India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న MI, SRH మ్యాచ్లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్ను బంతి తాకక ముందే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లౌవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.
తాను సినిమాలు తీయడం మానేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఖండించారు. ‘నేను ఫిల్మ్ మేకింగ్ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నా. 2028 వరకు డేట్స్ ఖాళీ లేవు. 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. త్వరలోనే రిలీజ్ అవుతాయి. నేను నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీది మీరు..’ అంటూ అసభ్య పదజాలంతో <
తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారు. క్వింటా కనీస ధర రూ.800, గరిష్ఠ ధర రూ.1,480 పలుకుతోంది. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉంది. ఈ సీజన్లో సాగు పెరగడం, క్వాలిటీ లేకపోవడం ధరల పతనానికి కారణాలుగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర రూ.1,500 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-20గా ఉంది.
IPLలో వరుసగా విఫలమవుతున్న SRH స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తొలి మ్యాచులో సెంచరీతో రాణించినా ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచుల్లోనూ ఆయన తేలిపోయారు. శతకం తర్వాత జరిగిన 6 మ్యాచుల్లో కలిపి 32 పరుగులే చేశారు. ముంబైతో జరిగిన మ్యాచులోనూ సింగిల్ డిజిట్కే ఔటయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో ఇషాన్ను రూ.11.25 కోట్లకు తీసుకుని SRH భారీ మూల్యమే చెల్లించుకుంటోందని ఫైర్ అవుతున్నారు.
గుడ్ ఫ్రైడే రోజున ఏసుక్రీస్తు శిలువపై మరణించారని క్రైస్తవులు విశ్వసిస్తారు. మానవాళి సంక్షేమం కోసం ప్రేమ, కరుణ, క్షమాపణ లాంటి గొప్ప సద్గుణాల్ని ఏసు బోధిస్తుంటారు. అది నచ్చని అప్పటి రాజులు క్రీస్తును శిలువ వేస్తారు. ఆ రోజునే క్రైస్తవులు గుడ్ఫ్రైడేగా జరుపుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి తమ పాపాలకు ఏసును క్షమాపణ అడుగుతారు. ఇది జరిగిన 3వ రోజు ఆయన మళ్లీ జన్మించారనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు.
AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై ఆయన అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలకపాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన మూవీకి ప్లస్ పాయింట్ అని, అయితే స్టోరీ ఊహించేలా ఉందని పోస్టులు చేస్తున్నారు. కాసేపట్లో Way2News ఫుల్ రివ్యూ.
TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీట్వీట్ చేసి నోటీసులు అందుకున్న సీనియర్ IAS ఆఫీసర్ స్మిత సభర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఎక్స్లో రెండు మూడు పోస్టులను ఆమె రీట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన ఓ పోస్టును స్మిత రీట్వీట్ చేశారు. ఈ పోస్టుల్లోనూ AIతో క్రియేట్ చేసిన నెమళ్లు, బుల్డోజర్లు ఉండటం విశేషం.
AP: 18వ పార్లమెంట్ సమావేశాలకు TDP MPలు కలిశెట్టి అప్పలనాయుడు, GM హరీశ్ 99 శాతం హాజరై టాప్లో నిలిచారు. వైజాగ్ MP శ్రీభరత్ (97), చిత్తూరు MP ప్రసాద్ (93) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తక్కువ హాజరుతో YCP MP అవినాశ్ (54) చివరి స్థానంలో ఉన్నారు. ప్రశ్నలు సంధించడంలోనూ కలిశెట్టి ముందున్నారు. ఆయన మొత్తం 89 ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మాగుంట (84) ఉన్నారు. జనసేన MP తంగెళ్ల ఉదయ్ తక్కువగా 22 ప్రశ్నలే అడిగారు.
IPLలో ముంబైతో జరిగే మ్యాచులో SRH 300 స్కోర్ కొడుతుందన్న సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ <<16106276>>డేల్ స్టెయిన్<<>> వ్యాఖ్యలకు ముంబై ఇండియన్స్ కౌంటరిచ్చింది. ‘డేల్ స్టెయిన్ చెప్పినట్లే ఎగ్జాక్ట్గా 328 పరుగులు వచ్చాయి. (రెండు జట్లు కలిపి చేసిన స్కోరు)’ అంటూ Xలో సెటైర్ వేసింది. కాగా SRH 300 ఎప్పుడు కొడుతుందా అన్న నెటిజన్ల చర్చపై గతంలో స్టెయిన్ స్పందించారు. MIతో జరిగే మ్యాచులోనే ఈ ఫీట్ నమోదవుతుందని ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.