News August 25, 2024

ఆ డేటా కోసం ఎదురుచూస్తున్న సీబీఐ

image

కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో ఫోరెన్సిక్ నివేదిక‌ల కోసం CBI ఎదురుచూస్తోంది. డిజిట‌ల్ సాక్ష్యాలు, ప్ర‌ధాన నిందితుడి లోదుస్తులు ఈ కేసులో కీల‌కంగా ఉన్నాయి. వీటిపై ఫోరెన్సిక్ నివేదిక‌లు రావాల్సి ఉంది. ఆగస్టు 9న రాత్రి నిందితుడు ఏ సెల్ ట‌వ‌ర్ ప‌రిధిలో ఉన్నాడు, అతని మొబైల్ ఫోన్‌లోని డేటా, ఆసుపత్రిలోని 2 CCTVల ఫుటేజీ సహా నేర స్థలంలో సేకరించిన 40 ఎగ్జిబిట్స్‌ని CBI సాక్ష్యాలుగా పరిగణిస్తోంది.

News August 25, 2024

మీ లెగసీ కొనసాగుతుంది గబ్బర్: కోహ్లీ

image

శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘అరంగేట్రం నుంచి బెస్ట్ ఓపెనర్‌గా మారేవరకు మీరు లెక్కలేనన్ని జ్ఞాపకాలను మాకు అందించారు. ఆట పట్ల మీకున్న అభిరుచి, క్రీడా స్ఫూర్తి, మీ చిరునవ్వును మిస్ అవుతాం. కానీ, మీ లెగసీ కొనసాగుతుంది. ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్ ఫీల్డ్‌లో మీ తదుపరి ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలి గబ్బర్’ అని ట్వీట్ చేశారు.

News August 25, 2024

భార్య విపరీతంగా ఖర్చు చేస్తోందని చంపించాడు!

image

భార్య విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తోందన్న కోపంతో ఆమెను హత్య చేయించాడో భర్త. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని తెలిసిన వాళ్లకు రూ.2.50 లక్షలు సుపారీ ఇచ్చి చంపించాడు. AUG 13న తన భార్య దుర్గావతి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని భర్త హేమంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే CCTV కెమెరాలో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కూపీ లాగి నిందితులను అరెస్టు చేశారు. MPలోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.

News August 25, 2024

పోలీస్ స్టేషన్లు, జైళ్లలో కృష్ణాష్టమి వేడుకలు!

image

రాష్ట్రంలోని జైళ్లు, పోలీస్ స్టేషన్లలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మథుర-బృందావన్‌లో శ్రీకృష్ణుడి జయంతిని రెండు రోజుల పాటు జరుపుకోనుండగా భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. మథురలోని కంసునికి చెందిన కారాగారంలో నల్లనయ్య జన్మించడంతో ఈ ప్రాంతంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

News August 25, 2024

5 కోట్ల మంది ఫొటోలు అప్‌లోడ్ చేశారు.. మన్ కీ బాత్‌లో PM

image

ప్ర‌ధాని మోదీ ఇవాళ త‌న‌ 113వ మన్ కీ బాత్‌లో వివిధ అంశాల‌పై మాట్లాడారు. అంత‌రిక్ష రంగంలో దేశం వేగంగా వృద్ధి చెందుతోందని, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించిన మొద‌టి దేశంగా భార‌త్ నిలిచింద‌న్నారు. త‌న పిలుపు మేర‌కు యువ‌త రాజ‌కీయాల్లో ఉత్సాహంగా పాల్గొంటోందని చెప్పారు. 78వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా ఉద్య‌మంలా సాగింద‌ని, 5 కోట్ల మంది తమ ఫొటోలను అప్‌లోడ్ చేశారన్నారు.

News August 25, 2024

312 ప్రభుత్వ ఉద్యోగాలు.. APPLY చేసుకోండి!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆగస్టు 26 రాత్రి 11 గంటల్లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వయసు 18-30 ఏళ్లు. పే స్కేల్ రూ.35,400-రూ.1,12,400గా ఉంది. మొత్తం 312 జూనియర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులున్నాయి. ఇంగ్లిష్, హిందీలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. <>సైట్<<>>: https://ssc.gov.in/

News August 25, 2024

అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు: హరీశ్

image

TG: హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్ని అనుమతులు తీసుకునే కాలేజీలు నిర్మించారని స్పష్టం చేశారు. పల్లాపై రాజకీయ కుట్రతోనే 6 కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. హైడ్రాకు తాను వ్యతిరేకం కాదని, నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు.

News August 25, 2024

బిగ్‌బాస్ నుంచి నాగార్జునను తప్పించాలని డిమాండ్

image

చెరువును ఆక్రమించి <<13929013>>N-కన్వెన్షన్<<>> నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు. ‘అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలి’ అని FBలో పోస్ట్ చేశారు. బాబు గతంలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

News August 25, 2024

పాకిస్థాన్‌లో ‘కల్కి’ ట్రెండింగ్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. వీకెండ్ కావడంతో ‘కల్కి’ని టీవీల్లో చూసేందుకు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో టాప్-3లో ట్రెండ్ అవుతోంది. అయితే, పాకిస్థాన్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం నంబర్1లో ట్రెండ్ అవుతుండగా ఖతర్‌లో మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.

News August 25, 2024

ఇక AUS ఉద్యోగులకు పండగే.. రేపటి నుంచే అమలు!

image

ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు పని వేళలు పూర్తయ్యాక కూడా బాసుల ఒత్తిడితో వర్క్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో భాగంగా తీసుకొచ్చిన ‘రైట్ టు డిస్కనెక్ట్’ చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది. పని గంటలు పూర్తయ్యాక ఉద్యోగులు వారి బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించవచ్చు.