India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగ్లాలో హిందువులపై దాడి మీడియా సృష్టి కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ‘హిందువులే లక్ష్యంగా బంగ్లాలో జరుగుతున్న దాడుల గురించి భారత్ క్రమం తప్పకుండా ఆ దేశ ప్రభుత్వం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హింసాత్మక దాడులు, హిందువులపై ఉగ్రముద్రను మీడియా ఊహగానాలుగా కొట్టిపారేయకూడదు. మైనారిటీలను రక్షించాలని బంగ్లాకు స్పష్టం చేశాం’ అని తెలిపారు.

ఏంటీ చిట్టెలుకలు గొడవపడుతున్న ఫొటోను పెట్టారు అనుకుంటున్నారా? ఇది మామూలు ఫొటో కాదండోయ్. 2019 వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ LUMIX పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. లండన్లోని ఓ అండర్గ్రౌండ్ సబ్ వేలో ఎలుకలు పోరాడుతుండగా ఫొటోగ్రాఫర్ సామ్ రౌలీ ఫొటో తీశారు. ఈ పోటీలో మొత్తం 48,000 కంటే ఎక్కువ ఫొటోలు సమర్పించగా దీనికి అంతా జై కొట్టారు. తాజాగా ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీపై ICC కీలక సమావేశం శనివారానికి వాయిదా పడింది. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆతిథ్య పాకిస్థాన్లో పర్యటించేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్లో కొనసాగించినా భారత మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో తటస్థ వేదికలపై నిర్వహించాలని BCCI కోరింది. ఈ విషయాన్ని తేల్చడానికి ICC తలపెట్టిన కీలక సమావేశం అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది.

AP: బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ పనిచేస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని Dy.CM పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కిలో బియ్యం రూ.73 చొప్పున విదేశాలకు అమ్ముతూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్ద భద్రతా లోపమే దీనికి కారణమని, సెక్యూరిటీ పెంచేలా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఏ సంస్థతో విచారణ జరపాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది.

TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.

FY25 Q2లో జీడీపీ వృద్ధిరేటు 5.4%గా నమోదైంది. చివరి త్రైమాసికంలోని 6.7%, గతేడాది ఇదే టైమ్లోని 8.1%తో పోలిస్తే బాగా మందగించింది. చివరి 7 త్రైమాసికాల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ఆర్థిక కార్యకలాపాల్లో కీలకమైన GVA 5.6 శాతానికి పెరిగినా FY24 Q2 నాటి 7.7%తో పోలిస్తే తగ్గింది. తయారీ, మైనింగ్ రంగాల్లో వృద్ధిరేటు, పబ్లిక్ స్పెండింగ్, కన్జంప్షన్, కార్పొరేట్ ఎర్నింగ్స్ తగ్గడమే మందగమనానికి కారణాలు.

ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ‘అబ్బా.. నీకు హార్ట్ లేదబ్బా’ అని ఎదుటి వ్యక్తులు అంటుంటారు. అయితే, నిజంగానే హార్ట్ లేని వ్యక్తి గురించి మీకు తెలుసా? 2011లో క్రైగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తికి అమిలోయిడోసిస్ కారణంగా గుండె, కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయి. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్యులు అతనికి గుండెకు బదులు ఓ పరికరాన్ని అమర్చి మరికొన్నిరోజులు బతికేలా చికిత్స చేశారు.

టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

భారత బీమా కంపెనీల్లో FDI పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు బీమా వ్యాపారాలను నిర్వహించేందుకు కంపెనీలకు అనుమతించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఇక అన్ని కంపెనీలూ లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందించేందుకు వీలవుతుంది. ఇక ఫారిన్ రీఇన్సూరర్స్ సొంత నిధుల అవసరాన్ని రూ.5000 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.
Sorry, no posts matched your criteria.