India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మొత్తం 20 మందిని తీసుకుంది. జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, పాట్ కమిన్స్, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, అభినవ్ మనోహర్, అధర్వ తైడే, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, సమర్జీత్ సింగ్. ఉనద్కత్, కార్స్, అన్సారి, అనికేత్ వర్మ, సచిన్ బేబి.

రిటెన్షన్లు, వేలంలో కలిపి ముంబై ఇండియన్స్ 22 మంది ఆటగాళ్లను తీసుకుంది.
జట్టు: రోహిత్, బుమ్రా, హార్దిక్, బౌల్ట్, తిలక్, సూర్య, దీపక్ చాహర్, నమన్ ధీర్, శాంట్నర్, రాజ్ బవా, పుతుర్, రికెల్టన్, రాబిన్ మింజ్, షిర్జిత్, జాకబ్స్, అశ్వనీ కుమార్, ఘజన్ఫర్, టోప్లే, లిజాడ్, కర్ణ్ శర్మ, పెన్మత్స వెంకటసత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్.

ప్రస్తుతం తాను సింగిల్గానే ఉన్నట్లు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వెల్లడించారు. ప్రియుడు క్రిలి ఆక్సన్ఫాన్స్తో విడిపోయినట్లు చెప్పారు. ‘ఈ రోజుల్లో మనకు సెట్ అవుతాడని అనిపించే వ్యక్తి దొరకడం కష్టమైపోతోంది. అతడితో బ్రేకప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. అలాగని వ్యతిరేకం కాదు. అది భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై డిపెండ్ అయ్యి ఉంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.

IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంలో లక్నో సూపర్జెయింట్స్ 24 మందిని కొనుగోలు చేసింది.
జట్టు: రిషభ్ పంత్, పూరన్, మిల్లర్, బిష్ణోయ్, ఆకాశ్ దీప్, మయాంక్ యాదవ్, మోహ్సిన్, బదోనీ, మార్క్రమ్, మార్ష్, అవేశ్, సమద్, ఆర్యన్ జుయల్, హిమ్మత్, సిద్ధార్థ్, దిగ్వేశ్, షహబాజ్ అహ్మద్, ఆకాశ్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, హంగర్గేకర్, అర్షిన్, బ్రీట్జ్కే.

IPL-2025 మెగా వేలం ముగిసింది. నిన్న, ఈరోజు జరిగిన ఆక్షన్లో ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రూ.వందల కోట్లు చెల్లించి కొనుగోలు చేశాయి. అత్యధికంగా రిషభ్ పంత్ను లక్నో రూ.27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. IPL చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. IPL-2025 సీజన్ వచ్చే ఏడాది మార్చి 14న ప్రారంభం కానుంది.

IPL-2025 వేలంలో అన్సోల్డ్గా మిగిలిన సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ను నిర్వాహకులు మరోసారి వేలంలోకి తెచ్చారు. ఈసారి అతడిని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలోనూ అర్జున్ను MI దక్కించుకుంది. లిజాద్ విలియమ్స్ను కూడా MI రూ.75లక్షలకు సొంతం చేసుకుంది.

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిద్ర పట్టిందా? అని అడుగుతారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? తెలియని పరిసరాలలో నిద్రిస్తున్నప్పుడు, మనిషి మెదడులో సగం మాత్రమే విశ్రాంతి పొందుతుందని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ‘కుడివైపు కంటే ఎడమవైపు ఎక్కువ మేల్కొని ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త ప్రదేశంలో నిద్రించిన తర్వాత కొందరు అలసిపోతారు. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు’ అని పరిశోధకులు తెలిపారు.

ఐపీఎల్ రిటెన్షన్స్, మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ 21 మందిని కొనుగోలు చేసింది. జట్టు: రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్, హర్షిత్ రాణా, రహానే, రమణ్దీప్, వెంకటేశ్ అయ్యర్, డికాక్, గుర్బాజ్, నోకియా, పావెల్, మనీశ్ పాండే, స్పెన్సర్ జాన్సెన్, సిసోడియా, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, లవ్నిత్, రఘువంశీ, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.

IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి పంజాబ్ కింగ్స్ 25 మందిని కొనుగోలు చేసింది. ఐదుగురు ఆసీస్ ప్లేయర్లను తీసుకుంది. జట్టు: శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, ఇంగ్లిస్, హార్డీ, బార్ట్లెట్, అర్ష్దీప్, ప్రభ్ సిమ్రన్, వినోద్, వైశాఖ్, వధేరా, యశ్ ఠాకూర్, బ్రార్, హర్నూర్, షెడ్గే, పైలా, చాహల్, ముషీర్ ఖాన్, ప్రియాన్ష్ ఆర్య, ఫెర్గుసన్, జాన్సెన్, సేన్, ప్రవీణ్ దూబే, ఒమర్జాయ్.
Sorry, no posts matched your criteria.