India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను ఆర్జించినా Day Highని అధిగమించలేదు. సెన్సెక్స్లో 80,470 వద్ద, నిఫ్టీలో 24,350 వద్ద ఉన్న Strong Resistance వల్ల సూచీలు Consolidation Zoneలోనే పయనించాయి. ఉదయం 2 సూచీల్లో Pre-Open Marketలో భారీగా బిజినెస్ జరిగింది. ఆ లాభాలు మినహా ఈరోజు ప్రత్యేకించి సూచీలు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. ఉదయం ట్రేడింగ్ Open అయిన స్థాయిలోనే చివరికి Close అయ్యాయి.

SRH స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. మరో పేసర్ జయదేవ్ ఉనద్కత్ను SRH రూ.కోటి చెల్లించి సొంతం చేసుకుంది. ఇషాంత్ శర్మను గుజరాత్ రూ.75లక్షలకు, నువాన్ తుషారాను బెంగళూరు రూ.1.6 కోట్లకు కొన్నాయి. ఇక ఉమేశ్ యాదవ్, నవీన్ ఉల్ హక్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్సోల్డ్ అయ్యారు.

లెబనాన్లో తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడనుంది. ఈ ఒప్పందం మేరకు హెజ్బొల్లా తన బలగాలను లిటాని నదికి ఉత్తరంగా తరలించాలి. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జరుగుతాయి. ఈ ఒప్పందం అమలును అమెరికా పర్యవేక్షిస్తుంది.

మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఈ రాత్రికి క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో ఏక్నాథ్ శిండే, అజిత్ పవార్ కూడా వెళ్లనున్నారు. వీరు ముగ్గురు బీజేపీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అందులో సీఎం క్యాండిడేట్ను నిర్ణయించనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

AP: CM చంద్రబాబుకు PCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం APకి పెనుభారమని లేఖలో ఆమె పేర్కొన్నారు. అక్రమ డీల్ వల్ల పాతికేళ్ల పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి అనుమతులు ఎందుకు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరగాలని, ఈ ఒప్పందాలపై CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.

ఐపీఎల్ మెగా వేలంలో ఏపీలోని గుంటూరు జిల్లా క్రికెటర్ షేక్ రషీద్ను చెన్నై కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్కే అతడిని దక్కించుకుంది. మరో తెలుగు ఆటగాడు అవనీశ్ ఆరవెల్లి అన్సోల్డ్గా మిగిలారు. ఆయనను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అన్షుల్ కాంభోజ్ను సీఎస్కే రూ.3.40 కోట్లకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్ మెగా వేలంలో విదేశీ ప్లేయర్లు బెన్ డకెట్, డెవాల్డ్ బ్రెవిస్, మొయిన్ అలీ, ఫిన్ అలెన్ అన్సోల్డ్గా మిగిలారు. విల్ జాక్స్ను ముంబై ఇండియన్స్ రూ.5.25 కోట్లు చెల్లించి కైవసం చేసుకుంది. టిమ్ డేవిడ్ను ఆర్సీబీ రూ.3 కోట్లతో సొంతం చేసుకుంది. షాబాజ్ అహ్మద్ను రూ.2.40 కోట్లకు LSG దక్కించుకుంది. దీపక్ హుడాను రూ.1.70 కోట్లు చెల్లించి సీఎస్కే తీసుకుంది.

చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీలో పనిచేసే జాంగ్ అనే ఉద్యోగి ఆఫీసులో పడుకున్నాడని యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించారు. అతను 20 ఏళ్లుగా మంచి పనితీరు కనబరిచారని, ముందు రోజు ఆఫీసులో లేట్ అవడంతో పడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈక్రమంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు జాంగ్కు కంపెనీ 3,50,000 యువాన్లు(రూ.40.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

UPI నగదు చెల్లింపుల్లో 2024-25 FYలో ₹485 Cr విలువైన 6.32 లక్షల మోసాలు జరిగినట్టు కేంద్రం తెలిపింది. గత FYలో ₹1,087 కోట్ల విలువైన 13.42 లక్షల మోసాలు జరిగినట్టు వెల్లడించింది. మోసాల కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. యూపీఐ, ఇతర ఆన్లైన్ చెల్లింపుల్లో మీకు మోసాలు ఎదురైతే 1930కు ఫోన్ చేయండి, లేదా <

ఏజెన్సీల్లో డోలీ మోతలకు చెక్ పెట్టేలా AP ప్రభుత్వం రంగంలోకి దిగింది. మన్యం(D) సాలూరు(మ) కరడవలసలో తొలి కంటైనర్ ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజన, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చామన్నారు. ఆశా కార్యకర్త, బీపీ, షుగర్ సహా 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. చిన్నారులకు టీకాలు, పలు మెడికల్ టెస్టులు చేయించుకునే సౌకర్యం ఇక్కడ ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.