India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు విఘాతం కల్పిస్తే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి’ అని ఆయన ఆదేశించారు.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు దుమ్మురేపుతున్నాయి. US కోర్టు మోపిన అవినీతి, లంచం అభియోగాల్లో తమ ప్రతినిధుల పేర్లు లేవని చెప్పడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. అదానీ టోటల్ గ్యాస్ 19.9, అదానీ పవర్ 17.1, అదానీ ఎనర్జీ 10, అదానీ ఎంటర్ప్రైజెస్ 9.9, అదానీ గ్రీన్ ఎనర్జీ 9.8, అదానీ విల్మార్ 9, NDTV 7.6, అదానీ పోర్ట్స్ 7.2, అంబుజా 4.7, ఏసీసీ 4, సంఘి 3.7% మేర ఎగిశాయి. ఇక అదానీ నెట్వర్త్ $70.8bగా ఉంది.

TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.

AP: అదానీ వ్యవహారంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పీఎం మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని మీడియాతో పవన్ చెప్పారు.

వెన్ అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసి. ఇతని తండ్రి ఆనంద కృష్ణన్ మలేషియాలోని టాప్-3 ధనవంతుల్లో ఒకరు కాగా తల్లిది థాయ్ రాయల్ ఫ్యామిలీ. 18ఏళ్ల వయసులో థాయ్లాండ్ వెళ్లిన సిరిపన్యో సరదాగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆపై దానికే జీవితాన్ని అంకితం చేసి రూ.40వేల కోట్ల వారసత్వ ఆస్తిని త్యజించాడు. అప్పుడప్పుడు కుటుంబాన్నికలిసే సిరిపన్యో పాత జీవితం తాత్కాలికమైందని చెబుతుంటారంట. ఇతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.

TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేస్తామని తెలిపింది. అవసరమైతే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని సర్కార్ యోచిస్తోంది. కాగా, ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ మూడు, నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు.

ICC ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో జైస్వాల్ రెండో స్థానంలో, పంత్ 6, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తొలి స్థానం, అశ్విన్ 4, జడేజా 7వ స్థానం పొందారు. ఆల్ రౌండర్లలో జడేజా తొలి స్థానం, అశ్విన్ 2, అక్షర్ పటేల్ ఏడో స్థానంలో నిలిచారు. ఇటీవల AUSతో తొలి టెస్టులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయగా, బుమ్రా 8 వికెట్లతో రాణించారు.

రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదంది. బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని చెప్పింది. హిందూమతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు SC సర్టిఫికెట్ ఇవ్వాలని TN యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టూ తెలిపింది.

అమెరికా DOJ అభియోగాలను అదానీ గ్రూప్ ఖండిస్తుందని ముందే ఊహించానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘అభియోగాలను అదానీ అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? కచ్చితంగా అలా చేయరు. అసలు పాయింట్ ఏంటంటే మేం చెప్పినట్టుగా ఆయన్ను అరెస్టు చేయడం. చిన్న చిన్న అభియోగాలకే వందలమంది అరెస్టయ్యారు. రూ.వేలకోట్ల వ్యవహారంలో ఆ జెంటిల్మన్ (అదానీ)పై US అభియోగాలు మోపింది. ఆయన జైల్లో ఉండాలి’ అని అన్నారు.

చేతి వేలి గాయంతో BGT తొలి టెస్టుకు దూరమైన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టులోనూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. 10-14 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని అతడికి మెడికల్ స్పెషలిస్ట్ సూచించినట్లు BCCI వర్గాలు తెలిపాయి. రెండో టెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచులో అతను అందుకే ఆడటం లేదని పేర్కొన్నాయి. థంబ్ ఫింగర్ ఇంజూరీ నుంచి కోలుకుని ఆడేందుకు టైమ్ పడుతుందని, మూడో టెస్టులోనూ ఆడేది అనుమానమేనని పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.