India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు, వంట పూర్తయ్యాక చెక్ చేయనున్నారు. ఇందుకోసం టీచర్లు, విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. సరిగా లేకుంటే వెంటనే మార్చేస్తారు.

AP: డీఎస్సీకి ప్రిపేరవుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూఖ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. దీని కోసం అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైట్ లేదా మెనార్టీ డైరెక్టర్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0866-2970567 నంబర్కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

AP: వైద్యుల నిర్లక్ష్యం ఓ వివాహిత ప్రాణం తీసింది. పాలకొల్లుకు చెందిన శిరీష(34) అస్వస్థతకు గురికావడంతో డయాలసిస్ కోసమని కాకినాడ GGHలో చేర్చారు. మొన్న రక్తం ఎక్కించగా కాసేపటికే ఆమె పరిస్థితి విషమించింది. O పాజిటివ్ బదులు AB పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించామని వైద్యులు గ్రహించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె నిన్న మరణించింది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.3 లక్షల చెక్కును పరిహారంగా అందించారు.

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్నగర్లో ‘రైతు పండుగ’ నిర్వహించనుంది. దీనిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు 150 స్టాళ్లను ఏర్పాటు చేయనుండగా వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.

TG: ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ఇవాళ రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TGPSC ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్కు సంబంధించి వెరిఫికేషన్ నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఒకవేళ ఇవాళ వెరిఫికేషన్కు గైర్హాజరైనా, సర్టిఫికెట్లు పెండింగ్ ఉన్నా ఈ నెల 29న రీ-వెరిఫై చేస్తారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ఆమె నేడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా సోదరుడు రాహుల్ లోక్సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వయనాడ్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రియాంక చరిత్ర సృష్టించారు.

చాలా మంది బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేస్తుంటారు. వెంటనే తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నోటిలోని Ph స్థాయి ఆల్కలైన్గా మారుతుంది. ఇది ఆహార పదార్థాలను కొంతసేపటి వరకు జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆహార పదార్థాల రుచిని నాలుక గుర్తించలేదు. టూత్పేస్ట్లో ఉండే కొన్ని కెమికల్స్ నోటి రుచిని తాత్కాలికంగా మార్చివేస్తాయి. అందుకే బ్రష్ చేసిన 10-15 నిమిషాల తర్వాత తినడం ఉత్తమం.

భారత యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ టెస్టుల్లో 40కి పైగా సెంచరీలు చేస్తారని ఆస్ట్రేలియన్ ప్లేయర్ మ్యాక్స్వెల్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా జట్టు అతడిని ఆపకుంటే ఈ సిరీస్ మరింత భయంకరంగా ఉంటుందన్నారు. భిన్న పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప సామర్థ్యాన్ని ఈ కుర్రాడు కలిగి ఉన్నాడని మ్యాక్సీ ప్రశంసించారు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన జైస్వాల్ 4 సెంచరీలు చేశారు. అన్నింట్లోనూ 150+ పరుగులు చేయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.