India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లక్నోకు చెందిన చందాని శర్మ(18) ఇండియా-A U19 జట్టుకు ఎంపికయ్యారు. IND-B U19, SAతో జరిగే ట్రై సిరీస్లో ఆడనున్నారు. ఆమె తండ్రి బార్బర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యలున్నప్పటికీ కుటుంబం, కోచ్ల సాయంతో క్రికెట్లో రాణిస్తున్నారు. 10kms సైకిల్పై ప్రయాణించి నార్తర్న్ రైల్వే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తనకు చాహల్ ఐడల్ అని, రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇష్టమని ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ తెలిపారు.

AUSపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్పై దృష్టిసారించింది. డిసెంబర్ 6-10 మధ్య ఆడిలైడ్ వేదికగా డే-నైట్ టెస్టు పింక్ బాల్తో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కు మ్యాచ్ మొదలవనుంది. స్టార్స్పోర్ట్స్, డిస్నీ+హాట్ స్టార్లో వీక్షించవచ్చు. స్వదేశంలో 3 డే-నైట్ టెస్టుల్లో బంగ్లా, ఇంగ్లండ్, శ్రీలంకపై భారత్ గెలవగా ఆడిలైడ్లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు అక్కడే మ్యాచ్ జరగనుంది.

ప్రేమ, పెళ్లి పేరుతో బ్లాక్మెయిల్ చేసే వారికి భయపడొద్దని తెలంగాణ పోలీసులు సూచించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో బెదిరించే వారిపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా యువతులకు అవగాహన కల్పిస్తున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని, వారి వివరాలు ఎక్కడా బహిర్గతం అవకుండా జాగ్రత్త తీసుకుంటామని తెలిపారు. 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఐఫోన్ 17 ప్రో/మ్యాక్స్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 5-6mm మందం, A19 ప్రో చిప్తో దీనిని రూపొందించనున్నట్లు సమాచారం. సింగిల్ స్పీకర్, 8జీబీ Ram, 48mp రేర్, 24mp ఫ్రంట్ కెమెరాలతో 5G e-Sim సాంకేతికతతో తయారవుతుందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధర వేరియంట్ను బట్టి రూ.80 వేల నుంచి రూ.1.7 లక్షల వరకు ఉంటుందని అంచనా.

AP: అనంతపురం మెడికల్ కాలేజీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలో మెడికో వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ‘నా చావుకు నేనే కారణం. ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల ఒత్తిడిని భరించలేక చనిపోతున్నా. ఎగ్జామ్స్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా’ అని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 24,270 (-7), సెన్సెక్స్ 80,190 (-45) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందాయి. చివరి 2 సెషన్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు స్వీకరిస్తున్నారు. మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, O&G రంగాల్లో డిమాండ్ కనిపిస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. TECH M, INFY, EICHERMOT, M&M, HCL TECH టాప్ లూజర్స్.

AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.

AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీనే రామాలయ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగగా, 10 రోజుల ముందుగానే వార్షికోత్సవం నిర్వహించడానికి ఓ కారణం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య శుక్ల ద్వాదశి(కూర్మ ద్వాదశి) నాడు వేడుక నిర్వహించాలి. 2025లో ఈ తిథి జనవరి 11నే రావడంతో ఆ రోజే వేడుకలు జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.