India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6గంటల్లో 2కి.మీ. వేగంతో నెమ్మదిగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 110కి.మీ, నాగపట్నానికి 310కి.మీ, పుదుచ్చేరికి 410కి.మీ, చెన్నైకి 480కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. రానున్న 12 గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, రేపు ఉదయం లోపు తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

అక్కినేని చైతన్య-శోభితతోపాటు అఖిల్-జైనబ్ వివాహం డిసెంబర్ 4నే జరుగుతుందనే ప్రచారాన్ని నాగార్జున ఖండించారు. చిన్న కొడుకు పెళ్లి వచ్చే ఏడాది చేస్తామని తెలిపారు. ‘అఖిల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అతనికి కాబోయే భార్య జైనబ్ మంచి అమ్మాయి. వారిద్దరూ జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోవడం మంచి విషయం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అఖిల్-జైనబ్ ఎంగేజ్మెంట్ ఈ నెల 26న జరిగిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్ PM నెతన్యాహు, డిఫెన్స్ మాజీ మంత్రి యోవ్ గాలెంట్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC) గత వారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని ICCలో అప్పీల్ చేసినట్లు ఇజ్రాయెల్ PMO తెలిపింది. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తే ICC ఇజ్రాయెల్ పట్ల ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తుందో తెలుస్తుందని పేర్కొంది. గాజాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ICC నోటీసులిచ్చింది.

ఇండియా మోస్ట్ వెయిటింగ్ మూవీ ‘పుష్ప-2’ రిలీజ్ నేపథ్యంలో ఓ బాలీవుడ్ సినిమా వాయిదా పడింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఛావా’ డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. ఒక రోజు ముందే పుష్ప-2 రిలీజ్ కానుండటంతో, ఆ మేనియాలో వెనకబడకూడదనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఛావా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

దీపావళికి వచ్చి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.

TG: ఏడాదిలో రైతుల కోసం రూ.54,280కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి గుర్తుగా మహబూబ్నగర్లో మూడో రోజులపాటు ‘రైతు పండుగ’ నిర్వహిస్తోంది. అయితే రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్ వంటివి కలిపి ఇంకా రూ.40,800 కోట్లు చెల్లించాల్సి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏం చేశారని ‘రైతు పండుగ’ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై మీ కామెంట్.

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో NIA నేడు 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యవస్థీకృత నెట్వర్క్ను నాశనం చేయడమే లక్ష్యంగా సోదాలు ఆరంభించింది. ఇందుకు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంది. విదేశీ సిండికేటుతో ఇక్కడి ముఠాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తోంది. బాలకార్మికులు, నిరుపేదలే టార్గెట్గా వ్యాపారం చేస్తున్నట్టు అనుమానిస్తోంది. ఏయే రాష్ట్రాల్లో దాడులు చేపట్టారో తెలియాల్సి ఉంది.

TG: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని CM రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారన్నారు.

క్రికెట్లో సంస్కరణల్లో భాగంగా డేనైట్ టెస్టులను ICC 2015లో ప్రారంభించింది. సాధారణ టెస్టులు రెడ్ బాల్తో జరుగుతుండగా, డేనైట్ ఫార్మాట్ను పింక్ బాల్తో నిర్వహిస్తున్నారు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయడం వల్ల రెడ్ బాల్ ఫ్లడ్ లైట్ల వెలుగులో సరిగ్గా కనిపించదు. అందుకే పింక్ బాల్ను వాడుతుంటారు. టెస్టు క్రికెటర్ల డ్రెస్సులు తెల్లగా ఉన్నందున వైట్ బాల్ను ఉపయోగించరు. 9 ఏళ్లలో 22 డే నైట్ టెస్టులు జరిగాయి.

ఝార్ఖండ్ ఫలితాలపై ఇండియా కూటమి హ్యాపీగా ఉందని కర్ణాటక DCM డీకే శివకుమార్ అన్నారు. మహారాష్ట్ర ఓటమిపై అంతర్మథనం అవసరమన్నారు. మిగతా వాళ్లలా EVMలపై ఆయన నిందలేయకపోవడం గమనార్హం. ‘హేమంత్ సోరెన్ నాయకత్వంలో మా కూటమి గెలవడం హ్యాపీ. ఆయన మెరుగైన పాలన అందించారు. కష్టపడి ప్రజల్లో విశ్వాసం పొందారు. ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మహారాష్ట్ర ప్రజల తీర్పును మేం గౌరవించి ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల’ని అన్నారు.
Sorry, no posts matched your criteria.