India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MH ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై <<14731795>>విమర్శలొస్తున్న<<>> వేళ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటింగ్ రోజు నవంబర్ 20న 5pmకు ఓటింగ్ 58.22%, మొత్తంగా 66.05% నమోదైందని చెప్పింది. 6pm వరకు క్యూలైన్లో వారు ఆ తర్వాత కూడా ఓట్లు వేశారంది. 2019లోనూ ఇలాగే పెరిగిందని స్పష్టం చేసింది. 5గంటల వరకు ఓటింగ్ శాతం ఫోన్ సంభాషణల ఆధారంగానే తీసుకున్నట్లు, ఫామ్ 17C సమాచారం, ఫైనల్ ఓటింగ్ శాతం ఒకేలా ఉందని తెలిపింది.

మధ్యప్రదేశ్లోని మౌగాంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలిక(16)ను కిడ్నాప్ చేసి కదులుతున్న ప్రభుత్వ అంబులెన్స్లో ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ఈ నెల 25న ఈ ఘటన జరగగా బాలిక ఫిర్యాదుతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. నిందితులైన అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతని స్నేహితుడు రాజేశ్ కేతవ్లను పోలీసులు అరెస్టు చేశారు.

డైట్ కంట్రోల్తో తన భార్యకు స్టేజ్-4 క్యాన్సర్ నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ లీగల్ నోటీసు పంపింది. 7రోజుల్లోగా ఆయన తన భార్య మెడికల్ ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ను సమర్పించాలని పేర్కొంది. సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే ₹850cr పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

APలో మహిళలు పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అందాలంటే పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్, NPCIతో లింక్ చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్దసంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

చలికాలంలో వేడి పదార్థాలు తినేందుకు మక్కువ చూపిస్తాం. పెరుగు, మజ్జిగ తీసుకుంటే కఫం వస్తుందని భావించి కొందరు దూరం పెడుతుంటారు. అయితే పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని జీర్ణాశయ ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో శరీరానికి పెరుగు ఎంతో అవసరమని, రోజుకు రెండు పూటలా తినొచ్చని సూచిస్తున్నారు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు <<14734849>>పడగొట్టిన<<>> సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ చరిత్ర సృష్టించారు. ఓ ఇన్నింగ్స్లో 7 ఓవర్ల లోపే(6.5) 7 వికెట్లు తీయడం 120 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1904లో AUS బౌలర్ హ్యూయ్ ట్రంబుల్ ENGపై 6.5 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీశారు. కాగా ప్రస్తుత టెస్టులో సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్కోర్లు: SL 42, RSA 191&132/3

TG: సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పయనం కానున్నారు. దీపాదాస్ మున్షీ, వంశీచంద్ రెడ్డి తదితరులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు.

TG: టెన్త్ పరీక్షల్లో <<14735937>>ఇంటర్నల్ మార్కులను<<>> తొలగించిన విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్నీ తొలగించాలని నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్ లెట్+అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇవ్వనుంది. సైన్స్ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్కు తన 150వ టెస్ట్ మ్యాచులో నిరాశ ఎదురైంది. NZతో తొలి టెస్టులో ఆయన డకౌట్ అయ్యారు. దీంతో AUS మాజీ క్రికెటర్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ సరసన చేరారు. వీరిద్దరూ తమ 150వ టెస్టులో డకౌట్గా వెనుదిరిగారు. 2002లో PAKపై స్టీవ్, 2010లో ENGపై పాంటింగ్ 150th టెస్ట్ ఆడారు. రూట్ కంటే ముందు 10 మంది క్రికెటర్లు 150 టెస్టులు ఆడిన ఘనతను అందుకున్నారు. అత్యధిక టెస్టులు సచిన్(200) ఆడారు.

AP: RTPPలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్(బూడిద) తరలింపు విషయంలో BJP MLA ఆదినారాయణరెడ్డి, TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంవో నుంచి పిలుపువచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. RTPP నుంచి వేల టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించుకున్నాయి.
Sorry, no posts matched your criteria.