India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హర్దీప్నిజ్జర్ హత్య, ఇతర నేరాలతో PM మోదీకి సంబంధం లేదని కెనడా స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ధ్రువీకరించే ఆధారాలేమీ లేవని వెల్లడించింది. గ్లోబ్, మెయిల్ న్యూస్పేపర్లలో కథనాలు వదంతులేనని తెలిపింది. అమిత్ షా, జైశంకర్, అజిత్ దోవల్, మోదీకి నిజ్జర్ హత్యకు సంబంధం ఉన్నట్టు ఈ పత్రికలు చిత్రీకరించాయి. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దౌత్యసంబంధాలు ఇంకా దెబ్బతింటాయని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

TG: ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట బోగస్ అయిందని ఖమ్మం పత్తి మార్కెట్లో ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధర లేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.

అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం సింపుల్గా జరుగుతుందని నాగార్జున తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 4న HYDలోని అన్నపూర్ణస్టూడియోస్లో జరగనుంది. అయితే ఇందుకు 300-400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామన్నారు. వారిద్దరూ సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతో ఏర్పాట్లను కూడా వాళ్లకే వదిలేశానన్నారు.

మణిపుర్ పరిస్థితిని కాంగ్రెస్ సెన్సేషనల్ చేయడానికి పదేపదే ప్రయత్నించడం షాకింగ్గా ఉందని BJP చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ రాయడంపై మండిపడ్డారు. ‘విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసల్ని చట్టబద్ధం చేసింది, వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నదే అప్పటి HM, మీ చిదంబరం అని మర్చిపోయారేమో. దేశాన్ని అస్థిరపరిచే విదేశీ శక్తులకు మీరు వత్తాసు పలకడం ఆందోళనకరం’ అని అన్నారు.

AP: అసెంబ్లీలో PAC, PUC, అంచనాల కమిటీల్లో సభ్యుల ఎన్నిక కొనసాగుతోంది. MLAలు బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు నమోదు చేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు కమిటీ హాలులో జరగనున్న ఈ ఎన్నిక ప్రక్రియ బాధ్యతను విప్లకు అప్పగించారు. పబ్లిక్ అకౌంట్స్(PAC) కమిటీని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. PACలో సభ్యుడు కావాలంటే కనీసం 18 ఓట్లు కావాల్సి ఉండగా, YCPకి 11ఓట్లే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

భారత్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫస్ట్ డే తొలి సెషన్లో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బ్యాటర్లు ఆసీస్ బౌలింగ్కు బెంబేలెత్తారు. కనీసం బాల్ను టచ్ చేయడానికే కష్టపడ్డారు. దీంతో జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు. కోహ్లీ 5 రన్స్తో నిరాశపరిచారు. రాహుల్ కాస్త మెరుగ్గా ఆడినా చివరికి 26 రన్స్ వద్ద వెనుదిరిగారు. దీంతో ఫస్ట్ సెషన్ ముగిసేసరికి IND 51రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడమే ఇందుకు కారణం. నిఫ్టీ 23,458 (+107), సెన్సెక్స్ 77,548 (+390) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభ లాభాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. రియాల్టి, PSU బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి. ADANIENT, ADANI PORTS, M&M, AXIS BANK, HEROMOTO టాప్ లూజర్స్.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.

కూటమి నేతలు అధికారమదం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని YCP ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనమండలిలో గురువారం మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన ఓ సామెతపై ఆ పార్టీ ‘X’ వేదికగా మండిపడింది. మొన్నటి వరకూ తిరుమల లడ్డూపై ప్రచారం చేసి, ఇప్పుడు హజ్ యాత్రపై వెటకారమా? అని ప్రశ్నించింది. అటు, తన మాటలు ఏ కులాన్నీ, మతాన్నీ అవమానపరిచేలా లేవన్న మంత్రి ఒకవేళ ఉన్నట్లు భావిస్తే వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.

బిట్కాయిన్ మరో రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి $99000 మైలురాయిని టచ్ చేసింది. శుక్రవారం సింగపూర్లో $99388 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం $98660 స్థాయిలో చలిస్తోంది. US కొత్త ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన NOV 5 నుంచి బిట్కాయిన్ మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్ల మేర పెరగడం గమనార్హం. అనేక సంస్థలు BTC ETFs, OPTIONS ప్రవేశపెడుతుండటంతో డిమాండ్ ఎగిసింది.
Sorry, no posts matched your criteria.