India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బౌన్సర్ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.

TG: దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు HYDలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయని ప్రభుత్వం తెలిపింది. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్యరహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొంది. 6 కంపెనీలు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని, వీటి ద్వారా 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది.

ఆప్ ప్రభుత్వంతో నిత్యం తగువుకు దిగే LG సక్సేనా మొదటి సారి CM ఆతిశీని ప్రశంసించారు. IGDT మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘లింగ భేదాన్ని నిలువరించి ఇతరులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి. ఈ రోజు ఢిల్లీ సీఎం మహిళ అయినందుకు సంతోషిస్తున్నా. గత పాలకుడి(కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు నయం’ అన్నారు. LG వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

భోజనం వేగంగా తినడం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు. తినే ఆహారం మాత్రమే కాదు, తినే విధానమూ ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. నిదానంగా భోజనం చేసే వారిలో డయాబెటిస్, PCOD, హై బీపీ వంటి సమస్యలు తక్కువని వివరిస్తున్నారు. తొందరగా తినే అలవాటు వల్ల జీర్ణకోశ సమస్యలు, అధిక బరువు, మెటబాలిజం సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి Relax and Eat. SHARE IT.

ఇప్పుడంటే ఆయుధాల కోసం అమెరికా వద్ద చేయి చాస్తోంది కానీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కొత్తలో ఉక్రెయిన్ వద్ద ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయుధ నిల్వలు ఉండేవి. 5వేలకు పైగా అణ్వాయుధాలు, 170కి పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వార్ హెడ్స్ వంటి వాటినన్నింటినీ 1996కల్లా రష్యాకు ఇచ్చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరి, అందుకు బదులుగా స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు తెచ్చుకుంది.

TG: హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నానని ఆయన చెప్పారు. ‘అనుమతులు లేకుంటే పెద్దలవా, పేదలవా అని ఆలోచించం.. కూల్చడమే. ఇకపై కబ్జాలు జరగకుండా చూస్తాం. హైడ్రా పనితీరు వల్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. వారే చెరువులు, నాలాల కబ్జాలను అడ్డుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

భారత విదేశీ మారక నిల్వలు గత వారంలో ఏకంగా $17.8 బిలియన్ మేర పతనమయ్యాయి. ఈ భారీ తగ్గుదల నేపథ్యంలో నిల్వలు $657.89 బిలియన్లకు చేరుకుని నాలుగు నెలల కనిష్ఠ స్థాయిని తాకాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డాలర్ విలువ క్రమంగా పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువను బలపరిచేందుకు ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ తన నిల్వలను అమ్మకాలకు ఉంచడం ఈ పరిస్థితికి కారణమైంది.

ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ట్విటర్ ఖాతా ‘ఆసీస్ ఆర్మీ’ అత్యుత్సాహం చూపించింది. భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటయ్యాక పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న అర్థం వచ్చేలా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మరింత ఘోరంగా 67 రన్స్కే 7 వికెట్లు కోల్పోయాక లెంపలేసుకుంది. భారత బౌలర్లు చాలా టాలెంటెడ్ అంటూ కొనియాడింది. ఇంకెప్పుడూ మా టీమ్ను తక్కువ అంచనా వేయొద్దంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఆసీస్ను ట్రోల్ చేస్తున్నారు.

హరియాణాలో విజయ్ అనే డాక్టర్ పట్టా అందుకోకుండానే 44 కంటి ఆపరేషన్లు చేశారు. ఏడాదికి 1000 కంటి ఆపరేషన్లు చేసే హిసార్ సివిల్ హాస్పిటల్లో వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో సర్జన్ల కొరత పూడ్చేందుకు PG పూర్తి కాకుండానే విజయ్ని హెల్త్ డిపార్ట్మెంట్ ఆ హాస్పిటల్లో హడావుడిగా నియమించింది. విషయం తెలుసుకున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అతడిని విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్రలో రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహరచనకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా ముగ్గురు పరిశీలకుల్ని నియమించింది. మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, కర్ణాటక మంత్రి పరమేశ్వర్లను ముంబై పంపింది. హంగ్ వస్తే ఏం చేయాలి? ఎంవీఏ గెలిస్తే ఎలా ముందుకెళ్లాలనే బాధ్యతలను వీరికి అప్పగించింది.
Sorry, no posts matched your criteria.