India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పీరియడ్స్ టైమ్లో అసౌకర్యాన్ని తొలగించడంలో దాల్చినచెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్టులు, వైద్యులు అంటున్నారు. ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్తనాళాలను సంకోచింపజేసి అధిక రక్తస్రావాన్నీ ఇది నివారించగలదు. వికారం, కడుపులో తిప్పడం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అగ్రపీఠం వేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఏడాది కాలంలోనే అన్నదాతలకు ₹54,280కోట్ల ప్రయోజనం చేకూరిందని వివరించారు. 22లక్షలకుపైగా రైతులకు ₹17,870Cr రుణమాఫీ, పంటల బీమాకు ₹1,300Cr, ధాన్యం కొనుగోళ్లకు ₹5,040Cr, ఉచిత్ విద్యుత్కు ₹10,444Cr, రైతు భరోసాకు ₹7,625Cr, బీమా ప్రీమియానికి ₹1,455Cr, గత యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ₹10,547Cr వెచ్చించినట్లు తెలిపారు.

TG: జైలుకు వెళ్లొచ్చిన వారు CM అవుతారనుకుంటే KTRకు ఆ ఛాన్స్ లేదని, ఎందుకంటే కవిత ఆల్రెడీ జైలుకు వెళ్లొచ్చారని CM రేవంత్ వ్యాఖ్యలపై MLC కవిత స్పందించారు. సెన్సేషన్ కోసమే రేవంత్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో జైలు జీవితం కేవలం చిన్న గ్యాప్ మాత్రమేనన్నారు. లగచర్ల భూసేకరణ రద్దు BRS విజయమన్న కవిత.. హాస్టల్స్లో అమ్మాయిలు చనిపోతే ప్రభుత్వం విఫలమైనట్లు కాదా? అని ప్రశ్నించారు.

బంగ్లాలోని హిందువులు, మైనారిటీల రక్షణ అక్కడి ప్రభుత్వ బాధ్యతని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. వీరిపై జరుగుతున్న దాడుల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వం ముందు వ్యక్తం చేసినట్టు తెలిపారు. బంగ్లాలో పరిస్థితులను హైకమిషన్ సమీక్షిస్తోందని పేర్కొన్నారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

T20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. ఒకే మ్యాచ్లో 11 మంది బౌలింగ్ చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మణిపుర్తో మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ 11 మందితో బౌలింగ్ చేయించారు. వికెట్ కీపర్ బదోనీ కూడా బౌలింగ్ వేసి 1 వికెట్ తీశారు. ఇలా జట్టులోని అందరు ఆటగాళ్లతో బౌలింగ్ చేయించడం ఇదే తొలిసారి. కాగా ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. IPLలో దక్కన్ ఛార్జర్స్, RCB 9 మంది బౌలర్లను ఉపయోగించాయి.

హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి ఓ సందేశంగా భావించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు AICC అధ్యక్షుడు ఖర్గే క్లాస్ తీసుకున్నారు. CWC సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్గతంగా ఐక్యత లోపించడం పెద్ద సమస్య అని అన్నారు. నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయని ఘాటుగా స్పందించారు. ఐక్యంగా లేకపోతే ప్రత్యర్థిని ఎలా ఓడిస్తామని ప్రశ్నించినట్టు తెలిసింది.

డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) గ్రేడ్-2 ఫలితాలను TGPSC విడుదల చేసింది. మొత్తం 53 పోస్టులకు 1,06,253 మంది దరఖాస్తు చేశారు. తాజాగా మల్టీ జోన్-1, 2 వారీగా ఫలితాలు వెలువడ్డాయి. నేరుగా హాల్టికెట్ నంబర్ చూసుకునేందుకు ఇక్కడ <

AP: మాజీ సీఎం, YSRCP అధినేత YS జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ప్రతి రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సమీక్షిస్తారు.

కుల ఆధారిత అసమానతలను పెంపొందించే అవకాశం ఉన్నందున ‘PM విశ్వకర్మ’ పథకాన్ని తిరస్కరిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 రకాల చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించే ఈ పథకానికి వారసత్వంగా వృత్తిని స్వీకరించిన వారే అర్హులనడం వివాదమైంది. ఇతర వర్గాలను ఎంపిక చేయకపోవడం వివక్ష చూపడమే అని పేర్కొంది. అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ తామే కొత్త పథకాన్ని తెస్తామని తెలిపింది.

మనకు నచ్చని పని చేసేందుకు వెనకాడుతున్నట్లే.. కప్పలు కూడా మగవాటితో సంభోగం ఇష్టం లేకుంటే అవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కప్పలు మగవాటి దృష్టిని మళ్లించేందుకు చనిపోయినట్లు నటిస్తాయని కెమెరాలో రికార్డయింది. కలయిక ఇష్టం లేని సమయంలో దాన్నుంచి తప్పించుకోవడానికి కప్పలు వంటివి ఇలా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవర్తించడాన్ని గుర్తించారు. తెలివిగా కదలకుండా, కళ్లు మూసుకొని, నిర్జీవ స్థితిలో ఉంటున్నాయి.
Sorry, no posts matched your criteria.