News January 5, 2026

ఐఐటీ మండీలో 31 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>ఐఐటీ<<>> మండీలో 31 జూనియర్ లాబోరేటరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iitmandi.ac.in.

News January 5, 2026

ఎండోమెట్రియోసిస్‌తో క్యాన్సర్ ముప్పు

image

ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎండోమెట్రియాయిడ్ కార్సినోమా, క్లియర్ సెల్ కార్సినోమాను అభివృద్ధి చేస్తుందంటున్నారు. వీటిని గుర్తించేందుకు MRI/అల్ట్రాసౌండ్ చేస్తారు. రిపోర్ట్స్​లో అసాధారణ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ ముప్పును తగ్గించొచ్చని చెబుతున్నారు.

News January 5, 2026

నేడు ‘హిల్ట్’పై చర్చ.. అసలేంటి పాలసీ?

image

TG: ‘హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫర్మేషన్(<<18601957>>హిల్ట్<<>>)’పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కాలుష్యాన్ని తగ్గించి సిటీ మధ్యలో ఉన్న పాతబడిన, కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను ORR వెలుపలికి తరలించడం. అలాగే పారిశ్రామిక వాడల్లోని భూములను ఆధునిక నివాస, వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చేయడమే ఉద్దేశంగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. అయితే ఇందులో స్కామ్ జరుగుతోందని BRS <<18457165>>ఆరోపిస్తోంది<<>>.

News January 5, 2026

ప్రాణాలు కాపాడుకొని.. సవాల్ విసరాలని!

image

మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది కీలక నేతలు మరణించగా అనేక మంది లొంగిపోయారు. ప్రస్తుతం దళంలో కొంతమందే మిగిలారు. అయితే డెడ్‌లైన్ నాటికి ప్రాణాలు కాపాడుకొని తమను నిర్మూలించలేరంటూ కేంద్రానికి సవాల్ విసరాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తిప్పిరి తిరుపతి సారథ్యంలోని దళాలు బలగాల కంటికి చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.

News January 5, 2026

నల్లమలసాగర్ ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ

image

TG: ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ పనులపై బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ సూచించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైనా నేడు విచారణ జరగనుంది.

News January 5, 2026

ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ESIC <<>>నవీ ముంబైలో 7 సర్జన్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. జనవరి 6న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సర్జన్‌కు నెలకు రూ.1,0,0,600, మెడికల్ ఆఫీసర్‌కు రూ.85వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 5, 2026

సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

image

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్‌లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్‌కే ఉంది. తాజాగా యాషెస్‌లో ఆయన 41వ సెంచరీ సాధించారు.

News January 5, 2026

అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

image

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్‌లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.

News January 5, 2026

రబీ వరిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయా?

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ఒక్కో ప్రాంతంలో ఒక్కో దశలో ఉంది. అయితే వరి ప్రారంభ దశ నుంచి జింకు లోపం, కాండం తొలుచు పురుగు పంటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జింకు లోపం వల్ల వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వచ్చి పైరు సరిగా పెరగదు. ఇక కాండం తొలుచు పురుగు మొక్క మొవ్వులోకి చొచ్చుకెళ్లి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వరిలో జింకు లోపం, కాండం తొలుచు పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 5, 2026

జాగ్రత్త..! మళ్లీ పెరిగిన చలి

image

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఈ నెల 12 వరకు కోల్డ్ వేవ్స్ వీస్తాయని IMD ఇప్పటికే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. చలి నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.