India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్టు US డిస్ట్రిక్ట్ కోర్టు తమ ప్రతినిధుల్లో ఎవ్వరిపైనా అభియోగాలు నమోదు చేయలేదని <<14721709>>అదానీ<<>> గ్రూప్ వివరించింది. అజూర్ పవర్, CDPQ ప్రతినిధులైన రంజిత్, సిరిల్, సౌరభ్, , దీపక్, రూపేశ్పై ఆరోపణలు చేసినట్టు తెలిపింది. తమ ప్రతినిధులపై ఎలాంటి ఎవిడెన్సూ DOJ చూపలేదని విమర్శించింది. ఎవరో చెప్పింది విని చర్యలు తీసుకోవడం చట్టపరంగా, నైతికంగా DOJ, SEC దిగజారుడు తత్వానికి నిదర్శనమంది.

అదానీపై US డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. మొత్తం 5 అభియోగాల్లో వారిపై మూడే నమోదయ్యాయని తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర, సెక్యూరిటీ ఫ్రాడ్ ఆరోపణలే ఉన్నాయంది.

10 నిమిషాల్లోపే డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యాపారం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్కార్ట్కు చెందిన మినట్స్, బిగ్ బాస్కెట్, ఫోన్ పేకి చెందిన పిన్కోడ్, జియో మార్ట్ ఉండగా అమెజాన్ కూడా Tez పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్విక్ కామర్స్ వల్ల కిరాణా షాపులకు ముప్పు కలిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాల అంచనా.

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, నెలవారీ డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 80,096 (+90), నిఫ్టీ 24,221 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, IT, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. O&G, FMCG, బ్యాంకింగ్ రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. INDUSIND, BRITANNIA, CIPLA, AIRTEL, ONGC టాప్ లూజర్స్.

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కావాలనే డిమాండ్ పెరుగుతోంది. నిన్న జగన్, మల్లికార్జున ఖర్గే ఈవీఎంలు వద్దని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేయాలని ఖర్గే కోరారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. EVMలతో పేద, బడుగు బలహీన వర్గాల ఓట్లు వృథా అవుతున్నాయని, వాళ్లంతా బ్యాలెట్ పేపర్ పద్ధతే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?

బంగ్లాలోని ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25న ఢాకాలో ‘సనాతన్ జాగరణ్ మంచా’ పేరుతో యువకులు ర్యాలీ చేశారు. అందులో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఉంచారు. తమ దేశ జెండాను అవమానపరిచారంటూ కృష్ణదాస్ సహా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీల హక్కుల కోసం పోరాడే ఓ సంస్థకు చిన్మయ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను OTTకి విక్రయించినట్లు వస్తున్న వార్తలను అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. తమ వివాహ వేడుకను ప్రైవేటుగా నిర్వహించాలని చైతూ-శోభిత నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. డిసెంబర్ 4న జరగనున్న వీరి పెళ్లి ప్రసార హక్కులను నెట్ఫ్లిక్స్కు రూ.50కోట్లకు విక్రయించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ₹1,35,000కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ కోసం తొలి దశలో 2200 ఎకరాలు (ఎకరాకు ₹51.39లక్షలు) కేటాయించింది. దీనితో పాటు LG ఎలక్ట్రానిక్స్(తిరుపతి), ఫిలిప్స్ కార్బన్ బ్లాక్(నాయుడుపేట), ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్(అన్నమయ్య/కడప) కంపెనీలకు భూములు కేటాయించింది.

ఏపీ క్యాడర్కు చెందిన 8 మంది ఐఏఎస్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య రిటైర్ కానున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సీఎస్ నీరబ్ తాజాగా జారీ చేశారు. ఈ లిస్టులో సుమితా దావ్రా, కె.హర్షవర్ధన్(మార్చి 31), కె.విజయానంద్ (నవంబర్ 30), జి.వాణీమోహన్ (ఫిబ్రవరి 28), KRBHN చక్రవర్తి, ఎం.హరి జవహర్ లాల్, ఎస్.సత్యనారాయణ(జూన్ 30), కె.శారదా దేవి (జులై 31) ఉన్నారు.

TG: పారదర్శకంగా కులగణన చేపడుతున్నామని, అది పూర్తికాగానే డేటాను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన దేశానికి దిక్సూచిగా నిలవబోతోందని పొన్నం అన్నారు.
Sorry, no posts matched your criteria.