India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేషనల్ హైవేలపై ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 500M పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్కు ₹25L, మరుసటి ఏడాదీ యాక్సిడెంట్ జరిగితే ₹50L ఫైన్ విధించనుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్(BOT) విధానంలో నిర్మించే రోడ్లకు దీన్ని వర్తింపజేస్తామని, ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని ఓ అధికారి వెల్లడించారు.

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి(89) అనారోగ్యంతో రెండు రోజుల కిందట మరణించారు. బిహార్లోని స్వస్థలం గోపాల్గంజ్లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీమ్ ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ(99) రెండేళ్ల క్రితం చనిపోయారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగు వారికీ దగ్గరైన విషయం తెలిసిందే.

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్తో పాటు పలువురిని కలిశారు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. కార్తీక మాసంలో సోమవారం, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు భక్తులకు మైకుల ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని జిల్లా ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. బారికేడ్లు పటిష్ఠంగా ఉంచాలని సూచించింది. ఒకే ప్రదేశంలో భారీ జనసమూహం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

శుభ్మన్ గిల్ బ్యాటింగ్పై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అతడు T20ల్లో వరుసగా విఫలం అవుతున్నా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్సుల స్కోర్ 20, 10, 5, 47, 29, 4, 12, 37*, 5, 15 (ఈరోజు)గా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. దీంతో గిల్ను పక్కనబెట్టి యశస్వీ జైస్వాల్కు ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.