India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమ సైనికులకు చెందిన 500కి పైగా మృతదేహాలను రష్యా తమకు పంపించిందని ఉక్రెయిన్ తెలిపింది. వీరిలో అత్యధికులు తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో కన్నుమూసినవారేనని వెల్లడించింది. ‘మా అమరవీరుల మృతదేహాలు మాకు అందేలా కృషిచేసిన రెడ్ క్రాస్కు కృతజ్ఙతలు. ఈ బాడీలన్నింటికీ ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తాం. అనంతరం చనిపోయిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి వారి కుటుంబీకులకు అందజేస్తాం’ అని స్పష్టం చేసింది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: నవంబర్ 30, శనివారం
చతుర్దశి: ఉ.10.30 గంటలకు
విశాఖ: మ.12.34 గంటలకు
వర్జ్యం: సా.4.52-6.35 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.6.20-7.05 గంటల వరకు

* AP: కాకినాడ పోర్టును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్
* TG: లగచర్ల భూసేకరణ రద్దు చేసుకున్న ప్రభుత్వం
* AP: రిషితేశ్వరి కేసు కొట్టేసిన గుంటూరు కోర్టు
* TG: 10th ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయం వాయిదా
* ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం: CM రేవంత్
* AP: సంక్రాంతి నుంచి జగన్ జిల్లాల పర్యటన
* TG: రాష్ట్రవ్యాప్తంగా BRS దీక్ష దివస్
* First Time: జట్టులోని 11 మంది బౌలింగ్

IPL వేలం క్రికెట్ ప్రేమికుల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. ప్రపంచ దేశాల్లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన వార్నర్, విలియమ్సన్, చిన్న దేశం బంగ్లా నుంచి వచ్చినా అగ్రశ్రేణి దేశాలను వణికించిన ముస్తఫిజుర్ రెహ్మాన్ ఈ IPL వేలంలో అమ్ముడుపోలేదు. అయితే అంతటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను కొనని ఫ్రాంచైజీలు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?

గుజరాత్లో ఏకంగా న్యాయమూర్తికే లంచం ఇచ్చేందుకు యత్నించాడో వ్యక్తి. పంచమహల్ జిల్లా కోర్టులోకి ప్రవేశించిన బాపూ సోలంకీ అనే వ్యక్తి సరాసరి న్యాయమూర్తి ముందు ఓ సీల్డ్ కవర్ పెట్టాడు. కోర్టు సిబ్బంది దాన్ని ఓపెన్ చేయగా రూ.35వేలు కనిపించాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరో ఇవ్వమన్నారని సమాధానమిచ్చాడు. జడ్జి ఆదేశాల మేరకు ACB అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు తెలిపారు.

తెలంగాణలో మెడికల్ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కాలేజీ రూ.2.89 కోట్లు, MNR కాలేజీ రూ.2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు కాలేజీ రూ.3.33 కోట్ల ఆస్తులున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్మెంట్ కోటాలో అమ్ముుకున్నట్లు ఆయా కాలేజీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో గతేడాది జూన్లో రాష్ట్రంలోని 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి, కేసులు నమోదు చేసింది.

మ్యాచ్-ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరెస్టయ్యారు. 2016లో డొమెస్టిక్ T20 రామ్ స్లామ్ ఛాలెంజ్ టోర్నీలో వీరు ఫిక్సింగ్కు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. దీంతో లెనాక్స్ త్సోత్సోబే (40), థమ్సంకా త్సోలేకిలే (44), ఎథీ మభలతి (43)లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 80శాతం మార్కులతో పరీక్షలు, 20 శాతం ఇంటర్నల్ మార్కులుంటాయని పేర్కొంది. గ్రేడింగ్ విధానంతోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. కాగా ఈసారి నుంచి ఇంటర్నల్ ఎత్తివేస్తామని ప్రభుత్వం నిన్న <<14735937>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.

డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే ప్రకటనలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘మన పిల్లల్ని, రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి రక్షించుకునేందుకు ప్రజల్లో అవగాహనకోసం చేపట్టిన ప్రచారంలో అల్లు అర్జున్ని చూడటం సంతోషంగా ఉంది. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’ అని ట్విటర్లో పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.