India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పాలమూరులో గత రెండు రోజులుగా నిర్వహిస్తోన్న రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సభలో సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే విషయాలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

TG: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్ఏఎస్సీఐ స్కీమ్తో రెండింటిని డెవలప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.

BGT రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఈ గ్రౌండ్లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికలో కోహ్లీ సగటు 60కి పైనే ఉంది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది.

దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.

క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన రూ.92 కోట్లు చెల్లించారు. ఆయన తర్వాతి స్థానంలో దళపతి విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్(రూ.75 కోట్లు) ఉన్నారు. వారి తర్వాత స్థానాల్లో అమితాబ్(రూ.71 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.66 కోట్లు) నిలిచారు. మహిళా సెలబ్రిటీల్లో కరీనా కపూర్ రూ.20 కోట్లతో టాప్లో ఉన్నారు.

మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయమై స్పష్టత రాని నేపథ్యంలో శిండే వర్గం నేత సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 గంటల్లో షిండే పెద్ద నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. కాగా సీఎం ఎవరనేది అమిత్ షానే నిర్ణయిస్తారని తెలిపారు. డిసెంబర్ 2న ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు శిండే ఆకస్మాత్తుగా సొంత గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరోసారి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఓ మ్యాచ్లో బౌలింగ్ వేసే సమయంలో షమీ నడుం నొప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. తమ వైద్యాధికారులు షమీకి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారని BCCI వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడటం అనుమానంగా మారింది.

ఈ ఏడాది పలువురు హీరోయిన్లు టాలీవుడ్లో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ జాబితాలో సమంత, అనుష్క, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేశ్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరిలో కొందరు ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తున్నా తెలుగులో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. కాగా అనుష్క, కీర్తి సురేశ్, రాశీ ఖన్నా నటిస్తోన్న సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన భామలూ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.

1915: కన్యాశుల్కం నాటక కర్త గురజాడ అప్పారావు మరణం
1945: ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ జననం
1948: ప్రముఖ నటి కె.ఆర్.విజయ జననం
1990: ప్రముఖ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ జననం
1990: సినీ నటి రాశీ ఖన్నా జననం
2012: మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం
2021: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం
Sorry, no posts matched your criteria.