India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందడం గమనార్హం. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్(18) చరిత్ర సృష్టిస్తారు.

TG: HYDలోని చెరువుల FTL, బఫర్జోన్లు నిర్ధారించే వరకు వాటిపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. HMDA పరిధిలో 3,532 చెరువులున్నాయని, 2,793 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్లు, 530 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నోటిఫికేషన్ల ఖరారుకు 3 నెలల గడువు కోరింది. కాగా గడువు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు DEC 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఓ బ్రిటిష్ వ్యక్తిని ఒకే ఒక లాటరీ UKలోని టాప్ సెలబ్రిటీల కంటే సంపన్నులను చేసింది. హాలీవుడ్ నటుడు హ్యారీ స్టైల్స్, హెవీ వెయిట్ బాక్సర్ ఆంథోని జోషువా(రూ.1,784కోట్ల)ను మించిన రిచెస్ట్ పర్సన్ అయ్యారు. నిన్న తీసిన యూరో మిలియన్స్ డ్రాలో ఓ లాటరీ విన్నర్ ఏకంగా రూ.1,804కోట్లు దక్కించుకున్నారు. UK చరిత్రలో ఇది మూడవ అతిపెద్ద మొత్తం. కాగా ఆ విన్నర్ ఎవరనేది తెలియలేదు. 2022లో రూ.1987.63కోట్ల లాటరీ టాప్.

AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మారిటైమ్ పాలసీపై ఆయన చర్చించారు. ‘తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు.

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. TG BJP నేతలతో భేటీ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు BRS దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారని, ఇప్పుడు ఎంతో ఆశతో BJP వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో BJP ఉనికి వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, BRSల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా BJP స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో మూవీ టీమ్తో ఆయన షూటింగ్లో జాయిన్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 28న సినిమా విడుదల కానుంది. ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తుండగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

తమిళ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇటీవల వీరు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని గత వారం కోర్టు విచారణలో ఇద్దరూ చెప్పారు. దీంతో ఏకాభిప్రాయం ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చింది. రజినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకోగా, 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి ఇద్దరు కుమారులు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ సెన్సార్ పూర్తైనట్లు తెలుస్తోంది. కొన్ని బీప్స్తో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. సినిమాలో జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్, పుష్ప-శ్రీవల్లి మధ్య ఎమోషన్ సీన్లు అదిరిపోయాయంటూ సినీ వర్గాలు సినిమాపై ఓ రేంజ్లో హైప్ సృష్టిస్తున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

ఓ ఇంగ్లిష్ డైలీలో పబ్లిష్ అయిన ఓ మ్యాట్రిమోని యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘స్త్రీవాద అభిప్రాయాలతో పొట్టి జుట్టు, చెవి పోగులు గల 30+ వయసు గల విద్యావంతురాలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆమెకు 25-28 మధ్య వయస్సులోని అందమైన యువకుడు కావలెను. ఏకైక సంతానమై సొంత వ్యాపారాలు, భారీ బంగ్లా లేదా 20 ఎకరాల భూమి ఉండాలి. వంట తప్పక తెలియాలి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ డిమాండ్లపై మీరేమంటారు?

IPL 2025 వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోసం టోర్నీ చరిత్రలోనే అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆయన కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 103 బిడ్లు దాఖలు చేశాయి. కేకేఆర్, డీసీ, పంజాబ్ పోటీ పడడంతో బిడ్ల సంఖ్య సెంచరీ దాటింది. కాగా మెగా వేలంలో అయ్యర్ను రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
Sorry, no posts matched your criteria.