

BGT రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XIతో టీమ్ ఇండియా 2 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కాన్బెర్రాలో మనుక ఓవల్ మైదానంలో ఇవాళ ఉ.9.10కు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్స్టార్ యాప్లో లైవ్ చూడవచ్చు. తొలి టెస్టులో ఆడని రోహిత్ శర్మ, గిల్ ఈ మ్యాచులో ఎలా ఆడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో జరగనుంది.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

HUL, విప్రో లాంటి FMCG కంపెనీలు సంతూర్, డవ్, లక్స్, లైఫ్ బాయ్, లిరిల్, పియర్స్, రెక్సోనా తదితర సబ్బుల ధరలను పెంచాయి. ముడి సరుకైన పామ్ ఆయిల్ ధరలు 35-40 శాతం పెరగడంతో సబ్బుల రేట్లను 7-8% పెంచుతున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. వీటితో పాటు టీ, స్కిన్ క్లీనింగ్ ఉత్పత్తుల రేట్లు సైతం పెరిగాయి. ఇటీవల కాఫీ, టీ పౌడర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే.

AP: రాష్ట్రంలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

AP: రేపు(ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. CBN ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు.

అండర్-19 ఆసియా కప్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు మహ్మద్ అమన్ సారథ్యం వహిస్తున్నారు. జట్టులో IPL వండర్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. U19 ఆసియా కప్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తొమ్మిదో టైటిల్ బరిలో భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది.

TG: జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 99శాతం కుల గణన సర్వే పూర్తి అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయినట్లు పేర్కొంది. 49,79,473 ఇళ్లకు కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. అత్యధికంగా ములుగు 92శాతం డేటాను కంప్యూటీకరించారు. మరోవైపు GHMCలో 82.4 శాతం సర్వే పూర్తయింది.
Sorry, no posts matched your criteria.