News August 13, 2025

EP34: ఈ 5 లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు: చాణక్య నీతి

image

ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడో చాణక్య నీతి వివరించింది. ఈ 5 లక్షణాలను వదులుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుందని పేర్కొంది.
*అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం
*అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం
*నిన్ను నువ్వే కించ పరుచుకోవడం
*మార్పునకు భయపడటం
*గతంలోనే జీవించడం <<-se>>#Chanakyaneeti<<>>

News August 13, 2025

ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్నిగంటల్లో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, ములుగు, నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేటలో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. HYDలోనూ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తోంది.

News August 13, 2025

నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News August 13, 2025

పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

E20 పెట్రోల్‌పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

image

E20 పెట్రోల్‌పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్‌తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.

News August 13, 2025

సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

image

భారతదేశం <<17381479>>సెమీ కండక్టర్<<>> రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AP, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లు మంజూరు కావడంపై తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.

News August 13, 2025

పైరసీ పెరగడానికి నిర్మాతలు, ప్రభుత్వాలే కారణమా?

image

సినిమా పైరసీ పెరగడానికి నిర్మాతలు, GOVTలే పరోక్షంగా కారణమనే సమాధానాలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. కొత్త సినిమాలకు ప్రత్యేక రేట్లతో స్పెషల్ <<17383707>>GOలిస్తూ <<>>జేబులు గుల్ల చేస్తున్నాయి. ఒక టికెట్ ₹500-800 అయితే, పాప్‌కార్న్ ఖర్చు కలిపి ఇద్దరు వెళ్తే ₹2000 ఆవిరి కావాల్సిందే. OTTలో చూడాలంటే ఆ రేట్లు భరించలేక ప్రతీ సినిమాకు స్పెషల్ రేట్లు పెట్టలేక పైరసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అభిమానులు చెబుతున్నారు.

News August 13, 2025

గూగుల్‌ క్రోమ్ కోసం ‘పెర్‌ప్లెక్సిటీ AI’ భారీ ఆఫర్

image

GOOGLE క్రోమ్ కోసం పెర్‌ప్లెక్సిటీ AI సంస్థ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ బ్రౌజర్‌కు అది చాలా తక్కువ కావొచ్చు. కానీ, పెర్‌ప్లెక్సిటీకి చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారో కూడా వెల్లడించలేదు. ఆన్‌లైన్ సెర్చ్‌లో గుత్తాధిపత్యం సరికాదని.. క్రోమ్‌ను అమ్మేయాలని గతేడాది US కోర్ట్ సూచించింది. దానిపై ఆ సంస్థ పోరాడుతుంది గానీ, బ్రౌజర్‌ని అమ్మదని నిపుణులు చెబుతున్నారు.

News August 13, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

హైదారాబాద్‌లో వర్షం మొదలైంది. వాతావరణ నిపుణులు చెప్పినట్లుగానే అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. ఈశాన్య భాగం నుంచి వర్షం మొదలైంది. 3 గంటల కల్లా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

News August 13, 2025

ఆల్ట్‌మన్-మస్క్.. ఎవరు నమ్మదగిన వ్యక్తి?

image

OPEN AI CEO శామ్ ఆల్ట్‌మన్‌ని ఎలాన్ మస్క్ తనదైనశైలిలో ట్రోల్ చేశారు. ‘ఆల్ట్‌మన్, మస్క్‌లో ఎవరు నమ్మదగిన వ్యక్తి?’ అని ChatGPTని అడిగారు. అదేమో ఎలాన్ మస్క్ అని చెప్పింది. ఆ విషయాన్ని ‘X’లో పోస్ట్ చేశారు. కొసమెరుపేంటంటే కామెంట్స్‌లో ఓ యూజర్ Grokని అదే ప్రశ్న అడగ్గా.. అది మాత్రం ఆల్ట్‌మన్ పేరు చెప్పింది. మొత్తానికి ఎవరు తయారు చేసిన AIలు వారినే నమ్మట్లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.