India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం జగన్కు ఆస్కార్ ఇవ్వొచ్చని YS షర్మిల అన్నారు. ‘2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంది. గుజరాత్ ₹1.99కే కొంటే మీరు 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49కు కొన్నారు. ఇందుకోసం మీకు శాలువాలు కప్పి సన్మానాలు చేయాలా? మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలి’ అని ట్వీట్ చేశారు.

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హాట్ షాట్స్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ నిర్మాణం, ప్రసారం కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ విచారణ చేస్తోంది. ఇదే కేసులో 2021 జులైలో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల జైలు జీవితం అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు.

శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలోని ప్రసిద్ధ పథినెట్టంపాడి (18 మెట్లు) వద్ద ఫొటోలు, వీడియోలు తీయరాదని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ మధ్యే పోలీసులు అక్కడ ఫొటోషూట్ చేయడం వివాదాస్పదమైంది. కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం పథినెట్టంపాడితో పాటు తిరుమట్టం వద్ద వ్లోగర్స్, భక్తులు వీడియోలు, ఫొటోలు తీయొద్దని తెలిపింది. విడిచిన బట్టలు మల్లికాపురం ఆలయంపై వేయొద్దని, గోడలపై పసుపు చల్లొద్దని సూచించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఎలిజావెటా క్రివోనోగిఖ్(21) అనే సీక్రెట్ కూతురు ఉన్నట్లు ఓ ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. ఆమె తన పేరును లూయిజా రోజోవాగా మార్చుకుని రెండేళ్లుగా పారిస్లో జీవిస్తున్నట్లు తెలిపింది. పుతిన్, ప్రేయసి స్వెత్లానాలకు ఈమె జన్మించినట్లు పేర్కొంది. మాజీ భార్య లియుడ్మిలాతో పుతిన్కు ఇద్దరు ఆడబిడ్డల సంతానం కలిగారు. ఒలింపిక్ జిమ్నాస్ట్ అలీనాతో ఇద్దరు కొడుకులు ఉన్నట్లు సమాచారం.

మహారాష్ట్రలో సీఎం పదవి బీజేపీకి ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి. సీఎం పదవిపై బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఓకేనని ఏక్నాథ్ శిండే ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా నిన్న బీజేపీ అగ్రనేతలతో దేవేంద్ర ఫడణవీస్, శిండే చర్చించారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోలో అమిత్ షా పక్కన శిండే నిరాశగా చూస్తున్నట్టు కనిపించింది. దీంతో సీఎం పదవిని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదా? అనే చర్చ మొదలైంది.

RGV కోసం పోలీసులు గాలిస్తుంటే, ఆయన మాత్రం పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి RGV కోసం వచ్చిన పోలీసులు 5రోజులుగా HYDలోనే మకాం వేశారు. ఇప్పటికే RGV హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్లపై అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలు, విశాఖ, గుంటూరులో వేర్వేరుగా RGVపై కేసులు నమోదయ్యాయి.

న్యూజిలాండ్తో జరుగుతోన్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అదరగొడుతున్నారు. ఇప్పటికే 70+ పరుగులు చేసి టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నారు. 36 ఇన్నింగ్స్లో 2300 బంతులను ఎదుర్కొన్న ఆయన 86.96 స్ట్రైక్ రేట్తో 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. దీంతో తక్కువ బంతుల్లో 2వేల రన్స్ పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్గా నిలిచారు. బెన్ డకెట్ (2293 బంతులు) ప్రథమ స్థానంలో నిలిచారు.

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనపై ఉన్న 3 FIRలలో రెండింటిని కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 3 FIRలు నమోదు చేశారని నరేందర్రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పైనిర్ణయం తీసుకుంది. లగచర్ల కేసులో A1గా ఉన్న నరేందర్రెడ్డి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అతని తొలి సినిమా రానుంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు డైరెక్టర్ ప్రకటించారు. మోక్షజ్ఞ ఫొటోను షేర్ చేస్తూ #SIMBAisComing అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీలో మోక్షజ్ఞ ఈ లుక్లోనే కనిపిస్తారేమోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మేకర్స్ ప్రమోషన్స్లో జోరును పెంచారు. ఇప్పటికే చెన్నై, కేరళలో ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కాలేజీలో డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సుకుమార్తో సహా చిత్ర బృందం పాల్గొంటుందని వెల్లడించాయి.
Sorry, no posts matched your criteria.