India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తిథి: బహుళ చవితి ఉ.08.16 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.03 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.07.30-ఉ.09.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24
✒ వర్జ్యం: రా.12.21-రా.1.51
✒ అమృత ఘడియలు: ఉ.8.28-ఉ.10.00
* అతిభారీ వర్షాలు.. సెలవులు రద్దు: రేవంత్
*TG: 5 జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు
* అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు
* ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్
* పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను రద్దు చేయాలి: జగన్
* తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు
* తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
* ఏపీలో వార్ 2, కూలీ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు
TG: భారీ వర్ష సూచన దృష్ట్యా విద్యాశాఖ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రేపు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించింది.
AP: ఒంగోలు తాలూకా పీఎస్లో రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. ఫొటోల మార్ఫింగ్ కేసులో దాదాపు 11 గం.పాటు RGVని పోలీసులు విచారించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆయన ‘X’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రూ.2 కోట్లు అందడంపై కూడా విచారించినట్లు సమాచారం.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో భాగంగా రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో రైనాను విచారించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది.
అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ముప్పేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వెన్ను నొప్పి, తల నొప్పితోపాటు డిప్రెషన్కు కూడా గురవుతారు. రాత్రి పూట ఎక్కువగా భోజనం చేయకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవచ్చు’ అని చెబుతున్నారు.
‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు <<17383707>>పెంచుతూ<<>> AP ప్రభుత్వం జీవో ఇవ్వడంపై హీరో జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈ జీవో ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తారక్ ట్వీట్ చేశారు.
భారత్-చైనా మధ్య సర్వీసులను పున:ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఎయిర్లైన్స్ సంస్థలకు కేంద్రం సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. SCO సమ్మిట్లో పాల్గొనేందుకు PM మోదీ ఈనెల 31న చైనా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. కరోనా సమయం నుంచి ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య మైత్రి చిగురిస్తుండటంతో రాకపోకలు రిస్టోర్ కానున్నట్లు సమాచారం.
APలో రేపటి నుంచి 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు ప.గో, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, ఎల్లుండి కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండవద్దని సూచించారు.
AP ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు అందించింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ రూల్-2024కు సవరణ చేసింది. పర్మిట్ రూమ్లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 2.77 లక్షల మంది పట్టుబడినట్లు పేర్కొంది. పొలాలు, పార్కులు, రోడ్ల పక్కన మద్యం సేవించడాన్ని తగ్గించేలా లైసెన్స్తో కూడిన పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతించినట్లు వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.