News November 27, 2024

రైతులను దగా చేసి విజయోత్సవాలా?: హరీశ్‌రావు

image

తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న <<14718777>>రైతు పండుగ<<>> విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా? వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు అమలు చేయనందుకు ఉత్సవాలా? రుణమాఫీ చేస్తానని సగం మందికి మొండిచేయి చూపించారు. ఏడాదిలో రైతులకు రూ.40,800 కోట్లు బాకీ పడ్డారు. ఇవన్నీ చెల్లించి పండుగ చేసుకోవాలి’ అని హితవు పలికారు.

News November 27, 2024

రష్మిక మందన్నకు గాయం!

image

హీరోయిన్ రష్మిక మందన్నకు గాయమైనట్లు తెలుస్తోంది. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక విమానంలో కేరళకు చేరుకున్నారు. కాగా విమానంలో రష్మిక, అల్లు అర్జున్ కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ ఫొటోల్లో రష్మిక చేతికి పట్టీ వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆమెకు గాయం ఎలా అయ్యిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

News November 27, 2024

Nov 30 నుంచి ‘గురుకుల బాట’: BRS

image

TG: నవంబర్ 30-డిసెంబర్ 7 మధ్య రాష్ట్రవ్యాప్తంగా BRS ‘గురుకుల బాట’ నిర్వహించనుంది. విద్యార్థులకు అందించే భోజనాన్ని MLA, MP, MLCలు, పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించనున్నారు. ఇటీవల తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతున్న నేపథ్యంలో BRS ఈ నిర్ణయం తీసుకుంది. RSP ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేసి, నివేదిక అంశాలను సభలో లేవనెత్తనుంది.

News November 27, 2024

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

image

AP: త్వరలో జరిగే సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని CM చంద్రబాబు TDP నేతలకు సూచించారు. MLAలు, MPలు, MLCలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు చేపడితే ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం’ అని చెప్పారు.

News November 27, 2024

ఒక్క ఛార్జ్‌తో 102KM: యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది

image

హోండా కంపెనీ భారత మార్కెట్లో Activa e ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 102KM వెళ్లడం దీని ప్రత్యేకత. స్టైలింగ్ విషయంలో కంపెనీ మినిమలిస్టిక్ అప్రోచ్ పాటించింది. ICE స్కూటర్‌ మోడల్‌నే అనుసరించింది. రెండు 1.5kWh బ్యాటరీలుండే ఈ స్కూటర్లో LED హెడ్‌లైట్‌కే ఇండికేటర్లు ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్ చిన్నగా సీటు పెద్దగా ఉంటాయి. ఇందులో స్టాండర్డ్, స్పోర్ట్, ఈకాన్ వేరియెంట్లు ఉన్నాయి.

News November 27, 2024

HIGH ALERT.. అత్యంత భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి NOV 30 వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

News November 27, 2024

డిసెంబర్ 3న ‘సంక్రాంతికి వస్తున్నాం’ లిరికల్ వీడియో

image

విక్టరీ వెంకటేశ్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ లిరికల్ వీడియోను డిసెంబర్ 3న విడుదల చేస్తామంది. భాస్కరభట్ల రచించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

News November 27, 2024

ఐడియా అదుర్స్: తాగిన మందు బాటిల్ వెనక్కిస్తే రూ.10

image

తమిళనాడులో మద్యం ప్రియులకు పెట్టిన ఓ కండిషన్ మంచి ఫలితాలిస్తోంది. బయట మద్యం తాగి బాటిళ్లు పడేయడంతో చెత్త పేరుకోవడంతో పాటు కొన్నిసార్లు గాయాలూ అవుతాయి. దీంతో బాటిల్ ధరపై షాపులు ₹10 ఎక్కువ తీసుకుని, ఏ వైన్స్‌లో వెనక్కిచ్చినా డబ్బు తిరిగివ్వాలని కోర్టు సూచించింది. దశల వారీగా దీన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు 10 జిల్లాల్లో ఉన్న రిటర్న్ స్కీమ్‌ను సర్కారు త్వరలో రాష్ట్రమంతా విస్తరించనుంది.

News November 27, 2024

కుర్‌కురే తినడంతోనే ఫుడ్ పాయిజన్: ప్రభుత్వం

image

TG: మాగనూర్‌లో గురుకుల విద్యార్థులు <<14722784>>ఫుడ్ పాయిజన్‌<<>> వల్ల అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం హైకోర్టులో వివరణ ఇచ్చింది. ఆ విద్యార్థులు కుర్‌కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు కోర్టుకు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. కాగా కారకులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని మాగనూర్‌‌తో పాటు కరీంనగర్‌, బురుగుపల్లి ఘటనలపై హైకోర్టు ఆదేశాలిచ్చింది.

News November 27, 2024

రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

image

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌ను జనవరి 4న రాజమండ్రిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.