India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గతంలో జాతీయ హోదా కలిగిన NCPని తిరిగి ఆ స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ చీఫ్ అజిత్ పవార్ పేర్కొన్నారు. కొత్త తరాన్ని ముందుకు తీసుకువస్తామని, అందులోనూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. Decలో పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. 3 స్టేట్స్లో రాష్ట్ర పార్టీగా ఉన్నామని, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు NCP MP ప్రఫుల్ పటేల్ తెలిపారు.

USలోకి అక్రమ వలసలను నివారించే వరకు మెక్సికో, కెనడా దేశాలపై ట్రంప్ పన్నుల మోత మోగించనున్నారు. ముఖ్యంగా కెనడా నుంచి వలసలు అధికమవుతున్నాయని, అందులోనూ భారతీయులు అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది గంటకు 10 మంది భారతీయులు యూఎస్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కెనడా నుంచి USలోకి వెళ్లే అక్రమ వలసదారుల్లో 60% భారతీయులే ఉండడం గమనార్హం.

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ డిసెంబర్ 11వ తేదీకి వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనుంది. అలాగే రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులపై ప్రణాళికలు రచిస్తోంది.

దాంపత్యంలో గొడవలు సాధారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మనోవేదన చెందినా అకారణంగా భార్య పెట్టుకొనే గొడవ క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. దీని ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేయలేమని Dr భగీశ్ కుమార్ VS రింకీ కేసులో వెల్లడించింది. 2015లో ఒత్తిడితో పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచి ఆమె చేతిలో కష్టాలు, అవమానాలు, బ్లాక్మెయిలింగ్ ఎదుర్కొన్నానన్న భర్త ఆమెతో విడిపోవడానికి సరైన సాక్ష్యాలు చూపలేదంది.

బంగ్లాదేశ్లో ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అక్రమమని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆ దేశ Ex PM షేక్ హసీనా డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లలో న్యాయవాది మృతి చెందడాన్ని ఖండించారు. ఆలయాలు, మసీదులపై దాడులు జరుగుతున్నా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత స్వేచ్ఛ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

TG: కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్కడ LHB, EMU కోచ్లు తయారీ చేసేందుకు వీలుంటుంది. కాగా కోచ్ల తయారీకి తగినట్లు సౌకర్యాలు అభివృద్ధి చేయాలని SCRకు ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో కొత్తగా దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.

TG: టెన్త్ పరీక్షల మార్కుల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇంటర్నల్స్కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు ఉదయానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. నవంబర్ 30న తుఫాన్ తీరం దాటనుంది.

AP: డ్రగ్స్ నియంత్రణకు <<14724446>>ఈగల్ను <<>>ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పనుంది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.
Sorry, no posts matched your criteria.