News August 23, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: ఎయిడెడ్ స్కూళ్లలో నిర్వహిస్తున్న అన్‌ఎయిడెడ్ సెక్షన్ల వివరాలు సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. పలు ఎయిడెడ్ స్కూళ్లు సమాంతరంగా అన్ ఎయిడెడ్ సెక్షన్లు నిర్వహిస్తున్నాయి. ఎయిడెడ్‌లో పిల్లలు తక్కువగా ఉండటంతో ఇక్కడి టీచర్లను ప్రైవేట్ సెక్షన్లకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పిల్లల్ని అన్‌ఎయిడెడ్‌లో ఎక్కువగా చేర్చుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.

News August 23, 2024

ఐఫోన్ 16 సిరీస్ ధ‌ర‌లివే?

image

ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర (128GB) రూ.67,100, *16 ప్లస్ రూ.75,500, *16 ప్రో మోడల్ ధర (256GB) రూ.92,300, *16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,00,700గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, 16 ప్లస్ మోడల్స్ యాపిల్ A18 చిప్ సెట్‌తో రానున్నట్లు వివరాలు లీక్ అయ్యాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌తో, ఐఫోన్15 సిరీస్‌తో పోల్చితే ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ 0.2 అంగుళాలు పెద్ద‌గా ఉండనుంది. ఈ సిరీస్ వచ్చేనెల విడుదలయ్యే అవకాశం ఉంది.

News August 23, 2024

ఏపీలో పెట్టుబడులకు ఆరియా గ్లోబల్ ఆసక్తి

image

APలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు స్పెయిన్‌కు చెందిన ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తిగా ఉంది. రూ.300 కోట్ల పెట్టుబడితో లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే బోట్లను ఇండియన్ నేవీకి సరఫరా చేస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో బయో సింథటిక్ వుడ్‌ను తయారు చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

News August 23, 2024

ఖాళీ అపార్ట్‌మెంట్లు, స్థలాల వేలానికి ప్రభుత్వం కసరత్తు!

image

TG: ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లు, స్థలాలను వేలం వేస్తే ₹1,900కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల ద్వారా మరో ₹1,500కోట్లు వస్తాయని, వీటిని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 9 జిల్లాల్లోని 1,342 ప్లాట్లు, పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్, ఖమ్మంలో టవర్లు, బండ్లగూడ, పోచారంలో ఫ్లాట్ల వేలానికి కసరత్తు చేస్తోంది.

News August 23, 2024

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆ మెసేజ్‌లపై నిషేధం

image

SEP 1 నుంచి వినియోగదారులకు APK ఫైల్స్, URL, OTT లింక్‌లు, బ్లాక్ లిస్టులో ఉన్న కాల్‌బ్యాక్ నంబర్లతో కూడిన మెసేజ్‌లు పంపరాదని టెలికం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. మోసగాళ్ల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించడం కోసమే ఈ ఆదేశాలు జారీ చేశామంది. అటు SEP 30 నుంచి టెలీ మార్కెటింగ్ నంబర్లు విధిగా ’30 140’తో ప్రారంభం కావాలన్న TRAI.. వ్యక్తిగత నంబర్లతో ఫోన్ చేస్తే రెండేళ్లు నంబర్ బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.

News August 23, 2024

నామినేటెడ్ పోస్టులపై కూటమి పార్టీల ఏకాభిప్రాయం?

image

AP: నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. టీడీపీకి 60శాతం, జనసేనకు 25శాతం, బీజేపీకి 15శాతం పదవులు ఇచ్చేలా అంగీకారం కుదిరినట్లు ఆ పార్టీల వర్గాలు చెబుతున్నాయి. పదవులు ఎవరికి దక్కుతాయన్నదానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అటు ఎన్నికల్లో పొత్తు కోసం సీట్లు త్యాగం చేసిన నేతలు ఆశలు పెట్టుకోవడంతో పదవులు ఎవరిని వరిస్తాయన్న ఆసక్తి నెలకొంది.

News August 23, 2024

అచ్యుతాపురం ప్రమాదంపై NGT సుమోటో విచారణ

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో మొన్న జరిగిన ప్రమాద ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారించనుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడంతో పాటు 60 మందికి పైగా గాయపడినట్లు వచ్చిన వార్తల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, ఎసెన్షియా కంపెనీకి NGT నోటీసులు ఇచ్చింది.

News August 23, 2024

కల్యాణ లక్ష్మి నిధులు విడుదల

image

TG: కల్యాణ లక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,225.43కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.2,175కోట్లు కేటాయించింది. అందులో నుంచి 24,038 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు నిధులు రిలీజ్ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

News August 23, 2024

ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు కీలక భేటీ!

image

TG: కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు CM రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌తో సహా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇవాళ వెళ్లనున్నారు. TPCC చీఫ్, క్యాబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో వీటిపై స్పష్టత రానున్నట్లు సమాచారం. PCC చీఫ్ రేసులో బలరాం నాయక్, మధుయాష్కీ, మహేశ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి.

News August 23, 2024

కాంగ్రెస్ ఆ హామీ ఇస్తుందా..?

image

అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేంద్ర‌పాలిత ప్రాంతం జ‌మ్మూక‌శ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా క‌ల్పిస్తామ‌నే హామీని కాంగ్రెస్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇదే డిమాండ్‌తో ఆ పార్టీతో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్(NC) పొత్తుకు అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌రువాత జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌ద్దాక్‌లను కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా కేంద్రం ఏర్పాటు చేసింది. దీన్ని స్థానికంగా బలమైన NC సహా PDP వ్యతిరేకిస్తున్నాయి.