India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఉగ్రదాడి ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ చౌకీదార్ ప్రభుత్వం సొంత ప్రజలపై లాఠీ ఝులిపిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటంలో బిజీగా ఉండి సరిహద్దుల్లో రక్షణ కల్పించడంలో ఫెయిలైందని దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీజీ. ఇదిగో మీ లాఠీ. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించే వారిపై కాకుండా మన శత్రువులపై ఉపయోగించండి’ అని లాఠీ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.
AP: పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కవలలు టెన్త్ ఫలితాల్లో సాధించిన మార్కులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బలిజిపేట (M) వంతరాం గ్రామానికి చెందిన బెవర శ్రవణ్, బెవర సింధు కవలలు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ఇద్దరికీ 582 చొప్పున మార్కులు రాగా, స్థానికంగా ఈ విషయం ఆసక్తి రేపింది. మంచి మార్కులు సాధించినందుకు వీరి తల్లిదండ్రులు ఉమా, రాము సంతోషపడ్డారు.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లోని ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు PMLA కింద కేసు నమోదు చేసింది. ఫిట్జీ తమకు సంబంధించిన కొన్ని కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేయడం ద్వారా రూ.11.11 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్కు కూడా పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.
AP: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పాలిసెట్-2025 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://polycetap.nic.in సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు కేవలం ఆన్లైన్ విధానంలోనే అందుబాటులో ఉంటాయని, పోస్ట్ లేదా ఇతర ఆఫ్లైన్ పద్ధతుల్లో పంపబోమని అధికారులు స్పష్టం చేశారు.
పహల్గామ్ దాడి అమాయకులపై జరిగింది కాదని, మొత్తం కశ్మీర్పై జరిగిన దాడి అని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కశ్మీరీలు మౌనం వీడి, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని ఆయన ఎక్స్లో పిలుపునిచ్చారు. ‘పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడి నా హృదయాన్ని మెలిపెట్టింది. ఈ దుశ్చర్య చూసి రక్తం మరిగిపోతోంది. ఇలాంటి చర్యలను అస్సలు క్షమించకూడదు. ఇదో పిరికిపంద చర్య’ అని ఆయన సుదీర్ఘ నోట్ రాశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యలను రాష్ట్రపతికి వివరించారు. దేశ భద్రత, పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలపై చర్చించారు.
పహల్గామ్ దాడిపై భారతావని కంటతడి ఆగకముందే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. ఏప్రిల్ 23న డ్యూటీ చేస్తూ పొరపాటున సరిహద్దు దాటిన BSF జవానును పాకిస్థాన్ రేంజర్లు బంధించారు. ఫిరోజ్పూర్ (పంజాబ్) వద్ద సైనికుడు తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే అరెస్టు చేశామని పాక్ సైన్యం చెబుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉందని ప్రకటించిన కేంద్రం ఆ దేశంపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ పలు నిర్ణయాలు తీసుకుంది.
* అట్టారీ- వాఘా బార్డర్ మూసివేత
* భారతీయులకు సార్క్ వీసాలు రద్దు
* భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెగదెంపులు
* సింధూ జలాలను ఆపడం యుద్ధం ప్రకటించడమే అని ప్రకటన
* పాక్లోని భారతీయులు వెనక్కి వెళ్లాలని ఆదేశం
ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. జూన్ 1న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు SLPRB ప్రకటనలో పేర్కొంది. వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతిలో ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. 6,100 పోస్టులకు మొత్తం 4,59,182 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయగా 95,208 మంది ఫిజికల్ టెస్టుకు అర్హత సాధించారు. దేహధారుడ్య పరీక్షల్లో 38,910 మంది ఫైనల్ టెస్టుకు క్వాలిఫై అయ్యారు.
పహల్గాం దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తుండటంతో పాక్ అప్రమత్తమైంది. సైనికులకు సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం, ఇప్పటికే లీవ్లో ఉన్నవారు వెంటనే వెనక్కి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు, దేనికైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు స్పష్టం చేసిందట. అటు ఎయిర్ అటాక్స్ భయంతో భారత విమానాలకు తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.