News November 29, 2024

సోయాబీన్ కొనుగోళ్లలో తొలి స్థానంలో తెలంగాణ

image

సోయాబీన్ కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన నిర్ణీత లక్ష్యంలో 74 శాతం పూర్తయినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు 1-2 శాతమే కొనుగోళ్లు చేశాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు 59,708 టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా 43,755 టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

News November 29, 2024

SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.

News November 29, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’

image

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.

News November 29, 2024

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో DEC 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో 30వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

News November 29, 2024

3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న చిత్రాలివే..

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ రన్ టైమ్ 3 గంటలకుపైనే అని తెలుస్తోంది. తెలుగులో అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రంగా దానవీరశూరకర్ణ(3.46 గం.) ఉంది. ఆ తర్వాత లవకుశ(3.28 గం.), పాండవ వనవాసం(3.18గం.), పాతాళ భైరవి(3.15గం.) వంటి చిత్రాలు నిడివి ఎక్కువగా ఉండి అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, RRR వంటి సినిమాల రన్ టైమ్ 3 గంటలకు‌పైనే కావడం గమనార్హం.

News November 29, 2024

మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం!

image

TG: కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ తీర్మానం చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టభద్రుల స్థానాన్ని నిలుపుకోవాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

News November 29, 2024

ధరణి సమస్యల పరిష్కార బాధ్యత వారిదే..

image

TG: ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి బాధ్యత అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలదేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్లికేషన్ల పరిష్కారానికి తహశీల్దార్‌కు 7 రోజులు, ఆర్డీవోకు 3 రోజులు, అదనపు కలెక్టర్‌కు 3 రోజులు, కలెక్టర్‌కు 7 రోజుల గడువు ఇచ్చింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించింది.

News November 29, 2024

రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలు: నితిన్ గడ్కరీ

image

జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. LSలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫాస్టాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి రాలేదన్నారు.

News November 29, 2024

శీతాకాలంలో కొందరికే చలి ఎక్కువ.. ఎందుకంటే?

image

కొందరు ఉన్న చలి కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. విటమిన్లు, పోషకాల లోపం వల్ల కొందరి శరీరం వేడిని నిర్వహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఐరన్ లోపం ఉన్న వారి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చలి అనుభవిస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తక్కువ రక్త ప్రవాహం ఉండేవారికీ చలి ఎక్కువగా పుడుతుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

News November 29, 2024

ముంబైలో మరోసారి భేటీ: ఏక్‌నాథ్ శిండే

image

కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో చర్చలు సానుకూలంగా జరిగినట్లు మహారాష్ట్ర అపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే తెలిపారు. ఎన్నికల్లో విజయం తర్వాత షా, నడ్డాతో ఇదే తొలి సమావేశమని చెప్పారు. మరో సమావేశం ముంబైలో ఉంటుందని తెలిపారు. ఇందులో సీఎం ఎవరనే విషయమై నిర్ణయానికి వస్తారని పేర్కొన్నారు. షాతో భేటీ తర్వాత మహాయుతి నేతలు తిరిగి ముంబైకి పయనమయ్యారు.