India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెర్త్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న BGT తొలి టెస్టుకు తొలి రోజు 31,302 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఒక్క రోజులో ఇంత మంది అక్కడ మ్యాచ్ను చూడటం ఇదే తొలిసారి. దీంతో పెర్త్లో సింగిల్ డేలో అత్యధిక మంది చూసిన మ్యాచ్గా ఇది రికార్డు సృష్టించింది. నేడు, రేపు మ్యాచ్ మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈ టెస్టులోనే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. MHలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలూ నేడే రానున్నాయి. వయనాడ్ లోక్ సభ స్థానంలో నిలిచిన ప్రియాంక గాంధీ భవితవ్యం ఈరోజే తేలనుంది. ఉ.8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.

TG: ఈనెల 30న మహబూబ్నగర్లో రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో భారీ కార్నివాల్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.

ఎయిర్లైన్ ప్యాసింజర్ల కోసం DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైనప్పుడు వారికి ఎయిర్లైన్ సంస్థలు త్రాగు నీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలు ఆలస్యమైతే వాటర్, 2-4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ, స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగ మంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే.

దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మించడం కుదరదు. పైగా ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగిపడతాయి. రాష్ట్రంలో ఎన్ని టూరిజం స్పాట్లు ఉన్నా రైల్వే సౌకర్యం లేక ఆదరణ తగ్గుతోంది. ఇటీవలే రంగ్పో రైల్వే స్టేషన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు <<14674232>>బాసిస్ట్ మోహిని<<>> వెల్లడించారు. దీంతో ఇద్దరికీ మధ్య ఏదో ఉందంటూ వార్తలు హల్చల్ చేశాయి. వాటిపై మోహిని తన ఇన్స్టాలో పరోక్షంగా స్పందించారు. ‘ఇంటర్వ్యూ కావాలంటూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందుకో నాకు తెలుసు. ఈ చెత్తకు ప్రచారమివ్వాలన్న ఆసక్తి ఏమాత్రం లేదు. నా శక్తిని రూమర్స్పై పెట్టదలచుకోలేదు’ అని స్పష్టం చేశారు.

ఆన్లైన్ మోటార్ బీమాలో మారుతీ, హ్యుందాయ్ సంస్థలు దూసుకెళ్తున్నాయని పాలసీబజార్ నివేదిక తాజాగా వెల్లడించింది. వాగన్ఆర్(5.9శాతం), స్విఫ్ట్(5.9), ఐ20(4.4), బలేనో(4.3), ఆల్టో(4.2శాతం) మార్కెట్లో మంచి వాటా దక్కించుకున్నాయని పేర్కొంది. ఇక EVల ఆన్లైన్ ఇన్సూరెన్స్లో 2022లో 423శాతం, గత ఏడాది 399శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. బీమా కొనుగోలుదారుల్లో అత్యధికులు 25 నుంచి 40 ఏళ్ల మధ్యవారేనని వివరించింది.

టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి చేరింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా పంత్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 2,032 పరుగులు చేశారు. 52 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకోవడం విశేషం. తొలి రెండు స్థానాల్లో రోహిత్ (2,685), కోహ్లీ (2,432) ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ వికెట్ కీపర్గానూ పంత్ (661) రికార్డులకెక్కారు.

అత్యంత అభివృద్ధి చెందిన గ్రహాంతరవాసులు విశ్వాన్ని అన్వేషించేందుకు వేగంగా కదిలే చిన్న నక్షత్రాలను వాహనాలుగా వాడుకుంటూ ఉండొచ్చని బెల్జియం పరిశోధకులు తాజాగా ప్రతిపాదించారు. వ్యోమనౌకను తయారుచేయడం కంటే నక్షత్రాల అయస్కాంత శక్తినే ఇంధనంగా వాడుకుంటూ వాటిపై ప్రయాణించడం వారికి సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ థియరీని పలువురు శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తుండటం గమనార్హం.
Sorry, no posts matched your criteria.