News August 27, 2024

సుప్రీంలో వాడీవేడి వాదనలు

image

లిక్కర్ స్కాం కేసులో ED నోటీస్ రాగానే కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సుప్రీంకోర్టులో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనివారికి ఇచ్చారన్నారు. దీనికి కవిత తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తుంటారని సమాధానమిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కలగజేసుకున్న న్యాయస్థానం ప్రతిరోజూ ఫోన్లు మారుస్తారా? అని ప్రశ్నించింది.

News August 27, 2024

IPL: LSG కెప్టెన్‌గా నికోలస్ పూరన్?

image

తమ జట్టు కెప్టెన్‌గా హిట్టర్ నికోలస్ పూరన్‌ను LSG నియమించనున్నట్లు సమాచారం. అతడితోపాటు కృనాల్ పాండ్య పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే సీజన్ కోసం KL రాహుల్‌ను రిటైన్ చేసుకోవాలని LSG నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News August 27, 2024

రుషికొండ భవనాలపై త్వరలో సీఎం నిర్ణయం: మంత్రి నారాయణ

image

AP: ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన ఉండదని, అదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో డంపింగ్ యార్డును పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. వచ్చే నెల నాటికి TDR కుంభకోణాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను ఏం చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

News August 27, 2024

కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది: రోహత్గీ

image

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ‘ఈడీ కేసులో ఆమె 5 నెలలుగా జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ.100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమే. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరినీ బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది’ అని వాదించారు.

News August 27, 2024

WBBLలోకి మరో 18 మంది భారత ప్లేయర్లు!

image

వుమెన్స్ బిగ్ బాష్ లీగ్‌-10 డ్రాఫ్ట్స్‌లో 18 మంది భారత మహిళా క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. స్మృతి మంధాన ఇప్పటికే అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. స్మృతితోపాటు హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శ్రేయాంకా పాటిల్, టిటాస్, ఆషా, రాధా, అమన్‌జోత్, యాస్తికా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత, సజన, కశ్యప్, మేఘన, వేద, మోనా, మేఘ్న సింగ్ ఉన్నారు. వచ్చే నెల 1న వేలం జరగనుంది.

News August 27, 2024

భారత్‌పై యాపిల్ ఫోకస్.. 6 లక్షల ఉద్యోగాలకు ఛాన్స్

image

చైనాను వదిలి భారత్‌పై యాపిల్ ఫోకస్ చేసింది. ఫాక్స్‌కాన్‌తో కలిసి కొత్త ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. దీంతో 6 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. ఈ FY చివరికి 2 లక్షల డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయని, ఇందులో 70% మహిళలే ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం తమిళనాడు ప్లాంట్‌లో సిబ్బందికి ఐఫోన్ 16 ప్రొ, ప్రొ మాక్స్ వెర్షన్ల తయారీపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది.

News August 27, 2024

తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులు ఏంటి?: కేటీఆర్

image

TG: కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై KTR మండిపడ్డారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా? ఏం జరుగుతుందో మీకైనా తెలుసా CS గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులు ఏంటి? ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒక వేళ ఆమోదించకపోతే దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని Xలో డిమాండ్ చేశారు.

News August 27, 2024

హైడ్రా కూల్చివేతలపై బీజేపీలో అయోమయం

image

TG: హైడ్రా కూల్చివేతలపై BJP నాయకులు తలో మాట మాట్లాడుతున్నారు. ‘కూల్చివేతలతో సామాన్యులను CM రేవంత్ భయపెడుతున్నారు. నీ అయ్య జాగీరా కూల్చడానికి’ అని ఈటల వ్యాఖ్యానించారు. ‘కూల్చివేతలకు ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించండి’ అంటూ రఘునందన్ రావు అన్నారు. ‘పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ము రేవంత్‌కు ఉందా’ అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

News August 27, 2024

దేవర నుంచి Mr.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్

image

కొరటాల శివ డైరెక్షన్‌లో Mr.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన దేవర మూవీ సరిగ్గా నెల రోజుల్లో(సెప్టెంబర్ 27) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో యంగ్ టైగర్ రెండు రకాల లుక్‌తో కనిపించారు. దీంతో ఆయన సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News August 27, 2024

Stock Market: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు

image

స్టాక్ మార్కెట్లు స్తబ్ధుగా మొదలయ్యాయి. సూచీలు మళ్లీ గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 81,815 వద్ద మొదలైన BSE సెన్సెక్స్105 పాయింట్ల లాభంతో 81,803 వద్ద కొనసాగుతోంది. NSE నిఫ్టీ 24 పాయింట్లు ఎగిసి 25,034 వద్ద చలిస్తోంది. ఎల్‌టీ, సిప్లా, ఇన్ఫీ, HCL టెక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్. BPCL, JSW స్టీల్, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్ టాప్ లూజర్స్.