News August 27, 2024

పుణే హెలికాఫ్టర్ ప్రమాదంపై విచారణ: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: గత శనివారం పుణేలో హెలికాప్టర్ కుప్పకూలిన <<13948573>>ఘటనపై<<>> పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే ఆ ఘటనపై మాట్లాడతానని చెప్పారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలపై పౌర విమానయాన శాఖలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 16 ఏళ్ల నాటిదని, దానిని ఏపీ సీఎం చంద్రబాబు కోసం కేటాయించిందేనని తేలిన సంగతి తెలిసిందే.

News August 27, 2024

పాకిస్థాన్‌లో ఆడాలని ఉంది: కుల్దీప్ యాదవ్

image

BCCI అనుమతిస్తే పాకిస్థాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. ‘మేం క్రికెటర్లం కాబట్టి ఏ దేశానికి పంపినా అక్కడ ఆట ఆడతాం. ఇంతకుముందెన్నడూ నేను పాక్‌కు వెళ్లలేదు. అందుకే ఈ టూర్‌ కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అవకాశమిస్తే పాక్ వెళ్లి ఆడుతాం’ అని ఆయన వెల్లడించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేదిలేదని BCCI ఇప్పటికే తేల్చిచెప్పింది.

News August 27, 2024

మా పార్టీ నన్ను పట్టించుకోవటం లేదు: YCP నేత బాలినేని

image

AP: EVMలపై పోరాటానికి తమ పార్టీ తనను పట్టించుకోవడం లేదని YCP నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకే తాను పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు. ‘EVMలపై న్యాయపోరాటం గురించి పార్టీ పెద్దలకు చెబుదామన్నా వారు వినే పరిస్థితిలో లేరు. అయినా నేను పోరాటంలో వెనక్కు తగ్గను. నేను జనసేనలో చేరుతానన్న వార్తలు అవాస్తవం. అసలు ఆ పార్టీలో చేరకుండా ఉండేందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News August 27, 2024

రాత్రి 7 గంటలకు జైలు నుంచి కవిత విడుదల

image

సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత రిలీజ్ ఆర్డర్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో ఆమె భర్త అనిల్, ఎంపీ రవిచంద్ర షూరిటీ పత్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు జైలు నుంచి కవిత విడుదల కానున్నారు.

News August 27, 2024

రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన

image

TG: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

News August 27, 2024

రేపు బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు

image

BJP రేపు 12 గంట‌ల బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థులు చేప‌ట్టిన న‌బ‌న్నా అభియాన్‌ నిర‌స‌న‌పై పోలీసులు ఉక్కుపాదం మోప‌డాన్ని బీజేపీ ఖండించింది. ర్యాలీ సంద‌ర్భంగా జ‌రిగిన హింసాకాండ‌కు టీఎంసీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి ఆరోపించారు. సీఎం మమత రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 వర‌కు బంద్ కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

News August 27, 2024

BREAKING: జన్వాడ ఫామ్‌హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు

image

TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ఫామ్‌హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. అక్కడ కొలతలు వేస్తూ పరిశీలిస్తున్నారు. కాగా, చెరువు FTLలో దాన్ని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫామ్‌హౌస్ తనది కాదని, లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అధికారులు అక్కడికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

News August 27, 2024

29 మంది పేర్లతో బీజేపీ మూడో జాబితా

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 29 మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలకు 10 మంది అభ్యర్థులను, అక్టోబర్ 1న జరగనున్న మూడో విడత ఎన్నికల్లో పోటీ చేసే 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటిదాకా BJP మూడు జాబితాల ద్వారా 45 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. పదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BJP 25 స్థానాల్లో గెలిచింది.

News August 27, 2024

ట్రైనీ నర్సుపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

ట్రైనీ నర్సుపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నిన్న రాత్రి జరిగింది. ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆమె మధ్యలో డ్రైవర్ ఇచ్చిన మంచినీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడని తెలిసింది. స్పృహ వచ్చాక బాధితురాలు విషయం చెప్పడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు CCTV ఫుటేజీ సేకరించి FIR నమోదు చేశారు.

News August 27, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ‌త సెష‌న్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు న‌ష్టాల బాట‌ప‌ట్ట‌డంతో దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 25,017 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సెన్సెక్స్ 13 పాయింట్లు లాభ‌ప‌డి 81,711 వ‌ద్ద నిలిచింది. సోమవారం నిఫ్టీ చేరుకున్న25,000 పాయింట్ల మార్క్‌ను ఈ రోజు కూడా నిలుపుకోవ‌డం గ‌మ‌నార్హం.